ఇండియాను గిల్లడానికి అదేపనిగా చైనా ప్రయత్నం చేస్తోంది. నేరుగా వీరుడిలా యుద్ధానికి రాకుండా సరిహద్దు దేశాలను రెచ్చగొడుతోంది. నేపాల్, బంగ్లాదేశ్ లను దువ్వుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ తో సుదీర్ఘకాలం నుంచి స్నేహం నడుపుతున్న చైనా శ్రీలంకను కూడా ఎప్పట్నుంచో దువ్వుతోంది. ఈ సమయంలో మనం ధైర్యం ప్రదర్శించకపోతే చైనా ఇక ఎప్పటికీ మన మాట వినదన్న కోణంలో భారత ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు పోవడానికే సిద్ధమవుతోంది.
తాజాగా 500 కోట్ల అత్యవసర నిధిని ఆయుధాల కొనుగోలు తదితరాలకు కేటాయిస్తూ సంచన నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వం చైనా ఉత్పత్తుల జాబితాను సమర్పించమంటూ ఇండియన్ కార్పొరేట్లకు ఆదేశాలను జారీ చేసింది.
సరిహద్దు ఉద్రిక్తత నేపథ్యంలో ఒక వైపు యుద్ధానికి సిద్ధమవుతూనే చైనాను ఆర్థికంగా కూడా దెబ్బకొట్టడానికి ఇండియా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే జాబితా అడిగింది. భారతదేశపు మొత్తం దిగుమతుల్లో చైనా వాటా 14 శాతంగా ఉంది. చైనా నుంచి ముఖ్యంగా మనకు మొబైల్స్, టెలికాం, పవర్, ప్లాస్టిక్ ఉత్పత్తులతో పాటు ఫార్మా కంపెనీలకు ముడిసరుకులు దిగుమతి అవుతున్నాయి.
భారత ప్రభుత్వపు ఆదేశాలతో ఇప్పటికే మొదటి జాబితా కేంద్రానికి అందింది. అంతేకాదు వాటికి సంబంధించిన సలహాలను, సూచలనలను కూడా కేంద్రం తీసుకుంది. చైనా నుండి దిగుమతి చేసుకుంటున్న వాటిలో ఇంకా చేతి గడియారాలు, గోడ గడియారాలు, ఆంపౌల్స్ (మందు నిల్వచేసే చిన్న గాజు సీసాలు, గ్లాస్ రాడ్లు, హెయిర్ క్రీమ్, హెయిర్ షాంపూలు, ఫేస్ పౌడర్ వంటి మేకప్ కిట్లు, ప్రింటింగ్ సిరా, పెయింట్స్ మరియు వార్నిష్లు, కొన్ని పొగాకు వస్తువులు ఉన్నాయి.
తక్కువ నాణ్యతతో మనదేశంలోకి వచ్చే సరుకులను ముఖ్యంగా చైనా నుంచి అరికట్టడానికి, దేశీయ తయారీని పెంచడానికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఈ మధ్య ప్రధాని కార్యాలయం ఒక కీలక సమావేశం నిర్వహించింది. అది ఉత్పత్తి స్వావలంబన దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. దేశంలో చైనాకు వ్యతిరేకంగా భారతదేశం నినదిస్తున్న తీరు కూడా అందులో చర్చకు వచ్చింది.
ఇదిలా ఉండగా… ఇప్పటికే భారతప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలను తీసుకుంది. టైర్లపై దిగుమతి ఆంక్షలను విధించింది. అదే సమయంలో సరిహద్దు దేశాలు మన దేశంలో పెట్టుబడులు పెట్టకుండా నిషేధించింది.
This post was last modified on June 22, 2020 8:28 am
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…