కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రఖ్యాత ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ఎత్తును కేవలం ఒక అడుగుకు పరిమితం చేయబోతున్నట్లు ఆ మధ్య ఉత్సవ కమిటీ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది. నిరుత్సాహానికి గురి చేసింది. ఈసారి కరోనా వల్ల ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునే అవకాశం లేకపోయినా.. కనీసం టీవీల్లో అయినా బడా గణేష్ను చూసే అవకాశం లేదే అనుకున్నారు.
మరీ విగ్రహం ఎత్తును ఒక్క అడుగుకు పరిమితం చేయడమేంటి అనుకున్నారు. ఐతే అలా అనుకున్న వాళ్లందరి నిరాశను పోగొట్టేలా విగ్రహ కమిటీ నిర్ణయాన్ని మార్చుకుంది. ఈసారి విగ్రహం ఎప్పట్లా 60-70 అడుగులు ఉండట్లేదు. అలాగే ఒకట్రెండు అడుగులకూ పరిమితం కావట్లేదు. మధ్యస్థంగా 27 ఎత్తుతో విగ్రహాన్ని రూపొందించాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది.
ఈసారి ఖైరతాబాద్ గణేష్కు సంబంధించి మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వైరస్ ముప్పు తొలగిపోవాలని ఆశిస్తూ విగ్రహాన్ని ‘ధన్వంతరి’ అవతారంలో ప్రతిష్ఠించబోతున్నారు. ఏమాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనాలు వాడకుండా పూర్తిగా మట్టితోనే విగ్రహాన్ని రూపొందించనున్నారు. విగ్రహం చేస్తోంది మట్టితో కావడంతో ప్రతిష్ఠించిన చోటే దాన్ని నిమజ్జనం చేసేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. గుజరాత్ నుంచి తెచ్చే ప్రత్యేకమైన మట్టితో విగ్రహం రూపొందించనున్నారు.
కరోనా నేపథ్యంలో విగ్రహ సందర్శనకు భక్తులు ఎవరినీ అనుమతించబోవడం లేదు. ఆన్ లైన్ ద్వారా రుసుము కట్టి పూజలు చేయించుకునే అవకాశం కల్పించనున్నారు. ఆగస్టు 22న వినాయక చవితి కాగా.. జులై 10న విగ్రహం తయారీ మొదలుపెట్టనున్నారు. సెప్టెంబరు 2న నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. పోలీసుల అనుమతి పొందాక ఈ మేరకు పనులు మొదలుపెడతామని ఉత్సవ కమిటీ ప్రకటించింది.
This post was last modified on July 3, 2020 4:29 pm
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…