సంక్రాంతి సంబరాలకు రాష్ట్రం మొత్తం రెడీ అవుతుంటే.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గం మాత్రం.. భారీ ఎత్తున కోడి పందేలకు రెడీ అవుతోంది. వైసీపీకి చెందిన కీలక నేతల కనుసన్నల్లో ఇక్కడ బరులు రెడీ అయ్యాయి. ఒక్కొక్క బరికి రెండు ఎకరాలు కేటాయించారు. భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ఏసీలు, పార్కింగ్.. ఇందులోనూ వైఐపీ, ఏ గ్రేడ్ వీఐపీ, బీ గ్రేడ్ వీఐపీ అంటూ.. వివిధ రకాల పాసులు కూడా రెడీ చేశారు.
ఒక్కొక్క బరిలో పోటీ పడే కోళ్లు.. వాటి సత్తా.. ఆట తీరు.. ఇలా అనేక ప్రమాణాలను అనుసరించి.. ఫ్లడ్ లైట్ల కాంతుల్లో శుక్రవారం నుంచి సోమవారం వరకు ఈ పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక, గ్రేడ్ ఏ పాస్ 60000, గ్రేడ్ బి పాస్ 40000, వీఐపీ పాస్ 25000 చొప్పులన విక్రయిస్తున్నారు. పాసులు తీసుకున్న వారు మూడు రోజుల్లో ఎప్పుడైనా రావొచ్చు పోవచ్చు. వీరి వెంట ఇద్దరిని మాత్రమే అనుమతిస్తున్నారు.
వీరికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మద్యం కోరుకునేవారికి వేరేగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. వీఐపీలు అందరికీ.. ఏసీ హాళ్లలో క్వాలిటి చికెన్ బిర్యాని, బ్రేక్ ఫాస్ట్లో 15 రకాల టిఫెన్లు ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో చికెన్, మటన్, చైనా, జపాన్ ఆహార పదార్థాలను కూడా రెడీ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి చెఫ్లను రప్పించినట్టు తెలుస్తోంది.
అయితే..డబ్బులు కట్టినా కూడా ఎవరికి పడితే వారికి ఎంట్రీ లేకపోవడం గమనార్హం. స్థానికంగా ఉన్న కొందరు ప్రజాప్రతినిధుల అనుచరుల కనుసన్నల్లోవారు చెప్పిన వారికే ఈ టికెట్లు విక్రయిస్తున్నారు. ఇదీ.. సంగతి!!
This post was last modified on January 13, 2023 9:09 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…