సెక్సుకు కూడా ఒక హద్దు ఉండాలనేది భారతీయ సంప్రదాయం. సరే.. ఇప్పుడుపాశ్చాత్య పోకడలు వచ్చిన తర్వాత..ఒకరు కాదు ఇద్దరు అంటున్నారు. పోనీ.. దానికైనా కట్టుబడి ఉండాలి కదా! అలా ఉండకపోవడమే.. అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఏకంగా ఇద్దరిని పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో కాపురం పెట్టిన వ్యక్తి.. మరో మహిళపై కన్నేశాడు. చివరకు తొలి భార్య చేతిలో అతను హతమయ్యాడు! ఈ దారుణం తెలంగాణలోనే జరిగింది.
ఏం జరిగిందంటే..
ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట డీజిల్ కాలనీకి చెందిన జిన్నారపు వేణుకుమార్ (34) చిట్టిల వ్యాపారి. అతనికి రెండుపెళ్లిళ్లయి.. ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరిలో తొలి భార్య రైల్వే ఉద్యోగం చేస్తోంది. రెండో ఆమె ఇంట్లో వంట వార్పు చూస్తోంది. ఇక, వీరిద్దరినీ కూడా ఒకే ఇంట్లో కాపురం పెట్టిన వేణు.. మరో పక్క చూపు చూశాడు. తన దైనందిన ప్రయాణంలో మహబూబాబాద్కు చెందిన మరో మహిళ పరిచయం కావడంతో ఆమెతోనూ రిలేషన్ పెట్టుకున్నాడు.
అంతేకాదు.. ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఇద్దరు భార్యలకు చూపిస్తూ మానసికంగా వేధింపులకు గురి చేశాడు. దీన్ని తట్టుకోలేకపోయిన మొదటి భార్య తనకు దగ్గరి బంధువైన భూపాలపల్లి జిల్లాకు చెందిన ఒక రౌడీషీటర్కు రూ.4 లక్షల సుఫారీ ఇచ్చి తన భర్తను హత్య చేయాలని చెప్పింది. పథకం ప్రకారం సెప్టెంబర్ 30న మొదటి భార్య.. వేణుకు పాయసంలో నిద్రమాత్రలు కలిపి తాగించింది. వేణుకుమార్ నిద్రలోకి జారుకున్న తర్వాత అప్పటికే వేచి ఉన్న నిందితుల సహకారంతో కారులో పెద్దపల్లి జిల్లా మంథని వద్ద ఉన్న మానేరు వాగు సమీపంలో వేణుకుమార్ను గొంతు నులిమి హత్య చేశారు.
అనంతరం ఏమి తెలియనట్లు అక్టోబర్ 2న భర్త వేణుకుమార్ కనిపించడం లేదంటూ మొదటి భార్య కాజీపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అనుమానం వచ్చిన పోలీసులు.. మొదటి భార్య కాల్ లిస్ట్ ను బయటకు తీశారు. ఇంకేముంది బండారం బయటపడడంతో ఆమెను, రెండో భార్యను, వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను కూడా అరెస్టు చేశారు. అతి ఎప్పటికైనా విషాదానికి దారితీస్తుందని ఊరికేనే చెప్పలేదు కదా! ఇదీ అంతే!!
This post was last modified on December 20, 2022 10:18 pm
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…