కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రఖ్యాత ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ఎత్తును కేవలం ఒక అడుగుకు పరిమితం చేయబోతున్నట్లు ఆ మధ్య ఉత్సవ కమిటీ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది. నిరుత్సాహానికి గురి చేసింది. ఈసారి కరోనా వల్ల ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునే అవకాశం లేకపోయినా.. కనీసం టీవీల్లో అయినా బడా గణేష్ను చూసే అవకాశం లేదే అనుకున్నారు.
మరీ విగ్రహం ఎత్తును ఒక్క అడుగుకు పరిమితం చేయడమేంటి అనుకున్నారు. ఐతే అలా అనుకున్న వాళ్లందరి నిరాశను పోగొట్టేలా విగ్రహ కమిటీ నిర్ణయాన్ని మార్చుకుంది. ఈసారి విగ్రహం ఎప్పట్లా 60-70 అడుగులు ఉండట్లేదు. అలాగే ఒకట్రెండు అడుగులకూ పరిమితం కావట్లేదు. మధ్యస్థంగా 27 ఎత్తుతో విగ్రహాన్ని రూపొందించాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది.
ఈసారి ఖైరతాబాద్ గణేష్కు సంబంధించి మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వైరస్ ముప్పు తొలగిపోవాలని ఆశిస్తూ విగ్రహాన్ని ‘ధన్వంతరి’ అవతారంలో ప్రతిష్ఠించబోతున్నారు. ఏమాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనాలు వాడకుండా పూర్తిగా మట్టితోనే విగ్రహాన్ని రూపొందించనున్నారు. విగ్రహం చేస్తోంది మట్టితో కావడంతో ప్రతిష్ఠించిన చోటే దాన్ని నిమజ్జనం చేసేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. గుజరాత్ నుంచి తెచ్చే ప్రత్యేకమైన మట్టితో విగ్రహం రూపొందించనున్నారు.
కరోనా నేపథ్యంలో విగ్రహ సందర్శనకు భక్తులు ఎవరినీ అనుమతించబోవడం లేదు. ఆన్ లైన్ ద్వారా రుసుము కట్టి పూజలు చేయించుకునే అవకాశం కల్పించనున్నారు. ఆగస్టు 22న వినాయక చవితి కాగా.. జులై 10న విగ్రహం తయారీ మొదలుపెట్టనున్నారు. సెప్టెంబరు 2న నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. పోలీసుల అనుమతి పొందాక ఈ మేరకు పనులు మొదలుపెడతామని ఉత్సవ కమిటీ ప్రకటించింది.
This post was last modified on July 3, 2020 4:29 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…