అబార్షన్లకు సంబంధించి దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లితో నిమిత్తం లేకుండా అబార్షన్ చేయించుకునే హక్కు మహిళలకు ఉందని చరిత్రాత్మక తీర్పునిచ్చింది. పెళ్లి కాలేదన్న ఏకైకా కారణంతో అబార్షన్ ను అడ్డుకోలేరని సుప్రీంకోర్టు వెల్లడించింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్ట ప్రకారం మహిళలందరికీ సురక్షితమైన అబార్షన్ చేయించుకునే హక్కుందని సుప్రీంకోర్టు తెలిపింది.
ఆ అబార్షన్ చట్టం ప్రకారం వివాహిత, అవివాహిత మహిళలకు తేడా లేదని సుప్రీంకోర్టు తెలిపింది. గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. అంతేకాదు, భార్యతో బలవంతపు శృంగారాన్ని నేరంగా పరిగణించాలని సుప్రీం కోర్టు చెప్పింది. భార్యను భర్త బలవంతం చేస్తే అది రేప్ అవుతుందని స్పష్టం చేసింది. ప్రెగ్నెన్సీకి సంబంధించిన మెడికల్ టర్మినేషన్ కేసులో తీర్పు సందర్భంగా సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ఒంటరి, అవివాహిత మహిళలకు కూడా అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ ఆధునిక కాలంలో చట్టం అనేది వ్యక్తుల హక్కులకు వివాహం ఒక ముందస్తు షరతు అనే భావనను తొలగిస్తోందని సుప్రీం కోర్టు తెలిపింది. ఏది ఏమైనా సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పు ఇపుడు మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ తీర్పును కొందరు స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
This post was last modified on September 29, 2022 3:21 pm
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసిన రెండు సినిమాలతోనే చాలా ప్రామిసింగ్గా అనిపించిన వారసుల్లో ధ్రువ్ విక్రమ్ ఒకడు. అర్జున్…
సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో నటించినపుడు చిన్న సన్నివేశమైనా సరే సుక్కునే తీయాల్సి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…