Trends

ఫలించనున్న కల.. అమేజాన్‌ నుంచి ఇంటికి మద్యం

ఈ-కామర్స్ వెబ్ సైట్ల నుంచి ఒంటికి, ఇంటికి, ఆఫీసుకి, గుడికి, బడికి.. ఇలా దేనికైనా సరే, అవసరమైన ప్రతి వస్తువూ కొంటాం. కానీ అందులోంచి మద్యం కొనుగోలు చేసి ఇంటికి తెప్పించుకునే అవకాశం మాత్రం లేదు. విదేశాల్లో ఈ అవకాశం ఉంది. మన దగ్గర కూడా ఈ సౌలభ్యం కల్పిస్తే బాగుండని కోరుకునేవాళ్లు కోట్లలో ఉన్నారు. లాక్ డౌన్ షరతులు నడుస్తున్నపుడు ఈ అవకాశం కల్పించి ఉంటే ఎలా ఉండేదో అని ఎంతోమంది అనుకున్నారు.

ఐతే మందుబాబుల ఈ కల త్వరలో నెరవేరబోతోంది. ఇండియాలో కూడా ఈ-కామర్స్ వెబ్ సైట్ ద్వారా మద్యాన్ని ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకునే అవకాశం దక్కబోతోంది. ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా సంపాదించింది. త్వరలోనే ఆ సంస్థ తమ వెబ్ సైట్ ద్వారా అమ్మకాలు కూడా చేపట్టనుంది.

ఐతే మద్యం అమ్మకాలకు సంబంధించి అమేజాన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదు. మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ సర్కారు. ఆ రాష్ట్రంలో బీర్‌తో పాటు కొన్ని మద్యం ఉత్పత్తులను ఆన్ లైన్ ద్వారా అమ్మేందుకు అమేజాన్‌కు అనుమతులు ఇచ్చినట్లు రాయ్‌టర్స్ వార్తా సంస్థ ఓ కథనం ప్రచురించింది. మరో ఈ కామర్స్ సంస్థ బిగ్ బాస్కెట్‌ కూడా ఇదే రకమైన అనుమతులు పొందినట్లు ఆ సంస్థ పేర్కొంది.

ఎప్పట్నుంచి ఇలా అమ్మకాలు ప్రారంభిస్తారన్నది తెలియడం లేదు. లాక్ డౌన్ షరతులు ఎత్తేశాక మద్యం దుకాణాల ముందు భారీగా క్యూలు కనిపించిన సంగతి తెలిసిందే. నిర్దిష్ట సమయాల్లోనే అమ్మకాలు సాగుతుండటంతో ఇప్పటికీ దుకాణాల ముందు క్యూలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మందు బాబులు బయటికి వచ్చి కరోనా వ్యాప్తికి కారణం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బెంగాల్‌లో ఇది అమలైతే.. మిగతా రాష్ట్రాలు కూడా ఈ బాటలో నడిచే అవకాశముంది. ఇంతకీ దీనిపై కేంద్రం ఏమంటుందో చూడాలి.

This post was last modified on June 23, 2020 10:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సమంత చేయనని చెప్పినా వదల్లేదు

టాలీవుడ్లో ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న సమంత.. ఇప్పుడు అవకాశాలే లేని స్థితికి చేరుకుంది. ఇందుకు ప్రధాన కారణం ఆమె…

30 mins ago

బీజేపీ మౌత్ పీస్‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. !

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇక‌, బీజేపీకి మౌత్ పీస్‌గా మార‌నున్నార‌నే సంకేతాలు అందుతున్నాయి. తాజాగా…

1 hour ago

వైవీ పోయి సాయిరెడ్డి వ‌చ్చే.. !

ఉత్త‌రాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్ విష‌యంలో వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న మార్పు చేశారు. గ‌తంలో ఉన్న‌ట్టుగానే…

1 hour ago

జపాన్ దేశంలో RRR మెంటల్ మాస్ రికార్డు

థియేటర్లలో రిలీజై రెండేళ్లు దాటిపోయింది కాబట్టి ఏదో టీవీలో వచ్చినప్పుడో, యూట్యూబ్ లో క్లిప్పులు చూసినప్పుడో తప్ప ఆర్ఆర్ఆర్ ని…

2 hours ago

గేమ్ చేంజర్ OTT రచ్చ వెనుక జరిగిందేంటి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో…

3 hours ago

అఖిల్ తిరుపతి బ్యాక్ డ్రాప్.. రంగంలోకి నాగ్!

అక్కినేని అఖిల్ ఏజెంట్ డిజాస్టర్ వలన ఒక్కసారిగా స్లో అయ్యాడు. తదుపరి సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కథలపై…

3 hours ago