Trends

పాకిస్ధాన్ ఉగ్రవాదులకు.. విజయవాడ నుంచి నిధులు

పాకిస్ధాన్ ఉగ్రవాదులకు హెరాయిన్ నిదులు 
విజయవాడలోని సత్యనారాయణపురం ఆషీ ట్రేడర్స్ అడ్రస్ తో జరిగిన మాదక ద్రవ్యాల వ్యాపారం నిధులంతా పాకిస్ధాన్లోని ఉగ్రవాదులకు అందుతున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చార్జిషీటులో స్పష్టంగా చెప్పింది. ఆషీ ట్రేడర్స్ పేరుతో ఆఫ్ఘనిస్థాన్ నుండి దేశంలోకి హెరాయిన్ లాంటి మాదకద్రవ్యాలు దిగుమతి చేసుకుని అనేక రాష్ట్రాల్లో అమ్ముతున్న మాచవరం సుధాకర్, ఆయన భార్య దుర్గా పూర్ణిమా వైశాలితో పాటు మరో 14 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

అప్పట్లో గుజరాత్ లోని ముంద్రా పోర్టులో సెమీ ప్రాసెస్డ్ టాల్కం స్టోన్స్ రూపంలో పట్టుబడిన హెరాయిన్ దేశంలో సంచలనం సృష్టించింది. అప్పట్లో పట్టుబడిన 3 వేల కిలోల హెరాయిన్ విలువ సుమారు రు. 24 వేల కోట్లుంటుంది. ఆఫ్ఘనిస్థాన్ నుండి దేశంలోకి దిగుమతి చేసుకుంటున్న మాదక ద్రవ్యాలను అమ్మేసి వచ్చిన వేల కోట్ల రూపాయలను పాకిస్ధాన్లోని ఉగ్రవాద గ్రూపులకు అందచేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. మాదకద్రవ్యాల అమ్మకం ద్వారా సంపాదించిన డబ్బునంతా పాకిస్ధాన్ కు హవాలా మార్గంలో పంపుతున్నట్లు ఎన్ఐఏ తన చార్జిషీటులో చెప్పింది. 

ఆప్ఘనిస్ధాన్+పాకిస్ధాన్ లోని ఉగ్రవాద సంస్ధలకు సుధాకర్, ఆయన భార్య మరో 14 మంది చేతులు కలిపినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఉగ్రవాద గ్రూపులతో సుధాకర్ దంపతులతో పాటు మరికొందరు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లు ఎన్ఐఏ చెప్పింది. ఎన్ఐఏ చెప్పినదాని ప్రకారం సుధాకర దంపతులతో పాటు మరికొందరు ఉగ్రవాదులతో చేతులు కలిపి దేశద్రోహానికి పాల్పడినట్లు చార్జిషీటులో చెప్పింది. ఆఫ్ఘనిస్ధాన్ నుండి వస్తున్న హెరాయిన్ లాంటి మాదకద్రవ్యాలు పంజాబ్, ఢిల్లీ, బెంగుళూరు, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు ఎన్ఐఏ స్పష్టంగా చెప్పింది. 

అందుబాటులోకి వస్తున్న మాదక ద్రవ్యాలనంతా రకరకాల వ్యాపారస్తులు, డీలర్లు, పెడలర్లు తదితరాల రూపంలో మామూలు జనాలకు అందిస్తున్నారు. మామూలు జనాల్లో కూడా ప్రధానంగా కళాశాలలు, స్కూళ్ళ విద్యార్ధులే టార్గెట్ గా అమ్మకాలు  జరుగుతున్నట్లు అందరికీ తెలిసిందే. యువతలో మాదకద్రవ్యాల వాడకం చాలా ఎక్కువైపోతోందనే విషయాలు ఇప్పటికే చాలాసార్లు బయటపడింది. అయినా దీన్ని అరికట్టడం సాధ్యం కావడం లేదు. మొత్తం మీద ఎన్ఐఏ తాజాగా బయటపెట్టిన చార్జిషీటులో ఉగ్రవాదులతో సంబంధాలు బయటపడటమే ఆశ్చర్యంగా ఉంది.

This post was last modified on March 16, 2022 10:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

1 hour ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

2 hours ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

3 hours ago

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

5 hours ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

7 hours ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

8 hours ago