జీవితం క్షణ భంగురం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం. తన కంటే శక్తివంతుడు లేడనే మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో అస్సలు గుర్తించనే గుర్తించలేరు. కరోనా తర్వాత నుంచి మధ్యవయస్కులు అప్పటివరకు హుషారుగా ఉన్నట్లు ఉంటూనే ఒక్కసారిగా కుప్పకూలిపోవటం.. ప్రాణాలు విడిచే షాకింగ్ పరిణామాలు చూస్తున్నాం. ఇవెంతలా ఉంటున్నాయంటే.. మన కళ్లను మనం నమ్మలేని రీతిలో ఉంటున్నాయి.
ఈ మధ్యనే హైదరాబాద్ లో పంద్రాగస్టు వేళ ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని ఒక గేటెడ్ కమ్యునిటీలో నిర్వహించిన జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి.. పంద్రాగస్టు విశిష్టతను తెలియజేస్తూ.. చరిత్రలోకి వెళ్లటం.. మాట్లాడుతూ.. మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోవటం.. ప్రాణాలు గాల్లో కలవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.
ఇప్పుడు దాదాపు అలాంటి ఉదంతమే ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. 45 ఏళ్ల మధ్య వయస్కులైన ప్రభాత్ ప్రేమి.. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తుంటారు. గురువారం రాత్రి తన మిత్రుడి పుట్టినరోజు వేడుకలను భారీ ఎత్తున నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు వెళ్లిన ఆయన.. అక్కడ ప్లే అవుతున్న బాలీవుడ్ సాంగ్స్ కు తగ్గట్లుగా హుషారుగా స్టెప్పులు వేశారు.
ఆయన డ్యాన్స్ ను పలువురు రికార్డు చేస్తున్నారు. ఆయన డ్యాన్స్ కు విజిల్స్.. గోలతో ఆయన్ని అప్పటివరకు ప్రోత్సహిస్తున్న వారితో ఆయన మరింత హుషారుగా స్టెప్పులు వేస్తున్నారు. ఇలాంటి వేళ.. ఏమైందో ఏమో తెలీదు కానీ.. ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. అక్కడున్న వారు వెంటనే శ్వాస, నాడి చెక్ చేస్తే… ఆయన అప్పటికే ప్రాణాలతో లేడు. అప్పటివరకు అందరితో నవ్వుతూ.. తుళ్లుతూ హుషారుగా స్టెప్పులు వేస్తూ ఉన్న ఆయన ఒక్కసారిగా ప్రాణాలు విడిచిన వైనం అక్కడి వారిని నోట మాట రానివ్వని రీతిలో మారింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
This post was last modified on September 3, 2022 11:04 am
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…