లైఫ్ ను ప్రభావితం నిర్ణయాలు తీసుకునే వేళలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అందులో ఏ మాత్రం ఏమరుపాటుతో వ్యవహరించినా విషాదమే. అలాంటి ఉదంతమే ఒకటి విశాఖలో చోటు చేసుకుంది. విశాఖపట్నంలో లా కాలేజీలో చదువుతున్న లా స్టూడెంట్ ఒకరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్న శ్రావణి వైనం సంచలనంగా మారింది. ఆమె విషాద ఉదంతం గురించి తెలిసిన వారంతా అయ్యో పాపం అనేసే పరిస్థితి.
గుంటూరుకు చెందిన 22 ఏళ్ల శ్రావణి విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు కాలేజీలో లా చదువుతోంది. అదే కాలేజీలో సీనియర్ అయిన వినయ్ కుమార్ తో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. అతనికి అప్పటికే పెళ్లై.. విడాకులు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇంట్లో వాళ్లకు తెలీకుండా ఐదు నెలల క్రితం శ్రావణి అతడ్ని రహస్యంగా పెళ్లాడింది. ఒకవైపు లా కోర్సు చేస్తూనే మరోవైపు పార్ట్ టైమ్ జాబ్ చేస్తోంది. ఇక.. వినయ్ కుమార్ రెస్టారెంట్ లో పని చేస్తున్నాడు.
పెళ్లై.. ఐదు నెలల గడిచాయో లేదో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. మూడు రోజుల క్రితం ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో భర్త వినయ్ గురించి శ్రావణి కంప్లైంట్ చేసింది. దీంతో.. వారిద్దరినీ పిలిచిన పోలీసులు.. స్టేషన్ మొదటి అంతస్తులో కౌన్సెలింగ్ నిర్వహించారు. మధ్యలో బయటకు వచ్చిన ఆమె.. స్టేషన్ కిందకు వచ్చి.. ‘నేను తప్పు చేశా’ అంటూ పెద్దగా రోదిస్తూ.. తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటి మీద పోసుకుంది.
ఈ ఉదంతాన్ని గమనించిన పోలీసులు.. ఎస్ఐ శ్రీనివాస్ కు తెలియజేశారు. దీంతో.. ఆయన పరుగు పరుగున కిందకు వచ్చారు. అప్పటికే అగ్గిపుల్ల వెలిగిస్తున్న ఆమెనుఅడ్డుకునే ప్రయత్నం చేయగా.. అప్పటికే మంటలు అంటుకొన్నాయి. ఆర్పే ప్రయత్నంలో ఎస్ఐ చేతులకు గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించగా.. కాసేపటికే మరణించింది. ప్రేమించిన వాడిని రహస్యంగా పెళ్లాడి.. విభేదాలతో అర్థాంతంగా ప్రాణాల్ని తీసుకున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
This post was last modified on October 21, 2022 11:34 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…