Trends

హిజాబ్ వివాదంపై హైకోర్టు సంచలన తీర్పు

కర్ణాటకలో మొదలైన హిజాబ్‌ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు నేడు సంచలన తీర్పునిచ్చింది. హిజాబ్‌పై దాఖలైన పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు…విద్యాసంస్థల యూనిఫాం ప్రోటోకాల్ ను విద్యార్థులంతా అనుసరించాల్సిదేనని తేల్చి చెప్పింది. హిజాబ్‌ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదని పేర్కొంది. హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇవాళ కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేస్తుండగా…వివాదానికి కేంద్రబిందువైన ఉడిపి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కర్ణాటకలో మొదలైన హిజాబ్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడానికి వీల్లేదంటూ ఉడిపిలోని ఓ కాలేజ్ యాజమాన్యం అభ్యంతరం తెలిపింది.

దీంతో, హిజాబ్‌కు వ్యతిరేకంగా, అనుకూలంగా ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలోనే పలువురు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. హిజాబ్‌ వస్త్రధారణకు అనుమతివ్వాలంటూ ఉడుపి, కుందాపురలకు చెందిన విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సంప్రదాయ వస్త్రధారణను నిషేధిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్‌లో పెట్టి..ఈ రోజు తుది తీర్పునిచ్చింది.

హైకోర్ట్‌ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై అన్నారు. ప్రతి ఒక్కరూ హైకోర్ట్‌ ఆదేశాలు పాటించాలని, శాంతిని కాపాడాలని పిలుపునిచ్చారు. విద్యార్థులందరూ చదువుపై దృష్టి పెట్టాలని కోరారు. మరోవైపు, హిజాబ్‌ పై కర్నాటక హైకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్దమని మజ్లిస్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ముస్లిం బాలికలు హిజాబ్‌ ధరిస్తే ఎవరికి ఇబ్బంది కలుగుతుందో అర్ధం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మతవిశ్వాసాలను కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పారు. హిజాబ్‌ బ్యాన్‌పై అప్పీల్‌కు సుప్రీం కోర్టుకు వెళ్లాలని పిటిషనర్లకు పిలుపునిచ్చారు.

This post was last modified on March 16, 2022 12:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

36 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

3 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

3 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

4 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

6 hours ago