Trends

తాగేసి.. చాహల్ ప్రాణాలతో చెలగాటం

కోట్లాది మందిని తమ ఆటతో ఆకట్టుకునే క్రికెటర్లు.. ఎంతో బాధ్యతగా ఉంటామని అనుకుంటాం. కానీ.. కొందరి పిచ్చి వేషాల గురించి తెలిస్తే.. మరీ ఇంత దారుణంగా.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తారా? అన్న సందేహం కలుగక మానదు. తాజాగా అలాంటి విషయమే ఒకటి బయటకు వచ్చింది. గతంలో బెంగళూరు తరఫు ఆడి.. ఈ మధ్య జరిగిన వేలంలో రాజస్థాన్ జట్టు సొంతం చేసుకున్న లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ గతంలో తనకు ఎదురైన భయంకర అనుభవాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

2013లో ఒక క్రికెటర్ తాగిన మైకంలో తనను 15వ అంతస్తులో వేలాడదీసినట్లుగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదని.. ఇకపై అందరికీ తెలిసిపోతుందన్న ఆయన.. తాను ముంబయి తరఫున ఆడినప్పుడు జరిగిందని పేర్కొన్నారు. బెంగళూరు జట్టుపై ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత పార్టీ చేసుకున్నాం. ఆ సమయంలో ఒక క్రికెటర్ తాగిన మత్తులో ఉన్నారు. చాలా సేపు నన్ను గమనించిన అతడు తన వద్దకు పిలిచాడు.

అతడి వద్దకు వెళ్లినంతనే నన్ను గట్టిగా పట్టుకొని.. 15వ అంతస్తులో వేలాడ దీశాడని చెప్పారు. ‘ఒక్కసారి భయం వేసింది. కళ్లు తిరిగాయి. నా చేతులతో అతడి మెడను గట్టిగా పట్టేసుకున్నా. ఏ మాత్రం పట్టుసడలినా నా పని అయిపోయేది. అక్కడున్న వారు వెంటనే రియాక్టు అయ్యారు. దీంతో బతికిపోయా. చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నా. ఏ చిన్న తప్పిదం జరిగినా కూడా ప్రాణాలతో బయపడేవాడిని కాదు. దాని తర్వాత నుంచి ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎలా ఉండాలన్న దానిపై జాగ్రత్తలు తీసుకుంటున్నా’’ అంటూ తనకు ఎదురైన భయంకరమైన నిజాన్ని వెల్లడించారు.

చాహల్ వెల్లడించిన ఈ ఉదంతం ఇప్పుడు పెనుసంచలనంగా మారింది. ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించిన సదరు క్రికెటర్ ఎవరు? అన్న విషయాన్ని వెల్లడించనప్పటికీ.. బీసీసీఐ ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు.. ఎవరు ఆ క్రికెటర్. అలా వ్యవహరించిన దానికి చర్యలు తీసుకోవాల్సిందేనన్న డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. మరి.. ఆ క్రికెటర్ ఎవరన్న విషయాన్నిచాహల్ బయటపెడతారా? బీసీసీఐ అయినా జోక్యం చేసుకుంటుందా? అన్నది చూడాలి.

This post was last modified on April 9, 2022 11:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

1 hour ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

1 hour ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

3 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

3 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

4 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

4 hours ago