న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్ వచ్చేసింది. మార్చి నుంచి వాయిదా పడి ఆగస్ట్ కు వెళ్ళిపోయాక అభిమానులు దీని కోసం ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.
దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని రెండోసారి చేతులు కలపడంతో అంచనాలు మాములుగా లేవు. అందులోనూ అనిరుధ్ రవిచందర్ సంగీతం అంటే హైప్ ఎక్కడికి వెళ్తుందో వేరే చెప్పాలా. నాని పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన ఈ పాటను కొంచెం ఆలస్యమైనా ఎట్టకేలకు ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. మూవీ లవర్స్ ఊహించుకున్నంత రేంజ్ లో ఉందా అంటే ఔననే చెప్పాలి.
ఆయా షేర్ అంటూ నాని క్యారెక్టరైజేషన్ ని వర్ణిస్తూ గీత రచయిత కాసర్ల శ్యామ్ చేసిన పద ప్రయోగాలు ఊర మాస్ గా ఉన్నాయి. మొలతాడు లేకపోయినా మగతనం నాదే, దుస్తులు లేకపోయినా దమ్మునోడిని నేనే అని అర్థం వచ్చేలా చాలా డెప్త్ గా అయితే వెళ్లారు.
అనిరుద్ రిథమ్, ఇన్స్ ట్రుమెన్ టేషన్ సంగీత ప్రియులు కోరుకున్న స్థాయిలోనే ఉంది. అసలు హైలైట్ నాని ఎప్పుడూ లేనంత జోష్ గా కొత్త రకం స్టెప్పులు వేయడం. నేల మీద మోకాళ్ళతో కూచుకుని సిగెరెట్ వెలిగించుకుని అటు నుంచి ఇటు వెళ్లే మూమెంట్, జడలతో వేసిన సిగ్నేచర్ స్టెప్ అభిమానులకు థియేటర్ మెటీరియలనే నమ్మకాన్ని ఇచ్చాయి.
మాములుగా అనిరుధ్ పాటలు స్లో పాయిజన్ లా ఎక్కుతాయి. దేవర టైటిల్ సాంగ్ మొదట మిశ్రమ స్పందన తెచ్చుకుని తర్వాత చార్ట్ బస్టర్ అయ్యింది. కానీ ప్యారడైజ్ ఆయా షేర్ మాత్రం అంత టైం తీసుకునేలా లేదు. రెండు జడలతో నాని చేయబోయే మాస్ ర్యాంపేజీ పాటల్లోనే ఇలా ఉంటే ఇక యాక్షన్ ఎపిసోడ్లు, ఫైట్లలో ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పాలా.
కీలక దశలో షూటింగ్ లో ఉన్న ప్యారడైజ్ లో కయదు లోహర్ హీరోయిన్ కాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయెల్ విలన్లుగా నటించగా సంపూర్ణేష్ బాబు ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. మొత్తానికి ఆయా షేర్ గట్టి సౌండ్ చేసేలా ఉంది. చూడాలి.
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…