Trends

లైంగిక వేధింపుల రాష్ట్రాల్లో ఏపీకి రెండో స్థానం

మ‌హిళ‌ల‌పై వేధింపులు అరిక‌ట్టేందుకు త‌మ ప్ర‌భుత్వం అత్య‌ధిక ప్రాదాన్యం ఇస్తోంద‌ని.. ఏపీ ప్ర‌బుత్వం ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు. మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ప్ర‌త్య‌కంగా`దిశ చ‌ట్టాన్ని కూడా తీసుకువ‌చ్చామ‌ని.. ప్ర‌క‌టిస్తోంది. అంతెందుకు.. తెలంగాణ‌లో జ‌రిగిన దిశ ఘ‌ట‌న నేప‌థ్యం లో ఏపీలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. హుటాహుటిన‌.. దిశ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చారు. మ‌హిళ‌ల‌పై అఘాయిత్యా ల‌కు పాల్ప‌డేవారికి క‌ఠిన శిక్ష‌లు కూడా విధిస్తామ‌న్నారు.

వేధింపులే కాదు.. అత్యాచారాల‌కు పాల్ప‌డిన వారినిఈ చ‌ట్టం కింద‌.. 21 రోజుల్లో శిక్షించి తీరుతామ‌న్నారు. కేవ‌లం మూడు రోజుల్లో చార్జీషీటు దాఖ‌లు చేయ‌డం.. 15 రోజుల్లో విచార‌ణ పూర్తిచేయ‌డం.. 21వ రోజు శిక్ష‌ను అమ‌లు చేయ‌డం.. అనే సూత్రంతో ఈ దిశ చ‌ట్టం ప‌నిచేస్తుంద‌ని గొప్ప‌గా చెప్పారు. అయితే.. ఇది జ‌రిగి.. అంటే.. దిశ చ‌ట్టం తీసుకువ‌చ్చి రెండేళ్లు అయిపోయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా ఒక్క శిక్ష  అమ‌లు చేసింది లేదు.. అస‌లు దిశ చ‌ట్టాన్నే కేంద్రం గుర్తించింది కూడా లేదు.

ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న లైంగిక వేధింపులు ఎక్క‌డా ఆగ‌డం లేదు. మ‌రోప‌క్క‌, దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ.. పోలీసులు ప్ర‌జ‌ల‌ను ఒత్తిడి చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. స‌రే.. తాజా విష‌యానికి వ‌స్తే.. దేశంలోని ప‌ని ప్రాంతాల్లో(అవి ఆఫీసులైనా.. ఇత‌ర‌త్రా.. ఏ ప్రాంతాలైనా కానీ ) మ‌హిళ‌ల‌పై వేధింపులు పెరిగిపోయిన రాష్ట్రాల్లో జ‌గ‌న్ పాలిత‌.. ఏపీ రెండో ర్యాంకును సాధించ‌డం.. గ‌మ‌నార్హం. అంటే దీనిని బ‌ట్టి.. ఏపీలో మ‌హిళ‌ల‌పై వేధింపులు ఏరేంజ్‌లో పెరిగిపోయాయో.. అర్ధం చేసుకోవ‌చ్చు.

ఈ విష‌యాన్ని నేష‌న‌ల్ క్రైం రికార్డ్స్‌ బ్యూరో.. వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. గత ఏడాది మొత్తం 70 కేసులు న‌మోదైన‌ట్టు ఈ నివేదిక వెల్ల‌డించింది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ 72 కేసుల‌తో తొలిస్థానంలోనూ..ఏపీ 70 కేసుల‌తో రెండో స్థానం, మ‌హారాష్ట్ర 66 కేసుల‌తో మూడో స్థానంలోనూ.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ 46 కేసుల‌తో నాలుగోస్థానం, మ‌ధ్య ప్ర‌దేశ్ 40 కేసుల‌తో ఐదో స్థానంలో ఉంద‌ని నివేదిక స్ప‌ష్టం చేసింది. 2019తో పోల్చుకుంటే… 2020లో ఏపీలో వేధింపుల కేసులు 219 శాతం పెరిగిన‌ట్టు నివేదిక తెలిపింది.

This post was last modified on April 23, 2022 9:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

1 hour ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

2 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

2 hours ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

3 hours ago

సీఎం విజయ్ కి బంపర్ ఆఫర్

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…

3 hours ago

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

4 hours ago