భాషాభిమానం ఉండొచ్చు. కానీ, అది కొంతవరకు మాత్రమే పరిమితం కావాలి. కానీ, కర్ణాటకలో ఇప్పుడు ఈ అభిమానం మాటున జరుగుతున్న దాడులు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాదీ సింగర్ మంగ్లీ కన్నడలో మాట్లాడకపోవడంపై కన్నడ భాషాభిమానులు మండిపడ్డారు. ఆమె కారుపై దాడి జరిగినట్లు ఫొటోలతో సహా వార్తలు కూడా వచ్చాయి.
ఇక, ఇప్పుడు తాజాగా ప్రముఖ నేపథ్య గాయకుడు కైలాష్ ఖేర్పైనా ఇదే భాషాభిమానంతో కొందరు దుండగులు వాటర్ బాటిళ్లు విసరడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరలోని హంపిలో జరుగుతున్న ‘హంపి ఉత్సవ్’ ముగింపు కార్యక్రమంలో సింగర్ కైలాష్ ఖేర్ పాల్గొన్నారు. ఈ
కార్యక్రమానికి హాజరయిన వారిలో జోష్ నింపేందుకు కొన్ని పాటలను పాడారు. అయితే.. కన్నడ పాటలు పాడలేదనే కారణంగా ఒకతను కైలాష్ ఖేర్పై కొందరు వాటర్ బాటిళ్లు విసిరారు. కన్నడ పాటలు పాడించుకోవాలనుకుంటే కన్నడ గాయకులనే ఆహ్వానించాలని, కైలాష్ ఖేర్ కన్నడ సినిమాల్లో చాలా పాటలు పాడిన విషయాన్ని గుర్తుచేసుకోవాలని ట్విట్టర్లో కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
మరికొందరేమో.. భాషను అభిమానించడంలో ఎవరికీ అభ్యంతరం లేదని, కానీ.. ఆ భాష మాట్లాడని వారిపై భౌతిక దాడులకు దిగడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హర్షించదగ్గ పరిణామం కాదని ట్వీట్స్ చేశారు. మొత్తానికి భాషాభిమానం పేరుతో ఇలా దాడులకు దిగడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
This post was last modified on January 30, 2023 4:43 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…