మహిళలపై వేధింపులు అరికట్టేందుకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాదాన్యం ఇస్తోందని.. ఏపీ ప్రబుత్వం పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు. మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యకంగా`దిశ చట్టాన్ని కూడా తీసుకువచ్చామని.. ప్రకటిస్తోంది. అంతెందుకు.. తెలంగాణలో జరిగిన దిశ ఘటన నేపథ్యం లో ఏపీలో ముఖ్యమంత్రి జగన్.. హుటాహుటిన.. దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. మహిళలపై అఘాయిత్యా లకు పాల్పడేవారికి కఠిన శిక్షలు కూడా విధిస్తామన్నారు.
వేధింపులే కాదు.. అత్యాచారాలకు పాల్పడిన వారినిఈ చట్టం కింద.. 21 రోజుల్లో శిక్షించి తీరుతామన్నారు. కేవలం మూడు రోజుల్లో చార్జీషీటు దాఖలు చేయడం.. 15 రోజుల్లో విచారణ పూర్తిచేయడం.. 21వ రోజు శిక్షను అమలు చేయడం.. అనే సూత్రంతో ఈ దిశ చట్టం పనిచేస్తుందని గొప్పగా చెప్పారు. అయితే.. ఇది జరిగి.. అంటే.. దిశ చట్టం తీసుకువచ్చి రెండేళ్లు అయిపోయినా.. ఇప్పటి వరకు ఎక్కడా ఒక్క శిక్ష అమలు చేసింది లేదు.. అసలు దిశ చట్టాన్నే కేంద్రం గుర్తించింది కూడా లేదు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు ఎక్కడా ఆగడం లేదు. మరోపక్క, దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ.. పోలీసులు ప్రజలను ఒత్తిడి చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. సరే.. తాజా విషయానికి వస్తే.. దేశంలోని పని ప్రాంతాల్లో(అవి ఆఫీసులైనా.. ఇతరత్రా.. ఏ ప్రాంతాలైనా కానీ ) మహిళలపై వేధింపులు పెరిగిపోయిన రాష్ట్రాల్లో జగన్ పాలిత.. ఏపీ రెండో ర్యాంకును సాధించడం.. గమనార్హం. అంటే దీనిని బట్టి.. ఏపీలో మహిళలపై వేధింపులు ఏరేంజ్లో పెరిగిపోయాయో.. అర్ధం చేసుకోవచ్చు.
ఈ విషయాన్ని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో.. వెల్లడించడం గమనార్హం. గత ఏడాది మొత్తం 70 కేసులు నమోదైనట్టు ఈ నివేదిక వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్ 72 కేసులతో తొలిస్థానంలోనూ..ఏపీ 70 కేసులతో రెండో స్థానం, మహారాష్ట్ర 66 కేసులతో మూడో స్థానంలోనూ.. ఉత్తరప్రదేశ్ 46 కేసులతో నాలుగోస్థానం, మధ్య ప్రదేశ్ 40 కేసులతో ఐదో స్థానంలో ఉందని నివేదిక స్పష్టం చేసింది. 2019తో పోల్చుకుంటే… 2020లో ఏపీలో వేధింపుల కేసులు 219 శాతం పెరిగినట్టు నివేదిక తెలిపింది.
This post was last modified on April 23, 2022 9:31 pm
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…