Trends

రూ.2వేల నోటుపై ఆర్బీఐ చెప్పిన నిజం!

సరిగ్గా ఆరేళ్ల క్రితం.. రాత్రి వేళలో టీవీ స్క్రీన్ల మీద లైవ్ లో ప్రత్యక్షమైన ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన వైనాన్ని ప్రకటించి దేశ ప్రజలతో పాటు.. పలు దేశాలను సైతం ఆశ్చర్యానికి గురి చేశారు. పెద్ద నోట్ల రద్దు అంటూ అప్పట్లో చెలామణీలో ఉన్న వెయ్యి రూపాయిలు.. రూ.500 నోట్లు రాత్రికి రాత్రి రద్దు అయినట్లుగా చెప్పటంలో ఒక్కసారి అవాక్కు అయిన పరిస్థితి. అనంతరం వాటి స్థానే రూ.2వేల నోట్ ను తీసుకొచ్చి.. కొంతకాలానికి రూ.500నోట్లను తేవటం తెలిసిందే.

గడిచిన కొద్దికాలంగా రూ.2వేల నోట్లు పెద్దగా బయట లభించని పరిస్థితి. తాజాగా సమాచార హక్కుచట్టం కింద రూ.2వేల నోటు గురించి వివరాల్ని అడిగిన ఒక కార్యకర్తకు ఆర్బీఐ బదులిచ్చింది. దాని సారాంశం ఏమంటే.. 2019-2020, 2020-2021, 2021-2022లలో ఒక్కటంటే ఒక్క రూ.2దవేల నోటును కూడా ప్రింట్ చేయలేదని స్పష్టం చేసింది. ఎందుకిలా అన్న దానికి కారణాలు స్పష్టంగా వెల్లడించనప్పటికీ.. రూ.2వేల నోటును క్రమంగా వెనక్కి తీసుకుంటారన్న ప్రచారం నిజమన్న విషయం తాజా సమాధానంతో స్పష్టమైందని చెప్పాలి.

2016-17 ఆర్థిక సంవత్సరంలో 3542.9 మిలియన్ రెండు వేల నోట్లను ప్రింట్ చేయగా.. ఆ సంఖ్య 2017-18లో 111.5కు తగ్గిపోయిందని పేర్కొంది. అంతేకాదు 2018-19లో 46.49 మిలియన్ నోట్లుగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 2 వేల నకిలీ నోట్ల సంఖ్య 2016-2020 మధ్య 2277నుంచి 2.44లక్షలకు పెరిగిన వైనం తెలిసిందే. అంటే.. ఒరిజినల్ రూ.2వేల నోట్లు గణనీయంగా తగ్గిపోతే.. అందుకు భిన్నంగా డూప్లికేట్ నోట్లు మాత్రం చెలామణీలోకి వస్తున్న వైనం ఆర్ బీఐ ఇచ్చిన తాజా సమాధానం స్పష్టం చేసిందని చెప్పాలి.

This post was last modified on November 9, 2022 4:18 pm

Share

Recent Posts

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

1 hour ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

1 hour ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

2 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

3 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

3 hours ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

4 hours ago