దేశంలో ఘోరాలు.. ఘోరంగా జరుగుతున్నాయి. మనుషులను చంపేయడం.. ఏ చీమనో.. దోమనో చంపేసినంత తేలికగా మారిపోయింది. అంతేకాదు.. ఆ చంపిన వారు.. అక్కడితో కూడా ఆగడం లేదు. సదరు మృత దేహాలను ముక్కలు ముక్కలుగా నరికి.. ఇష్టానుసారం విసిరేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ఘటనలో ఆమె ప్రియుడు ఆమెను 35 ముక్కలు చేసి.. అడవిలో విసరేసిన ఘటన ఉలిక్కి పడేలా చేసింది.
అయితే.. తాజాగా బిహార్లో చోటు చేసుకున్న ఘటన దీనికి బాబు అనిపించే రేంజ్లో సాగింది. తన చెల్లెలిని ప్రేమించిన ఓయుకుడిని.. సదరు అన్న చంపేశాడు. అక్కడితో ఆగలేదు. ఆ ప్రియుడి మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. కుక్కలకు ఆహారంగా వేశాడు. ఆ కుక్కలు తినగా మిగిలిన శరీర భాగాలను నదిలో విసిరేసి.. వికృతానందం పొందాడు.
అత్యంత పాశవికం.. అమానుషమైన ఈ ఘటన దేశాన్ని కదిలించివేసింది. బిహార్లోని నలంద బిట్టు కుమార్.. ఈ నెల 16వ తేదీన బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో అతడి కోసం కుటుంబ సభ్యులు వెతకగా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో డిసెంబరు 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణలో భాగంగా నిందితుడు రాహుల్పై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు.
అతడి దగ్గర ఉన్న బాధితుడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ జరపగా.. రాహుల్ నేరాన్ని ఒప్పుకున్నాడు. తన సోదరితో బిట్టు సన్నిహితంగా ఉండడం చూశానని అది తట్టుకోలేకపోయానని రాహుల్ పోలీసులకు తెలిపాడు. కోపంతో బిట్టును చంపేందుకు ప్లాన్ చేశానని చెప్పాడు.
డిసెంబరు 16న తన సోదరి మొబైల్ నుంచి ఫోన్ చేసి బిట్టును నిర్మానుష్య ప్రదేశానికి పిలిచానని, అనంతరం అతడిని చంపానని తెలిపాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా పెట్టానని.. అవి వదిలేసిన మిగతా శరీర భాగాలను నదిలోకి విసిరేశానని ఒప్పుకున్నాడు. ఈ ఘటన మనసున్న ప్రతి ఒక్కరినీ కలచి వేసింది. ఇంతకీ ఎందుకు ఇంత ఘోరం చేశాడంటే.. తన చెల్లిని ప్రేమించిన బిట్టు దళితుడు కావడమే!!
This post was last modified on December 28, 2022 5:37 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…