ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడాది పాటు వేర్వేరు నగరాల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటై ఉత్సవాలను పర్యవేక్షిస్తోంది. వేర్వేరు వర్గాలకు చెందిన ప్రముఖులు ఎన్టీఆర్ తో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న తరుణంలోనే ఆయన పేరుతో ఓ నాణెం విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఆరు నెలలుగా జరుగుతున్న కసరత్తు ఈ దిశగా ఒక కొలిక్కి వచ్చింది. పూర్తిగా వెండితో తయారు చేసిన వంద రూపాయల నాణెన్ని కేంద్రం ముద్రిస్తోంది.
ఎన్టీఆర్ తనయ, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని ఇటీవల మింట్ అంటే టంకశాల అధికారులు కలిశారు. జాయింట్ జనరల్ మేనేజర్ గుండపునీడి శ్రీనివాస్ హైదరాబాద్ నివాసంలో ఆమెతో భేటీ అయి కాయిన్ నమూనాపై చర్చించారు. సలహాలు సూచనలు తీసుకున్నారు. వంద కాయిన్ పై వేయాల్సిన ఎన్టీఆర్ ఫోటోను పైనలైజ్ చేశారు. అధికారులు ఒకటి రెండు ఫోటోలు చూపించగా అందులో ఒక దానిని పురంధేశ్వరి ఫైనలైజ్ చేశారు. ఆ ఫోటో చాలా హుందాగా ఉంటుందని ఎన్టీఆర్ కుటుంబం అభిప్రాయపడింది. తర్వలోనే ఎన్టీఆర్ ఫోటో ఉన్న వెండి కాయిన్ ను కేంద్రం విడుదల చేస్తుంది..
This post was last modified on February 15, 2023 9:46 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…