నిరుద్యోగులకు, ఉద్యోగాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్న ఫ్రెషర్లకు ఐటీ కంపెనీలు భారీ షాకిస్తున్నాయి. చేసుకున్న రిక్రూట్మెంట్లను వాపసు తీసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతుందని అనుకుంటున్న ఆర్థిక మాంద్యం భయమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్, క్యాంపస్ సెలక్షన్ అన్నింటినీ కంపెనీలు రద్దు చేసుకుంటున్నాయి. దాంతో ఉద్యోగాలకు ఎంపికయ్యామని సంతోషంగా ఉన్న వాళ్ళందరికీ తీవ్ర నిరాశ తప్పటం లేదు.
ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ నేపథ్యంలో దాదాపు రెండేళ్లు ఐటీ కంపెనీలు పెద్దగా రిక్రూట్మెంట్ చేయలేదు. ఎంతో అవసరమైన పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నాయి. ఇదే సమయంలో వివిధ కారణాలతో వేలాదిమంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసేశారు. దాంతో మళ్ళీ ఆ ఉద్యోగాలను భర్తీ చేసుకోవాల్సిన అవసరం కంపెనీలపై పడింది. దానికి అదనంగా కొత్త ఉద్యోగాలను కూడా సృష్టించి భారీ ఎత్తున రిక్రూట్మెంట్లకు దిగాయి.
డైరెక్టుగాను, క్యాంపస్ సెలక్షన్ల పేరుతో విప్రో, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్ కంపెనీలు వేలాదిమందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. ఈ కంపెనీలన్నీ ఎంపికైన వారికి ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చాయి. అయితే హఠాత్తుగా తామిచ్చిన ఆఫర్ లెటర్లను వాపసు తీసుకుంటు ఎంపికైన ఉద్యోగులందరికీ ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇస్తున్నాయట. కంపెనీల ఎకడమిక్ ఎలిజిబులిటీ నిబంధనలకు తగ్గట్లుగా లేని కారణంగా ఆపర్ లెటర్లను వాపసుతీసుకుంటున్నట్లు ఈమెయిళ్ళల్లో కంపెనీలు చెబుతున్నాయట.
నిజానికి ఎంపికలన్నీ అనేక దశల ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్ల నిర్వహణ తర్వాతే జరిగాయి. అప్పట్లో గుర్తుకురాని ఎకడమిక్ ఎలిజిబులిటి నిబంధనలు ఆఫర్లు లెటర్లు ఇచ్చిన మూడు, నాలుగు నెలల తర్వాత గుర్తుకురావటమే ఆశ్చర్యంగా ఉంది. కంపెనీల వైఖరిపై ఉద్యోగాలు చేజారిపోయిన వారంతా మండిపడుతున్నారు. దీనికి ప్రదాన కారణం ఏమిటంటే తొందరలోనే ప్రపంచ ఆర్ధిక మాంద్యం రాబోతోందనే సూచనలే కారణమని తెలుస్తోంది. ఇదే విషయమై అమెరికాలోని చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే కార్యక్రమంలో బిజీగా ఉన్నాయట. మన కంపెనీలు కూడా అదే బాటలో నడవాలని డిసైడ్ అవటంతోనే ఆఫర్ లెటర్లు వెనక్కు తీసుకుంటున్నట్లు సమాచారం.
This post was last modified on October 4, 2022 12:46 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…