మైక్రోసాఫ్ట్.. గూగుల్.. మాత్రమే కాదు ఏకంగా 13 దిగ్గజ కంపెనీలకు ప్రవాస భారతీయులే సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా జాబితాలో మరో పేరు చేరనుంది. కేరళకు చెందిన రాజ్ సుబ్రహ్మణ్యంను ప్రఖ్యాత డెలివరీ సంస్థ ఫెడెక్స్ సీఈవోగా నియమిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తున్న సంస్థ వ్యవస్థాపకుడు ఫ్రెడరిక్ డబ్ల్యూ స్మిత్ స్థానంలో ఆయన ఎంపిక జరగటం విశేషం. జూన్ ఒకటి నుంచి మనోడి సారథ్యంలో ఫెడెక్స్ నడవనుంది. ఇప్పటికే ఆ కంపెనీలో కీలక స్థానంలో ఉన్న రాజ్ సుబ్రహ్మణ్యం తన ప్రతిభను చాటారు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఆయన.. ఐఐటీ బాంబేలో కెమికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడయ్యారు.
న్యూయార్క్ లోని సిరకస్ వర్సిటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ లో పీజీ పూర్తి చేసిన ఆయన.. అనంతరం టెక్సాస్ వర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. దాదాపు ముప్పై ఏళ్ల క్రితమే ఫెడెక్స్ లో చేరిన ఆయన అప్పటి నుంచి కంపెనీలో పలు కీలక స్థానాల్లో పని చేశారు. తాజాగా ఆయన.. ఫెడెక్స్ బోర్డులో ఉన్న రాజ్.. సీఈవో తర్వాత కూడా బోర్డులో కొనసాగనున్నారు.
ఇకపై తాను సంస్థ ఎగ్జిక్యూటివి ఛైర్మన్ గా కొనసాగుతానని పేర్కొన్నారు. ఏమైనా.. భారతీయుల ప్రతిభ అంతర్జాతీయ వేదికల మీద ఇప్పటికే నిరూపితం కావటం.. పలువురు ప్రవాస భారతీయులు టాప్ అమెరికన్ కంపెనీల్లో కీలక భూమిక పోషిస్తున్న వేళ.. మనోడు మరొకరు దిగ్గజ కంపెనీకి సారథ్యాన్ని చేపట్టటం భారతీయులందరికి గర్వకారణంగా చెప్పక తప్పదు.
This post was last modified on March 30, 2022 3:22 pm
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…