ఈ-కామర్స్ వెబ్ సైట్ల నుంచి ఒంటికి, ఇంటికి, ఆఫీసుకి, గుడికి, బడికి.. ఇలా దేనికైనా సరే, అవసరమైన ప్రతి వస్తువూ కొంటాం. కానీ అందులోంచి మద్యం కొనుగోలు చేసి ఇంటికి తెప్పించుకునే అవకాశం మాత్రం లేదు. విదేశాల్లో ఈ అవకాశం ఉంది. మన దగ్గర కూడా ఈ సౌలభ్యం కల్పిస్తే బాగుండని కోరుకునేవాళ్లు కోట్లలో ఉన్నారు. లాక్ డౌన్ షరతులు నడుస్తున్నపుడు ఈ అవకాశం కల్పించి ఉంటే ఎలా ఉండేదో అని ఎంతోమంది అనుకున్నారు.
ఐతే మందుబాబుల ఈ కల త్వరలో నెరవేరబోతోంది. ఇండియాలో కూడా ఈ-కామర్స్ వెబ్ సైట్ ద్వారా మద్యాన్ని ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకునే అవకాశం దక్కబోతోంది. ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా సంపాదించింది. త్వరలోనే ఆ సంస్థ తమ వెబ్ సైట్ ద్వారా అమ్మకాలు కూడా చేపట్టనుంది.
ఐతే మద్యం అమ్మకాలకు సంబంధించి అమేజాన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదు. మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ సర్కారు. ఆ రాష్ట్రంలో బీర్తో పాటు కొన్ని మద్యం ఉత్పత్తులను ఆన్ లైన్ ద్వారా అమ్మేందుకు అమేజాన్కు అనుమతులు ఇచ్చినట్లు రాయ్టర్స్ వార్తా సంస్థ ఓ కథనం ప్రచురించింది. మరో ఈ కామర్స్ సంస్థ బిగ్ బాస్కెట్ కూడా ఇదే రకమైన అనుమతులు పొందినట్లు ఆ సంస్థ పేర్కొంది.
ఎప్పట్నుంచి ఇలా అమ్మకాలు ప్రారంభిస్తారన్నది తెలియడం లేదు. లాక్ డౌన్ షరతులు ఎత్తేశాక మద్యం దుకాణాల ముందు భారీగా క్యూలు కనిపించిన సంగతి తెలిసిందే. నిర్దిష్ట సమయాల్లోనే అమ్మకాలు సాగుతుండటంతో ఇప్పటికీ దుకాణాల ముందు క్యూలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మందు బాబులు బయటికి వచ్చి కరోనా వ్యాప్తికి కారణం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బెంగాల్లో ఇది అమలైతే.. మిగతా రాష్ట్రాలు కూడా ఈ బాటలో నడిచే అవకాశముంది. ఇంతకీ దీనిపై కేంద్రం ఏమంటుందో చూడాలి.
This post was last modified on June 23, 2020 10:35 pm
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…