కోట్లాది మందిని తమ ఆటతో ఆకట్టుకునే క్రికెటర్లు.. ఎంతో బాధ్యతగా ఉంటామని అనుకుంటాం. కానీ.. కొందరి పిచ్చి వేషాల గురించి తెలిస్తే.. మరీ ఇంత దారుణంగా.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తారా? అన్న సందేహం కలుగక మానదు. తాజాగా అలాంటి విషయమే ఒకటి బయటకు వచ్చింది. గతంలో బెంగళూరు తరఫు ఆడి.. ఈ మధ్య జరిగిన వేలంలో రాజస్థాన్ జట్టు సొంతం చేసుకున్న లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ గతంలో తనకు ఎదురైన భయంకర అనుభవాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
2013లో ఒక క్రికెటర్ తాగిన మైకంలో తనను 15వ అంతస్తులో వేలాడదీసినట్లుగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదని.. ఇకపై అందరికీ తెలిసిపోతుందన్న ఆయన.. తాను ముంబయి తరఫున ఆడినప్పుడు జరిగిందని పేర్కొన్నారు. బెంగళూరు జట్టుపై ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత పార్టీ చేసుకున్నాం. ఆ సమయంలో ఒక క్రికెటర్ తాగిన మత్తులో ఉన్నారు. చాలా సేపు నన్ను గమనించిన అతడు తన వద్దకు పిలిచాడు.
అతడి వద్దకు వెళ్లినంతనే నన్ను గట్టిగా పట్టుకొని.. 15వ అంతస్తులో వేలాడ దీశాడని చెప్పారు. ‘ఒక్కసారి భయం వేసింది. కళ్లు తిరిగాయి. నా చేతులతో అతడి మెడను గట్టిగా పట్టేసుకున్నా. ఏ మాత్రం పట్టుసడలినా నా పని అయిపోయేది. అక్కడున్న వారు వెంటనే రియాక్టు అయ్యారు. దీంతో బతికిపోయా. చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నా. ఏ చిన్న తప్పిదం జరిగినా కూడా ప్రాణాలతో బయపడేవాడిని కాదు. దాని తర్వాత నుంచి ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎలా ఉండాలన్న దానిపై జాగ్రత్తలు తీసుకుంటున్నా’’ అంటూ తనకు ఎదురైన భయంకరమైన నిజాన్ని వెల్లడించారు.
చాహల్ వెల్లడించిన ఈ ఉదంతం ఇప్పుడు పెనుసంచలనంగా మారింది. ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించిన సదరు క్రికెటర్ ఎవరు? అన్న విషయాన్ని వెల్లడించనప్పటికీ.. బీసీసీఐ ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు.. ఎవరు ఆ క్రికెటర్. అలా వ్యవహరించిన దానికి చర్యలు తీసుకోవాల్సిందేనన్న డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. మరి.. ఆ క్రికెటర్ ఎవరన్న విషయాన్నిచాహల్ బయటపెడతారా? బీసీసీఐ అయినా జోక్యం చేసుకుంటుందా? అన్నది చూడాలి.
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…