Trends

షాకిస్తున్న ఐటీ కంపెనీలు

నిరుద్యోగులకు, ఉద్యోగాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్న ఫ్రెషర్లకు ఐటీ కంపెనీలు భారీ షాకిస్తున్నాయి. చేసుకున్న రిక్రూట్మెంట్లను వాపసు తీసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతుందని అనుకుంటున్న ఆర్థిక మాంద్యం భయమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్, క్యాంపస్ సెలక్షన్ అన్నింటినీ కంపెనీలు రద్దు చేసుకుంటున్నాయి. దాంతో ఉద్యోగాలకు ఎంపికయ్యామని సంతోషంగా ఉన్న వాళ్ళందరికీ తీవ్ర నిరాశ తప్పటం లేదు.

ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ నేపథ్యంలో దాదాపు రెండేళ్లు ఐటీ కంపెనీలు పెద్దగా రిక్రూట్మెంట్ చేయలేదు. ఎంతో అవసరమైన పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నాయి. ఇదే సమయంలో వివిధ కారణాలతో వేలాదిమంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసేశారు. దాంతో మళ్ళీ ఆ ఉద్యోగాలను భర్తీ చేసుకోవాల్సిన అవసరం కంపెనీలపై పడింది. దానికి అదనంగా కొత్త ఉద్యోగాలను కూడా సృష్టించి భారీ ఎత్తున రిక్రూట్మెంట్లకు దిగాయి.

డైరెక్టుగాను, క్యాంపస్ సెలక్షన్ల పేరుతో విప్రో, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్ కంపెనీలు వేలాదిమందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. ఈ కంపెనీలన్నీ ఎంపికైన వారికి ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చాయి. అయితే హఠాత్తుగా తామిచ్చిన ఆఫర్ లెటర్లను వాపసు తీసుకుంటు ఎంపికైన ఉద్యోగులందరికీ ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇస్తున్నాయట. కంపెనీల ఎకడమిక్ ఎలిజిబులిటీ నిబంధనలకు తగ్గట్లుగా లేని కారణంగా ఆపర్ లెటర్లను వాపసుతీసుకుంటున్నట్లు ఈమెయిళ్ళల్లో కంపెనీలు చెబుతున్నాయట.

నిజానికి ఎంపికలన్నీ అనేక దశల ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్ల నిర్వహణ తర్వాతే జరిగాయి. అప్పట్లో గుర్తుకురాని ఎకడమిక్ ఎలిజిబులిటి నిబంధనలు ఆఫర్లు లెటర్లు ఇచ్చిన మూడు, నాలుగు నెలల తర్వాత గుర్తుకురావటమే ఆశ్చర్యంగా ఉంది. కంపెనీల వైఖరిపై ఉద్యోగాలు చేజారిపోయిన వారంతా మండిపడుతున్నారు. దీనికి ప్రదాన కారణం ఏమిటంటే తొందరలోనే ప్రపంచ ఆర్ధిక మాంద్యం రాబోతోందనే సూచనలే కారణమని తెలుస్తోంది. ఇదే విషయమై అమెరికాలోని చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే కార్యక్రమంలో బిజీగా ఉన్నాయట. మన కంపెనీలు కూడా అదే బాటలో నడవాలని డిసైడ్ అవటంతోనే ఆఫర్ లెటర్లు వెనక్కు తీసుకుంటున్నట్లు సమాచారం.

This post was last modified on October 4, 2022 12:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిత్య ఆరోగ్యానికి సంజీవని… సోంపు

సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…

4 hours ago

బాబును చూసి బిత్తరపోయిన మంత్రులు, అధికారులు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…

4 hours ago

ఉప ఎన్నికలు రావడం ఖాయం.. కేసీఆర్ ధీమా

తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…

6 hours ago

కేఎల్ రాహుల్‌ కు అన్యాయం చేస్తున్నారా?

ఇంగ్లండ్‌పై టీ20, వన్డే సిరీస్‌లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్‌ ఆర్డర్‌పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్‌…

10 hours ago

వైరల్ వీడియో… కోహ్లీ హగ్ ఇచ్చిన లక్కీ లేడీ ఎవరు?

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…

11 hours ago

“నా ఆశయాలు పవన్ నెరవేర్చుతాడు” : రాజకీయాలపై చిరు!

గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి.…

11 hours ago