‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారో లెక్కే లేదు. జనవరిలో సినిమా రిలీజ్ ఖరారైనపుడు దానికి నెల రోజుల ముందు పదుల సంఖ్యలో ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. అప్పుడంత కష్టపడీ ప్రయోజనం లేకపోయింది. సినిమా వాయిదా పడింది. ఇప్పుడు మార్చి 25న సినిమా రిలీజ్ ఓకే అయ్యాక గత కొన్ని వారాల నుంచి మళ్లీ ఉద్ధృతంగా ప్రమోషన్లు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇబ్బడిముబ్బడిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో కొన్ని అత్యంత ఆసక్తికరంగా సాగాయి. సినిమా సంగతులతో పాటు వ్యక్తిగత విషయాలనూ పంచుకుంటూ ఈ ఇంటర్వ్యూలను రక్తి కట్టిస్తున్నారు తారక్, చరణ్, రాజమౌళి. ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూల్లో తారక్దే పైచేయిగా ఉంటోంది. అతను మామూలుగానే హైపర్ యాక్టివ్ కాబట్టి ఇంటర్వ్యూల్లో మిగతా ఇద్దరినీ బాగా డామినేట్ చేస్తున్నాడు.
తాజాగా నార్త్ ఆడియన్స్ కోసం నిర్వహించిన ఒక ఇంగ్లిష్ ఇంటర్వ్యూలో తారక్ ఒక ఆసక్తికర ప్రశ్నకు తనదైన శైలిలో బదులిచ్చాడు. ఒక దీవిలో మిమ్మల్ని పడేసి అక్కడికి ముగ్గురు వ్యక్తులనే వెంట తీసుకెళ్లాలని అంటే ఎవరిని ఎంచుకుంటారు అన్నది ప్రశ్న. దీనికి తారక్ జవాబిస్తూ.. తొలి వ్యక్తిగా రామ్ చరణ్ పేరు చెప్పాడు. అలాంటి ప్రదేశాలకు వెళ్లినపుడు మన వెంట అన్ని రకాలుగా బలవంతుడైన వ్యక్తి ఉండాలని, చరణ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి అతణ్ని కచ్చితంగా తీసుకెళ్తానని అన్నాడు. ఆ సమయంలో వెంట ఉండదగ్గ మరో వ్యక్తిగా రానా దగ్గుబాటి పేరు చెప్పాడు తారక్.
మూడో వ్యక్తి రాజమౌళినా అని అడిగితే.. ఛాన్సే లేదన్నాడతను. రాజమౌళితో ఇలాంటి చోట్ల కష్టమని, కాబట్టి వెంట తీసుకెళ్లలేని చెప్పాడు. మూడో వ్యక్తిగా అతను ఎంచుకున్నది తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ కావడం విశేషం. అలాంటి సమయాల్లో సంగీతంతో మనల్ని ఎంటర్టైన్ చేసే వ్యక్తి చాలా అవసరమని, అందుకే అనిరుధ్ను ఎంచుకున్నట్లు చెప్పాడు. మరి వంట మనిషి అక్కర్లేదా అంటే, నేనే వంట చేస్తా కాబట్టి మళ్లీ చెఫ్ ఎందుకు అని ప్రశ్నించాడు తారక్.
This post was last modified on March 23, 2022 11:04 am
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన…
సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు…
గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్…