సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి రెండో రాణిగా వ్యవహరించి.. తనదైన శైలిలో పాలనను ముందుకు తీసుకువెళ్లిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-2(96) (Elizabeth) కన్నుమూశారు. గత అక్టోబర్ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె భారత కాలమానం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. స్కాట్ల్యాండ్లోని బాల్మోరల్ ప్యాలెస్లో చికిత్స పొందుతున్న రాణి ఎలిజబెత్ గురువారం మధ్యాహ్నం(బ్రిటన్ సమయం) కన్నుమూసినట్టు ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి.
సుదీర్ఘకాలంపాటు బ్రిటన్ను పరిపాలించిన పాలకురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. రాణి మరణంతో యావత్ బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది. రాణి ఎలిజబెత్ను గత ఏడాది అక్టోబర్ నుంచే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నడవడం, నిలబడడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అప్పటినుంచి స్కాట్లాండ్లోని బాల్మోరల్ క్యాజిల్లో ఉంటున్న ఆమె.. అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
సీనియర్ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనాల్సి ఉన్నప్పటికీ వైద్యుల సూచన మేరకు అందుకు దూరంగా ఉన్నారు. అయితే, రెండు రోజుల క్రితమే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ స్కాట్లాండ్కు వెళ్లి రాణి ఎలిజబెత్ను గురువారం ఉదయమే కలుసుకున్నారు. రాణి ఎలిజబెత్ 2 ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు రావడంపై బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ స్పందించారు. ఎలిజబెత్ ఆరోగ్యంపై తనతో పాటు యావత్ దేశం ఆందోళన చెందుతోందన్నారు. తనతోపాటు దేశ ప్రజలందరూ ఆమె కోసం ప్రార్థిస్తున్నామని అన్నారు. కానీ, ఇంతలోనే ఆమె కన్నుమూశారు.
This post was last modified on September 9, 2022 8:38 am
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…
ఇంగ్లండ్పై టీ20, వన్డే సిరీస్లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్…
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…
గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి.…