ఐరోపా దేశాల్లో ఉన్నట్లు మనదేశంలో కూడా ప్రైవేటు జైళ్ళు ఎందుకు నిర్మించకూడదు ? ఇది ఎవరో వేసిన ప్రశ్నకాదు. ఒక కేసు విచారణ సందర్భంగా స్వయాన సుప్రీంకోర్టు చేసిన కామెంట్. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ప్రైవేటు జైళ్ళ నిర్మాణ ప్రస్తావన తెచ్చిందో వెంటనే ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేసు విచారణ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ మన జైళ్ళలో రద్దీ బాగా పెరిగిపోయిందని అభిప్రాయపడ్డారు. మన జైళ్ళల్లో అత్యధికం నరకాలకన్నా మరీ అన్యాయంగా ఉంటుంది.
రద్దీ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనదేశంలో కూడా ప్రైవేటు జైళ్ళు నిర్మించాలి కోర్టు అభిప్రాయపడింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ (సీఎస్ఆర్) కింద కార్పొరేట్ సంస్ధలే ప్రైవేటు జైళ్ళ నిర్మాణానికి పూనుకోవాలని కూడా సుప్రీంకోర్టు పిలుపిచ్చింది. నిజానికి ఇపుడు సుప్రీంకోర్టు చెప్పిన ప్రైవేటు జైళ్ళ నిర్మాణం చాలా మంచి ఆలోచనే. డబ్బులుండి ఎంతైనా ఖర్చులు పెట్టుకోగలిగిన వారు ప్రైవేటు జైళ్ళల్లో ఉంటారు. ఇపుడున్న జైళ్ళన్నీ దశాబ్దాల క్రితం కట్టినవే.
అందుకనే వాటిలో సౌకర్యాలు పెద్దగా ఉండవు. పైగా మనదేశంలో కేసుల విచారణ పేరుతోనే లక్షలమంది నిందితులను జైళ్ళల్లోనే పెట్టేస్తున్నారు. జైళ్ళ నుండి విడుదలయ్యేవారికన్నా లోపలకు వెళ్ళే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. ఇందుకనే ఏ జైలులో చూసినా ఖైదీలు దాని కెపాసిటికి మించే ఉంటున్నారు. దీనివల్ల జైలు లోపల కనీస సౌకర్యాలు కూడా సరిగా ఉండటం లేదు. జైలు గదులు, బాత్ రూములు, భోజనానికి, వంటకు అన్నింటికీ ఇబ్బందులుగానే ఉంటున్నది.
ఇదే ప్రైవేటు జైలు అయితే నిర్మాణం, నిర్వహణ అంతా కార్పొరేట్ సంస్ధలే చూసుకుంటాయి. కాబట్టి అత్యాధునిక సౌకర్యాలుంటాయనటంలో సందేహంలేదు. బ్యాంకులకు డబ్బు ఎగవేత కేసులో విచారణ ఎదుర్కొంటున్న విజయ మాల్యా కూడా విచారణ సందర్భంగా జైళ్ళలో సౌకర్యాలు సరిగా ఉండవు కాబట్టి తాను భారత్ వెళ్ళనని బ్రిటన్ కోర్టులో చెప్పిన విషయం తెలిసిందే.
This post was last modified on September 30, 2022 10:21 am
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…