అప్పుడే పెళ్లైంది. కానీ.. పెళ్లైన గంటకే కట్టుకున్న పెళ్లానికి విడాకులు ఇచ్చేసిన విచిత్రమైన ఉదంతం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ విచిత్రం ఇక్కడితో ఆగిపోలేదు. మరింత సాగింది. పెళ్లి చేసుకున్న భార్యకు గంట తిరిగేసరికి విడాకులు ఇచ్చేయటమే కాదు.. తన తమ్ముడికిచ్చి పెళ్లి చేసిన షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. ఎందుకిలా? ఎలా సాధ్యమైందన్న విషయాల్లోకి వెళితే
యూపీలోని సంభాల్ జిల్లాలో ఈ విచిత్ర ఘటనకు వేదికైంది. జిల్లాలోని సైద్ నగలి అనే గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. భార్య.. భర్తల మధ్య పంచాయితీలు.. గొడవలు సాగేవి. దీంతో.. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి ఎవరి దారి వారిది అన్నట్లు బతికేశారు. ఈ క్రమంలో సదరు వ్యక్తికి ఊళ్లో మరో యువతితో పరిచయం కావటం.. వారి మధ్య లంకె కుదిరింది.
దీంతో వీరి వ్యవహారం పెళ్లి పీటల వరకు వచ్చింది. ఇరువురు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్లే రెండు రోజుల క్రితం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా పెళ్లి అయ్యిందో లేదో మహా డ్రామాకు తెర లేచింది. పుట్టింటికి వెళ్లిపోయిన భార్య పెళ్లి మండపానికి వచ్చింది. తాను బతికే ఉన్నానని.. అలంటప్పుడు తన భర్త వేరే వారితో ఎలా పెళ్లి చేసుకుంటారన్న లా పాయింట్ తీసింది.
కోపంతో పుట్టింటికి వెళ్లిపోయిన భార్య మళ్లీ తిరిగి రాదన్న భావనతో ఉన్న పెళ్లి కొడుక్కి ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. అనుకోని రీతిలో భార్య ఎంట్రీ ఇవ్వటం.. పోలీసు కేసు పెడతానని బెదిరించటంతో.. విషయం మరీ రచ్చ కాకుండా ఉండటానికి వీలు లేకుండా ఊళ్లోనే పంచాయితీ పెట్టారు. చివరకు విచిత్రమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.
పెళ్లి చేసుకున్న జంట విడాకులు తీసుకోవాలని డిసైడ్ చేయటమే కాదు.. రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయిని పెళ్లికొడుకు తమ్ముడితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో.. ఈ ఇష్యూను ఒక కొలిక్కి తెచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ విచిత్రమైన తీర్పు యవ్వారం సోషల్ మీడియాలో పోస్టుగా రావటంతో విషయం బయటకు వచ్చింది. దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. యూపీలోని ఊళ్ల పంచాయితీలు ఏ రీతిలో ఉంటాయన్న దానికి తాజా ఉదంతం ఒక చక్కటి ఉదాహరణగా చెబుతున్నారు.
This post was last modified on January 6, 2023 10:37 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…