Trends

ఖైరతాబాద్ విగ్రహం ఒక అడుగు కాదు

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రఖ్యాత ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ఎత్తును కేవలం ఒక అడుగుకు పరిమితం చేయబోతున్నట్లు ఆ మధ్య ఉత్సవ కమిటీ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది. నిరుత్సాహానికి గురి చేసింది. ఈసారి కరోనా వల్ల ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునే అవకాశం లేకపోయినా.. కనీసం టీవీల్లో అయినా బడా గణేష్‌ను చూసే అవకాశం లేదే అనుకున్నారు.

మరీ విగ్రహం ఎత్తును ఒక్క అడుగుకు పరిమితం చేయడమేంటి అనుకున్నారు. ఐతే అలా అనుకున్న వాళ్లందరి నిరాశను పోగొట్టేలా విగ్రహ కమిటీ నిర్ణయాన్ని మార్చుకుంది. ఈసారి విగ్రహం ఎప్పట్లా 60-70 అడుగులు ఉండట్లేదు. అలాగే ఒకట్రెండు అడుగులకూ పరిమితం కావట్లేదు. మధ్యస్థంగా 27 ఎత్తుతో విగ్రహాన్ని రూపొందించాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది.

ఈసారి ఖైరతాబాద్ గణేష్‌కు సంబంధించి మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వైరస్ ముప్పు తొలగిపోవాలని ఆశిస్తూ విగ్రహాన్ని ‘ధన్వంతరి’ అవతారంలో ప్రతిష్ఠించబోతున్నారు. ఏమాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనాలు వాడకుండా పూర్తిగా మట్టితోనే విగ్రహాన్ని రూపొందించనున్నారు. విగ్రహం చేస్తోంది మట్టితో కావడంతో ప్రతిష్ఠించిన చోటే దాన్ని నిమజ్జనం చేసేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. గుజరాత్‌ నుంచి తెచ్చే ప్రత్యేకమైన మట్టితో విగ్రహం రూపొందించనున్నారు.

కరోనా నేపథ్యంలో విగ్రహ సందర్శనకు భక్తులు ఎవరినీ అనుమతించబోవడం లేదు. ఆన్ లైన్ ద్వారా రుసుము కట్టి పూజలు చేయించుకునే అవకాశం కల్పించనున్నారు. ఆగస్టు 22న వినాయక చవితి కాగా.. జులై 10న విగ్రహం తయారీ మొదలుపెట్టనున్నారు. సెప్టెంబరు 2న నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. పోలీసుల అనుమతి పొందాక ఈ మేరకు పనులు మొదలుపెడతామని ఉత్సవ కమిటీ ప్రకటించింది.

This post was last modified on July 3, 2020 4:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

45 minutes ago

రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ

ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…

1 hour ago

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

2 hours ago

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

4 hours ago

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…

4 hours ago

స్వయంభు సౌండ్ చాలా పెంచాలి

ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…

4 hours ago