Trends

పెళ్లైన 5 నెలలకే విశాఖ పోలీస్ స్టేషన్ ఎదుట సూసైడ్!

లైఫ్ ను ప్రభావితం నిర్ణయాలు తీసుకునే వేళలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అందులో ఏ మాత్రం ఏమరుపాటుతో వ్యవహరించినా విషాదమే. అలాంటి ఉదంతమే ఒకటి విశాఖలో చోటు చేసుకుంది. విశాఖపట్నంలో లా కాలేజీలో చదువుతున్న లా స్టూడెంట్ ఒకరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్న శ్రావణి వైనం సంచలనంగా మారింది. ఆమె విషాద ఉదంతం గురించి తెలిసిన వారంతా అయ్యో పాపం అనేసే పరిస్థితి.

గుంటూరుకు చెందిన 22 ఏళ్ల శ్రావణి విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు కాలేజీలో లా చదువుతోంది. అదే కాలేజీలో సీనియర్ అయిన వినయ్ కుమార్ తో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. అతనికి అప్పటికే పెళ్లై.. విడాకులు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇంట్లో వాళ్లకు తెలీకుండా ఐదు నెలల క్రితం శ్రావణి అతడ్ని రహస్యంగా పెళ్లాడింది. ఒకవైపు లా కోర్సు చేస్తూనే మరోవైపు పార్ట్ టైమ్ జాబ్ చేస్తోంది. ఇక.. వినయ్ కుమార్ రెస్టారెంట్ లో పని చేస్తున్నాడు.

పెళ్లై.. ఐదు నెలల గడిచాయో లేదో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. మూడు రోజుల క్రితం ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో భర్త వినయ్ గురించి శ్రావణి కంప్లైంట్ చేసింది. దీంతో.. వారిద్దరినీ పిలిచిన పోలీసులు.. స్టేషన్ మొదటి అంతస్తులో కౌన్సెలింగ్ నిర్వహించారు. మధ్యలో బయటకు వచ్చిన ఆమె.. స్టేషన్ కిందకు వచ్చి.. ‘నేను తప్పు చేశా’ అంటూ పెద్దగా రోదిస్తూ.. తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటి మీద పోసుకుంది.

ఈ ఉదంతాన్ని గమనించిన పోలీసులు.. ఎస్ఐ శ్రీనివాస్ కు తెలియజేశారు. దీంతో.. ఆయన పరుగు పరుగున కిందకు వచ్చారు. అప్పటికే అగ్గిపుల్ల వెలిగిస్తున్న ఆమెనుఅడ్డుకునే ప్రయత్నం చేయగా.. అప్పటికే మంటలు అంటుకొన్నాయి. ఆర్పే ప్రయత్నంలో ఎస్ఐ చేతులకు గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించగా.. కాసేపటికే మరణించింది. ప్రేమించిన వాడిని రహస్యంగా పెళ్లాడి.. విభేదాలతో అర్థాంతంగా ప్రాణాల్ని తీసుకున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

This post was last modified on October 21, 2022 11:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

2 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

3 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

7 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

8 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

8 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

9 hours ago