Trends

చైనా నుంచి ఏం కొంటున్నారు? – జాబితా అడిగిన కేంద్రం

ఇండియాను గిల్లడానికి అదేపనిగా చైనా ప్రయత్నం చేస్తోంది. నేరుగా వీరుడిలా యుద్ధానికి రాకుండా సరిహద్దు దేశాలను రెచ్చగొడుతోంది. నేపాల్, బంగ్లాదేశ్ లను దువ్వుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ తో సుదీర్ఘకాలం నుంచి స్నేహం నడుపుతున్న చైనా శ్రీలంకను కూడా ఎప్పట్నుంచో దువ్వుతోంది. ఈ సమయంలో మనం ధైర్యం ప్రదర్శించకపోతే చైనా ఇక ఎప్పటికీ మన మాట వినదన్న కోణంలో భారత ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు పోవడానికే సిద్ధమవుతోంది.

తాజాగా 500 కోట్ల అత్యవసర నిధిని ఆయుధాల కొనుగోలు తదితరాలకు కేటాయిస్తూ సంచన నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వం చైనా ఉత్పత్తుల జాబితాను సమర్పించమంటూ ఇండియన్ కార్పొరేట్లకు ఆదేశాలను జారీ చేసింది.

సరిహద్దు ఉద్రిక్తత నేపథ్యంలో ఒక వైపు యుద్ధానికి సిద్ధమవుతూనే చైనాను ఆర్థికంగా కూడా దెబ్బకొట్టడానికి ఇండియా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే జాబితా అడిగింది. భారతదేశపు మొత్తం దిగుమతుల్లో చైనా వాటా 14 శాతంగా ఉంది. చైనా నుంచి ముఖ్యంగా మనకు మొబైల్స్, టెలికాం, పవర్, ప్లాస్టిక్ ఉత్పత్తులతో పాటు ఫార్మా కంపెనీలకు ముడిసరుకులు దిగుమతి అవుతున్నాయి.

భారత ప్రభుత్వపు ఆదేశాలతో ఇప్పటికే మొదటి జాబితా కేంద్రానికి అందింది. అంతేకాదు వాటికి సంబంధించిన సలహాలను, సూచలనలను కూడా కేంద్రం తీసుకుంది. చైనా నుండి దిగుమతి చేసుకుంటున్న వాటిలో ఇంకా చేతి గడియారాలు, గోడ గడియారాలు, ఆంపౌల్స్ (మందు నిల్వచేసే చిన్న గాజు సీసాలు, గ్లాస్ రాడ్లు, హెయిర్ క్రీమ్, హెయిర్ షాంపూలు, ఫేస్ పౌడర్ వంటి మేకప్ కిట్లు, ప్రింటింగ్ సిరా, పెయింట్స్ మరియు వార్నిష్‌లు, కొన్ని పొగాకు వస్తువులు ఉన్నాయి.

తక్కువ నాణ్యతతో మనదేశంలోకి వచ్చే సరుకులను ముఖ్యంగా చైనా నుంచి అరికట్టడానికి, దేశీయ తయారీని పెంచడానికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఈ మధ్య ప్రధాని కార్యాలయం ఒక కీలక సమావేశం నిర్వహించింది. అది ఉత్పత్తి స్వావలంబన దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. దేశంలో చైనాకు వ్యతిరేకంగా భారతదేశం నినదిస్తున్న తీరు కూడా అందులో చర్చకు వచ్చింది.

ఇదిలా ఉండగా… ఇప్పటికే భారతప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలను తీసుకుంది. టైర్లపై దిగుమతి ఆంక్షలను విధించింది. అదే సమయంలో సరిహద్దు దేశాలు మన దేశంలో పెట్టుబడులు పెట్టకుండా నిషేధించింది.

This post was last modified on June 22, 2020 8:28 am

Share
Show comments
Published by
Satya
Tags: ChinaIndia

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

3 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

5 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

12 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

13 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

13 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

15 hours ago