భాషాభిమానం ఉండొచ్చు. కానీ, అది కొంతవరకు మాత్రమే పరిమితం కావాలి. కానీ, కర్ణాటకలో ఇప్పుడు ఈ అభిమానం మాటున జరుగుతున్న దాడులు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాదీ సింగర్ మంగ్లీ కన్నడలో మాట్లాడకపోవడంపై కన్నడ భాషాభిమానులు మండిపడ్డారు. ఆమె కారుపై దాడి జరిగినట్లు ఫొటోలతో సహా వార్తలు కూడా వచ్చాయి.
ఇక, ఇప్పుడు తాజాగా ప్రముఖ నేపథ్య గాయకుడు కైలాష్ ఖేర్పైనా ఇదే భాషాభిమానంతో కొందరు దుండగులు వాటర్ బాటిళ్లు విసరడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరలోని హంపిలో జరుగుతున్న ‘హంపి ఉత్సవ్’ ముగింపు కార్యక్రమంలో సింగర్ కైలాష్ ఖేర్ పాల్గొన్నారు. ఈ
కార్యక్రమానికి హాజరయిన వారిలో జోష్ నింపేందుకు కొన్ని పాటలను పాడారు. అయితే.. కన్నడ పాటలు పాడలేదనే కారణంగా ఒకతను కైలాష్ ఖేర్పై కొందరు వాటర్ బాటిళ్లు విసిరారు. కన్నడ పాటలు పాడించుకోవాలనుకుంటే కన్నడ గాయకులనే ఆహ్వానించాలని, కైలాష్ ఖేర్ కన్నడ సినిమాల్లో చాలా పాటలు పాడిన విషయాన్ని గుర్తుచేసుకోవాలని ట్విట్టర్లో కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
మరికొందరేమో.. భాషను అభిమానించడంలో ఎవరికీ అభ్యంతరం లేదని, కానీ.. ఆ భాష మాట్లాడని వారిపై భౌతిక దాడులకు దిగడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హర్షించదగ్గ పరిణామం కాదని ట్వీట్స్ చేశారు. మొత్తానికి భాషాభిమానం పేరుతో ఇలా దాడులకు దిగడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
This post was last modified on January 30, 2023 4:43 pm
నిన్న జరిగిన తండేల్ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ విజయాలకు…
ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో ఒక్కోసారి అవకాశాలు అంత వేగంగా రావు. హిట్టు పడినా సరే కొన్నిసార్లు దురదృష్టం పలకరించి…
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…
ఇంగ్లండ్పై టీ20, వన్డే సిరీస్లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్…