హైదరాబాద్ లో నేడు జరిగిన అలయ్ బలయ్ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని ప్రత్యేకార్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రసంగించిన చిరు…అక్కడికి వచ్చిన పలువురు ప్రముఖులను పేరుపేరునా ప్రశంసించారు. ఈ క్రమంలోనే గుర్తు పెట్టుకొని మరీ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారి గురించి ప్రస్తావించారు. ఆయనపై చిరు ప్రశంసలు కురిపించారు. అయితే, కాసేపటి తర్వాత అనూహ్యంగా చిరంజీవిపై గరికపాటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనం రేపుతోంది.
గరికపాటి ప్రసంగిస్తున్న సమయంలో చిరంజీవితో ఫోటోలు దిగడానికి కొంతమంది యువతీయువకులు స్టేజిపైకి వచ్చారు. గరికపాటి ప్రసంగాన్ని వారు పట్టించుకోలేదు. కెమెరామెన్లు, ఫోటో దిగాలనుకున్న అభిమానులందరూ.. చిరుని చుట్టుముట్టేయడంతో సభికుల అటెన్షన్ మొత్తం అటే వెళ్లింది. ఈ పరిణామంతో గరికపాటి ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో, చిరంజీవిపై గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘చిరంజీవి గారు…అటువైపు జరుగుతున్న ఫోటో సెషన్ని ఆపేయాలి, లేకపోతే నేను వెళ్లిపోతా…దయచేసి అక్కడ మీరు ఫోటో సెషన్ ఆపేసి ఇటువైపుకి రండి, నేను ప్రసంగాన్ని కొనసాగిస్తాను..లేదంటే వెళ్లిపోతాను..నాకు మొహమాటమేమీ లేదు’ అంటూ గరికపాటి సీరియస్ గా చెప్పడంతో సభికులతోపాటు చిరంజీవి కూడా షాకయ్యారు. దీంతో అక్కడున్నవారు గరికపాటికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
గరికపాటిగారి ప్రసంగానికి తన ఫొటో సెషన్ అడ్డుతగులుతోందని గ్రహించిన చిరు…సెల్ఫీలు ఆపి తన సీటులోకి వచ్చి కూర్చున్నారు. దీంతో, గరికపాటి తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు. ఈ వ్యవహారంలో గరికపాటి నొచ్చుకోకుండా, చాలా కూల్గా చిరంజీవి వ్యవహిరించిన తీరు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుందని సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ఏది ఏమైనా..చిరంజీవిపై గరికపాటి కామెంట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
This post was last modified on October 6, 2022 5:34 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…