Trends

తాగేసి.. చాహల్ ప్రాణాలతో చెలగాటం

కోట్లాది మందిని తమ ఆటతో ఆకట్టుకునే క్రికెటర్లు.. ఎంతో బాధ్యతగా ఉంటామని అనుకుంటాం. కానీ.. కొందరి పిచ్చి వేషాల గురించి తెలిస్తే.. మరీ ఇంత దారుణంగా.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తారా? అన్న సందేహం కలుగక మానదు. తాజాగా అలాంటి విషయమే ఒకటి బయటకు వచ్చింది. గతంలో బెంగళూరు తరఫు ఆడి.. ఈ మధ్య జరిగిన వేలంలో రాజస్థాన్ జట్టు సొంతం చేసుకున్న లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ గతంలో తనకు ఎదురైన భయంకర అనుభవాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

2013లో ఒక క్రికెటర్ తాగిన మైకంలో తనను 15వ అంతస్తులో వేలాడదీసినట్లుగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదని.. ఇకపై అందరికీ తెలిసిపోతుందన్న ఆయన.. తాను ముంబయి తరఫున ఆడినప్పుడు జరిగిందని పేర్కొన్నారు. బెంగళూరు జట్టుపై ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత పార్టీ చేసుకున్నాం. ఆ సమయంలో ఒక క్రికెటర్ తాగిన మత్తులో ఉన్నారు. చాలా సేపు నన్ను గమనించిన అతడు తన వద్దకు పిలిచాడు.

అతడి వద్దకు వెళ్లినంతనే నన్ను గట్టిగా పట్టుకొని.. 15వ అంతస్తులో వేలాడ దీశాడని చెప్పారు. ‘ఒక్కసారి భయం వేసింది. కళ్లు తిరిగాయి. నా చేతులతో అతడి మెడను గట్టిగా పట్టేసుకున్నా. ఏ మాత్రం పట్టుసడలినా నా పని అయిపోయేది. అక్కడున్న వారు వెంటనే రియాక్టు అయ్యారు. దీంతో బతికిపోయా. చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నా. ఏ చిన్న తప్పిదం జరిగినా కూడా ప్రాణాలతో బయపడేవాడిని కాదు. దాని తర్వాత నుంచి ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎలా ఉండాలన్న దానిపై జాగ్రత్తలు తీసుకుంటున్నా’’ అంటూ తనకు ఎదురైన భయంకరమైన నిజాన్ని వెల్లడించారు.

చాహల్ వెల్లడించిన ఈ ఉదంతం ఇప్పుడు పెనుసంచలనంగా మారింది. ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించిన సదరు క్రికెటర్ ఎవరు? అన్న విషయాన్ని వెల్లడించనప్పటికీ.. బీసీసీఐ ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు.. ఎవరు ఆ క్రికెటర్. అలా వ్యవహరించిన దానికి చర్యలు తీసుకోవాల్సిందేనన్న డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. మరి.. ఆ క్రికెటర్ ఎవరన్న విషయాన్నిచాహల్ బయటపెడతారా? బీసీసీఐ అయినా జోక్యం చేసుకుంటుందా? అన్నది చూడాలి.

This post was last modified on April 9, 2022 11:08 am

Share

Recent Posts

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

4 minutes ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

1 hour ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

1 hour ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

2 hours ago

`వైనాట్ పులివెందుల` ఎందాకా వచ్చింది?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష‌. ముఖ్యంగా స్థానిక…

3 hours ago

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

9 hours ago