రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని ‘పుడింగ్ అండ్ మింక్ పబ్’ లో జరిగిన రేవ్ పార్టీ ఇప్పుడు సరికొత్త ప్రకంపనలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల వేళలో 157 మందిని టాస్కు ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకురావటం తెలిసిందే. వీరిలో 99 మంది యువకులు.. 39 మంది యువతులు. 19 మంది పబ్ సిబ్బంది ఉన్నారు.
ప్రస్తుతానికి సమయానికి మించిన పబ్ నడుపుతున్నట్లుగా కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీ జరిగిన ప్రాంతంలో తనిఖీలు నిర్వహించటం ద్వారా.. అక్కడ ఉపయోగించిన డ్రగ్స్ వివరాలు సేకరించనున్నారు.
అదుపులోకి తీసుకున్న వారి వివరాలు సేకరించి.. వారిలో కొందరికి నోటీసులు ఇచ్చి పంపినట్లుగా చెబుతున్నారు. మొత్తం 157 మందిలో 38 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పిల్లలు ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సదరు పార్టీలో డ్రగ్స్ ను కూడా గుర్తించారంటున్నారు.
అధికారిక లెక్కల ప్రకారం చూస్తే.. ఐదు గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో బంజారాహిల్స్ సీఐను సస్పెండ్ చేస్తే.. ఏసీపీకి మెమో ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇక.. పార్టీలో పాల్గొన్న ప్రముఖుల పిల్లల వివరాల్లోకి వెళితే.. ఒక ప్రముఖ సినీ కుటుంబానికి చెందిన నటి ఒకరున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని మీడియా సంస్థలు మాత్రం నిహారిక కొణిదెల ఉన్నట్లుగా పేర్కొంటున్నారు.
ఆమెకు ఉదయం టిఫిన్ అందించటం కోసం అక్కడే ఉన్న మీడియాను పంపేందుకు పోలీసులు తెగ ప్రయత్నించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఏపీకి చెందిన ఒక ఎంపీ కుమారుడు కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. సినిమా రంగంతో సంబంధం ఉన్న సదరు సెలబ్రిటీ తో పాటు.. ఏపీ పోలీసు శాఖలో అత్యంత కీలక అధికారి.. ఈ మధ్యనే పోలీసు శాఖ నుంచి బయటకు వచ్చిన అధికారి కుటుంబానికి చెందిన వ్యక్తి ఒకరు కూడా పట్టుబడిన 38 మందిలో ఒకరుగా చెబుతున్నారు. వీరితో పాటు..సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పేరు బయటకు రావటం.. తనకు పార్టీకి సంబంధం లేదని… తాను కేవలం ఈవెంట్ లో పాటలు పాడటానికి మాత్రమే వెళ్లినట్లు చెబుతున్నారు.
ఇక.. ఈ పబ్ విషయానికి వస్తే మాజీ ఎంపీ.. పవర్ ఫుల్ నేత కుటుంబ సభ్యులదిగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో డ్రగ్స్ పట్టుబడిన కేసులో.. ఇంత భారీగా ప్రముఖులకు చెందిన కుటుంబ సభ్యులు ఉండటం సంచలనంగా మారింది. ఈ మొత్తం ఉదంతం గురించి పోలీసులు పెదవి విప్పకున్నా.. పార్టీకి సంబంధించిన వీడియోలు బయటకు వస్తున్న నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఈ ఇష్యూ మరిన్ని పరిణామాలకు దారి తీస్తుందంటున్నారు.
This post was last modified on April 3, 2022 1:42 pm
గుంటూరు కారం తర్వాత గ్యాప్ వచ్చేసిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన హ్యాట్రిక్ హీరో అల్లు అర్జున్ తో ప్యాన్…
సిద్ధరామయ్య గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ నేత. అంతేనా... కర్ణాటకకు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేత. ఇప్పుడే కాదు... గతంలోనూ ఆయన కర్ణాటకకు సీఎంగా…
గత కొన్నేళ్లలో యూత్లో బాగా ఫాలోయింగ్ సంపాదించిన టాలీవుడ్ యువ నటుల్లో శ్రీ విష్ణు ఒకడు. సరదాగా సాగే తన…
భవిష్యత్తులో ఐపీఎల్ మరింత పెద్దది కానుందా? ఇప్పుడీ చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఇచ్చిన…
ప్రపంచం వేగంగా మారుతోంది. టెక్నాలజీ అభివృద్ధి ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI),…
రుచిగా ఉంటాయి. సులభంగా దొరుకుతాయి. వేడి చేసి నిమిషాల్లో తినవచ్చు. కానీ రెడీ-టు-ఈట్, రెడీ-టు-హీట్ ఆహారాల ముసుగులో మన ఆరోగ్యాన్ని…