Trends

కోహ్లి ఇన్‌స్టాలో ఒక్క పోస్టు పెడితే..


విరాట్ కోహ్లి ఇప్పుడు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కాదు. మూడు ఫార్మాట్లలోనూ అతను కెప్టెన్సీకి దూరం అయ్యాడు. అతడి ఫామ్ కూడా మునుపటి స్థాయిలో లేదు. దాదాపు రెండున్నరేళ్ల పాటు ఏ ఫార్మాట్లోనూ సెంచరీ చేయక చాలా ఇబ్బంది పడ్డాడు. ఒక దశలో సెంచరీ సంగతి పక్కన పెట్టి అర్ధశతకాలు సాధించడం కూడా కష్టమైపోయింది. ఐతే ఇటీవల ఆసియా కప్ నుంచి అతను పర్వాలేదనిపిస్తున్నాడు.

ఐతే ఆట తగ్గినా, కెప్టెన్సీకి దూరం అయినా అతడి ఆకర్షణ ఏమీ తగ్గిపోలేదు. తన బ్రాండ్ వాల్యూ ఏమీ పడిపోలేదు. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న స్పోర్ట్స్ పర్సన్ అతనే కావడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లి ఒక్క ప్రమోషనల్ పోస్టు పెడితే ఏకంగా రూ.8.9 కోట్లు ఇస్తారట. ఒక బిజినెస్ పోర్టల్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ సంస్థ ఫిలిం, స్పోర్ట్స్ పర్సన్స్ బ్రాండ్ వాల్యూను అంచనా వేస్తుంటుంది.

ఇన్‌స్టా‌గ్రామ్‌లో కోహ్లికి ఏకంగా 21.5 కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇండియాలో అత్యధిక ఇన్‌స్టా ఫాలోవర్లున్న క్రికెటర్ అతనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క పోస్టు పెడితే 21.5 కోట్ల మందికి రీచ్ అవుతుంటే అంతకంటే ప్రచారం ఇంకేం కావాలి. అందుకే పెయిడ్ పోస్టులకు ప్రకటనల సంస్థలు ఆ స్థాయిలో డబ్బులిస్తాయన్నమాట. కోహ్లి అప్పుడప్పుడూ ఇన్‌స్టాలో కొన్ని బ్రాండ్లను ప్రచారం చేస్తుంటాడు.

ఇక ప్రపంచ స్థాయిలో ఒక ఇన్‌స్టా పోస్టు ద్వారా అత్యధిక మొత్తంలో ఆర్జించే స్పోర్ట్స్ పర్సన్ పోర్చుగల్ ఫుట్ బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అట. అతడికి ఇన్‌స్టాలో 40 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. అతను ఒక పోస్టు పెడితే రూ.18 కోట్లు చెల్లిస్తారట. మరో ఫుట్ బాల్ స్టార్ లయొనెల్ మెస్సికి ఇన్‌స్టాలో 36 కోట్ల దాకా ఫాలోవర్లు ఉండగా.. అతడికి ఒక్కో పోస్టుకు రూ.14 కోట్ల దాకా చెల్లిస్తారట. ఇండియాలో కోహ్లి తర్వాత ప్రస్తుతం అత్యధిక బ్రాండ్ వాల్యూ ఉన్న స్పోర్ట్స్ పర్సన్ ధోనీనే.

Satya

Recent Posts

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

2 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

7 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

9 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

9 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

11 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

13 hours ago