Trends

ఖైరతాబాద్ విగ్రహం ఒక అడుగు కాదు

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రఖ్యాత ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ఎత్తును కేవలం ఒక అడుగుకు పరిమితం చేయబోతున్నట్లు ఆ మధ్య ఉత్సవ కమిటీ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది. నిరుత్సాహానికి గురి చేసింది. ఈసారి కరోనా వల్ల ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునే అవకాశం లేకపోయినా.. కనీసం టీవీల్లో అయినా బడా గణేష్‌ను చూసే అవకాశం లేదే అనుకున్నారు.

మరీ విగ్రహం ఎత్తును ఒక్క అడుగుకు పరిమితం చేయడమేంటి అనుకున్నారు. ఐతే అలా అనుకున్న వాళ్లందరి నిరాశను పోగొట్టేలా విగ్రహ కమిటీ నిర్ణయాన్ని మార్చుకుంది. ఈసారి విగ్రహం ఎప్పట్లా 60-70 అడుగులు ఉండట్లేదు. అలాగే ఒకట్రెండు అడుగులకూ పరిమితం కావట్లేదు. మధ్యస్థంగా 27 ఎత్తుతో విగ్రహాన్ని రూపొందించాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది.

ఈసారి ఖైరతాబాద్ గణేష్‌కు సంబంధించి మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వైరస్ ముప్పు తొలగిపోవాలని ఆశిస్తూ విగ్రహాన్ని ‘ధన్వంతరి’ అవతారంలో ప్రతిష్ఠించబోతున్నారు. ఏమాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనాలు వాడకుండా పూర్తిగా మట్టితోనే విగ్రహాన్ని రూపొందించనున్నారు. విగ్రహం చేస్తోంది మట్టితో కావడంతో ప్రతిష్ఠించిన చోటే దాన్ని నిమజ్జనం చేసేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. గుజరాత్‌ నుంచి తెచ్చే ప్రత్యేకమైన మట్టితో విగ్రహం రూపొందించనున్నారు.

కరోనా నేపథ్యంలో విగ్రహ సందర్శనకు భక్తులు ఎవరినీ అనుమతించబోవడం లేదు. ఆన్ లైన్ ద్వారా రుసుము కట్టి పూజలు చేయించుకునే అవకాశం కల్పించనున్నారు. ఆగస్టు 22న వినాయక చవితి కాగా.. జులై 10న విగ్రహం తయారీ మొదలుపెట్టనున్నారు. సెప్టెంబరు 2న నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. పోలీసుల అనుమతి పొందాక ఈ మేరకు పనులు మొదలుపెడతామని ఉత్సవ కమిటీ ప్రకటించింది.

This post was last modified on July 3, 2020 4:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

2 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

2 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

3 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

3 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

4 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

5 hours ago