Trends

చెల్లెలి ప్రియుడిని చంపేసి.. కుక్క‌ల‌కు ఆహారం..

దేశంలో ఘోరాలు.. ఘోరంగా జ‌రుగుతున్నాయి. మనుషుల‌ను చంపేయ‌డం.. ఏ చీమ‌నో.. దోమ‌నో చంపేసినంత తేలిక‌గా మారిపోయింది. అంతేకాదు.. ఆ చంపిన వారు.. అక్క‌డితో కూడా ఆగ‌డం లేదు. స‌ద‌రు మృత దేహాల‌ను ముక్క‌లు ముక్క‌లుగా న‌రికి.. ఇష్టానుసారం విసిరేస్తున్నారు. ఇటీవ‌ల ఢిల్లీలో శ్ర‌ద్ధా వాక‌ర్ ఘ‌ట‌న‌లో ఆమె ప్రియుడు ఆమెను 35 ముక్క‌లు చేసి.. అడ‌విలో విస‌రేసిన ఘ‌ట‌న ఉలిక్కి ప‌డేలా చేసింది.

అయితే.. తాజాగా బిహార్‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న దీనికి బాబు అనిపించే రేంజ్‌లో సాగింది. త‌న చెల్లెలిని ప్రేమించిన ఓయుకుడిని.. స‌ద‌రు అన్న చంపేశాడు. అక్క‌డితో ఆగ‌లేదు. ఆ ప్రియుడి మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. కుక్కలకు ఆహారంగా వేశాడు. ఆ కుక్క‌లు తిన‌గా మిగిలిన శ‌రీర భాగాల‌ను నదిలో విసిరేసి.. వికృతానందం పొందాడు.

అత్యంత పాశ‌వికం.. అమానుష‌మైన ఈ ఘ‌ట‌న దేశాన్ని కదిలించివేసింది. బిహార్లోని నలంద బిట్టు కుమార్.. ఈ నెల 16వ తేదీన బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో అతడి కోసం కుటుంబ సభ్యులు వెతకగా ఆచూకీ లభించలేదు. ఈ క్ర‌మంలో డిసెంబరు 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణలో భాగంగా నిందితుడు రాహుల్పై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు.

అతడి దగ్గర ఉన్న బాధితుడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ జరపగా.. రాహుల్ నేరాన్ని ఒప్పుకున్నాడు. తన సోదరితో బిట్టు సన్నిహితంగా ఉండడం చూశానని అది తట్టుకోలేకపోయానని రాహుల్ పోలీసులకు తెలిపాడు. కోపంతో బిట్టును చంపేందుకు ప్లాన్ చేశానని చెప్పాడు.

డిసెంబరు 16న తన సోదరి మొబైల్ నుంచి ఫోన్ చేసి బిట్టును నిర్మానుష్య ప్రదేశానికి పిలిచానని, అనంతరం అతడిని చంపానని తెలిపాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా పెట్టానని.. అవి వ‌దిలేసిన మిగతా శ‌రీర భాగాల‌ను నదిలోకి విసిరేశానని ఒప్పుకున్నాడు. ఈ ఘ‌ట‌న మ‌న‌సున్న ప్ర‌తి ఒక్క‌రినీ క‌ల‌చి వేసింది. ఇంత‌కీ ఎందుకు ఇంత ఘోరం చేశాడంటే.. త‌న చెల్లిని ప్రేమించిన బిట్టు ద‌ళితుడు కావ‌డ‌మే!!

This post was last modified on December 28, 2022 5:37 pm

Share
Show comments
Published by
Satya
Tags: Crime

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago