Trends

అంబానీ మ‌న‌వ‌డు స్కూల్‌కు వెళితే..

ముకేశ్ అంబానీ.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ కుబేరుల్లో ముందు వరుసలో ఉంటారు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం.. ఆయన సంపద విలువ 97.4 బిలియన్ డాలర్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్కు సంబంధించి ఆయన తీసుకునే నిర్ణయాలతో పాటు అంబానీ కుటుంబ వ్యక్తిగత జీవిత విశేషాలనూ తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారి దృష్టిని ఆకర్షిస్తోంది ఓ విషయం. అదే.. బుల్లి అంబానీ ‘ప్లేస్కూల్ కహానీ` అంటే.. అంబానీ మ‌న‌వడు పృథ్వీ అంబానీ స్కూల్ క‌థ‌.

ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్కు శ్లోకా మెహతాతో వివాహమైంది. 2020 డిసెంబర్ 10న వారికి పృథ్వీ పుట్టాడు. ఏడాదిన్నర వయసుకే పృథ్వీని ప్లేస్కూల్కు పంపుతున్నారు. ఈ నెలలోనే అతడ్ని ముంబయి మలబర్ హిల్లోని సన్ఫ్లవర్ నర్సరీ స్కూల్లో చేర్చారు. ఆకాశ్, శ్లోక అదే స్కూల్లో తమ విద్యాభ్యాసం ప్రారంభించడం విశేషం.

ముంబయిలో 27 అంతస్తుల విలాసవంతమైన నివాసంలో ఉండే అంబానీ కుటుంబానికి పనివారికి కొదవ లేదు. అయినా.. పృథ్వీ ఆలనాపాలనను ఆయాలకు వదిలేయకుండా, తామే స్వయంగా చూసుకుంటున్నారట ఆకాశ్-శ్లోక. తమ కుమారుడు పెద్దగా స్పాట్లైట్లో లేకుండా, సాదాసీదా జీవితం గడిపేలా చూడాలన్నదే వారి ఆలోచన అని తెలిసింది.

అయితే.. అంబానీ వారసుడు కాబట్టి పృథ్వీకి ఎక్కడకు వెళ్లినా గట్టి బందోబస్తు ఉండాల్సిందే. అందుకే అతడి కోసం పాఠశాలలోనూ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయించారు. కానీ అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలానే.. పృథ్వీ వెన్నంటే 24X7 ఓ వైద్యుడు ఉండేలా చూస్తున్నారు.

అంబానీ మనవడు అయినప్పటికీ.. పృథ్వీని అందరు విద్యార్థులతో సమానంగా చూస్తున్నట్లు చెప్పింది సన్ఫ్లవర్ నర్సరీ స్కూల్ యాజమాన్యం. ఆ పాఠశాల వెబ్సైట్ ప్రకారం.. అతి కొద్ది సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పిల్లల వ్యక్తిగత అవసరాలను దృష్టిలో పెట్టుకుని, కుటుంబ విలువలకు ప్రాధాన్యమిస్తూ విద్యాబోధన చేస్తారు. కళలు, యోగా వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.

గతేడాది డిసెంబర్ 10న పృథ్వీ అంబానీ తొలి పుట్టినరోజు గుజరాత్ జామ్నగర్లో అట్టహాసంగా సాగింది. అతిథుల కోసం ప్రత్యేక విమానాలు, రుచికరమైన వంటలు చేసిపెట్టేందుకు అంతర్జాతీయ స్థాయి షెఫ్లు, ప్రఖ్యాత సింగర్ అరిజిత్ సింగ్ లైవ్ పెర్ఫామెన్స్తో.. అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకకు రణ్బీర్ కపూర్, ఆలియా భట్, రణ్వీర్ సింగ్, సచిన్ తెందూల్కర్, జహీర్ ఖాన్ వంటి 120 మంది ప్రముఖులు హాజరయ్యారు.

This post was last modified on March 23, 2022 10:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

1 hour ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago