జీవితం క్షణ భంగురం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం. తన కంటే శక్తివంతుడు లేడనే మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో అస్సలు గుర్తించనే గుర్తించలేరు. కరోనా తర్వాత నుంచి మధ్యవయస్కులు అప్పటివరకు హుషారుగా ఉన్నట్లు ఉంటూనే ఒక్కసారిగా కుప్పకూలిపోవటం.. ప్రాణాలు విడిచే షాకింగ్ పరిణామాలు చూస్తున్నాం. ఇవెంతలా ఉంటున్నాయంటే.. మన కళ్లను మనం నమ్మలేని రీతిలో ఉంటున్నాయి.
ఈ మధ్యనే హైదరాబాద్ లో పంద్రాగస్టు వేళ ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని ఒక గేటెడ్ కమ్యునిటీలో నిర్వహించిన జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి.. పంద్రాగస్టు విశిష్టతను తెలియజేస్తూ.. చరిత్రలోకి వెళ్లటం.. మాట్లాడుతూ.. మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోవటం.. ప్రాణాలు గాల్లో కలవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.
ఇప్పుడు దాదాపు అలాంటి ఉదంతమే ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. 45 ఏళ్ల మధ్య వయస్కులైన ప్రభాత్ ప్రేమి.. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తుంటారు. గురువారం రాత్రి తన మిత్రుడి పుట్టినరోజు వేడుకలను భారీ ఎత్తున నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు వెళ్లిన ఆయన.. అక్కడ ప్లే అవుతున్న బాలీవుడ్ సాంగ్స్ కు తగ్గట్లుగా హుషారుగా స్టెప్పులు వేశారు.
ఆయన డ్యాన్స్ ను పలువురు రికార్డు చేస్తున్నారు. ఆయన డ్యాన్స్ కు విజిల్స్.. గోలతో ఆయన్ని అప్పటివరకు ప్రోత్సహిస్తున్న వారితో ఆయన మరింత హుషారుగా స్టెప్పులు వేస్తున్నారు. ఇలాంటి వేళ.. ఏమైందో ఏమో తెలీదు కానీ.. ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. అక్కడున్న వారు వెంటనే శ్వాస, నాడి చెక్ చేస్తే… ఆయన అప్పటికే ప్రాణాలతో లేడు. అప్పటివరకు అందరితో నవ్వుతూ.. తుళ్లుతూ హుషారుగా స్టెప్పులు వేస్తూ ఉన్న ఆయన ఒక్కసారిగా ప్రాణాలు విడిచిన వైనం అక్కడి వారిని నోట మాట రానివ్వని రీతిలో మారింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
This post was last modified on September 3, 2022 11:04 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…