సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి రెండో రాణిగా వ్యవహరించి.. తనదైన శైలిలో పాలనను ముందుకు తీసుకువెళ్లిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-2(96) (Elizabeth) కన్నుమూశారు. గత అక్టోబర్ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె భారత కాలమానం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. స్కాట్ల్యాండ్లోని బాల్మోరల్ ప్యాలెస్లో చికిత్స పొందుతున్న రాణి ఎలిజబెత్ గురువారం మధ్యాహ్నం(బ్రిటన్ సమయం) కన్నుమూసినట్టు ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి.
సుదీర్ఘకాలంపాటు బ్రిటన్ను పరిపాలించిన పాలకురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. రాణి మరణంతో యావత్ బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది. రాణి ఎలిజబెత్ను గత ఏడాది అక్టోబర్ నుంచే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నడవడం, నిలబడడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అప్పటినుంచి స్కాట్లాండ్లోని బాల్మోరల్ క్యాజిల్లో ఉంటున్న ఆమె.. అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
సీనియర్ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనాల్సి ఉన్నప్పటికీ వైద్యుల సూచన మేరకు అందుకు దూరంగా ఉన్నారు. అయితే, రెండు రోజుల క్రితమే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ స్కాట్లాండ్కు వెళ్లి రాణి ఎలిజబెత్ను గురువారం ఉదయమే కలుసుకున్నారు. రాణి ఎలిజబెత్ 2 ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు రావడంపై బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ స్పందించారు. ఎలిజబెత్ ఆరోగ్యంపై తనతో పాటు యావత్ దేశం ఆందోళన చెందుతోందన్నారు. తనతోపాటు దేశ ప్రజలందరూ ఆమె కోసం ప్రార్థిస్తున్నామని అన్నారు. కానీ, ఇంతలోనే ఆమె కన్నుమూశారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…