ఇది చెప్పుకోవడానికి చిన్న క్రైమ్ న్యూసే. ఈ ఉదంతంలో ఎవరి ప్రాణాలు కూడా పోలేదు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం హాట్ టాపిక్గా మారి.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన న్యూస్ ఇదే. ఎందుకంటే ఆ ఉదంతం అత్యంత ఆశ్చర్యకరమైనది. ఎవ్వరూ ఊహించనిది. ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని అందరూ షాకయ్యేలా చేసిన ఓ అమ్మాయి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.మామూలుగా ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఏ అమ్మాయి అయినా ఏం చేస్తుంది? తన తల్లిదండ్రులకు ఆ విషయం చెబుతుంది.
వాళ్లు వినిపించుకోకుంటే పెళ్లి కుదిరిన అబ్బాయికి విషయం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అలా కాని పక్షంలో తనకు నచ్చిన వాడితో వెళ్లిపోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాకు చెందిన వియ్యపు పుష్ప అనే అమ్మాయి మాత్రం ఎవ్వరూ ఊహించని పని చేసింది. కాబోయే వాడి గొంతు కోసి చంపేయబోయింది. పెద్దలు కుదిర్చిన పెళ్లికి అంగీకరించి, రామానాయుడు అనే అబ్బాయితో కలిసి పెళ్లి కోసం షాపింగ్ కూడా చేసిన ఆమె.. షాపింగ్ నుంచి తిరిగి ఇంటికి వచ్చే దారిలో ఒక ఆశ్రమం దగ్గరికి అతణ్ని తీసుకెళ్లింది.
అక్కడ ఒక సర్ప్రైజ్ ఇస్తానంటూ రామానాయుడి కళ్లకు గంతలు కట్టింది. తనకు ఏం గిఫ్ట్ ఇస్తుందో అని ఉత్సుకతతో చూసిన అబ్బాయికి ఆమె పెద్ద షాకే ఇచ్చింది. తన వెంట తెచ్చుకున్న కత్తితో అతడి గొంతు కోసేసింది. అతను ప్రాణాపాయ స్థితికి చేరాడు. ఐతే మీడియాలో, సోషల్ మీడియాలో ముందు జరిగిన ప్రచారం ఏంటంటే.. ఆ అమ్మాయే భయపడి అతణ్ని ఆసుపత్రికి చేర్చిందని, తనకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతోనే ఇలా అతణ్ని చంపబోయినట్లు చెప్పింది అని. ఐతే ప్రాణాపాయం తప్పించుకున్న ఆ అబ్బాయి ఆసుపత్రి నుంచి ఒక టీవీ ఛానెల్తో మాట్లాడాడు.
ఆ అమ్మాయి తన గొంతు కోశాక భయపడి తాను కూడా చచ్చిపోతా అని అందని, దీంతో ఆమె ఏం చేసుకుంటుందో ఏమో అని గొంతు నుంచి రక్తం కారుతున్నప్పటికీ..తనే స్కూటీలో తనను ఎక్కించుకుని ఆ కొండ మీది నుంచి డ్రైవ్ చేసుకుంటూ ఆసుపత్రికి వచ్చానని రామానాయుడు వెల్లడించాడు. ఈ సమాచారం బయటికి వచ్చినప్పటి నుంచి.. ఇతను మగజాతి ఆణిముత్యం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు రామానాయుడిని కొనియాడుతుండటం విశేషం.
This post was last modified on April 19, 2022 5:04 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…