Trends

హిజాబ్ వివాదంపై హైకోర్టు సంచలన తీర్పు

కర్ణాటకలో మొదలైన హిజాబ్‌ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు నేడు సంచలన తీర్పునిచ్చింది. హిజాబ్‌పై దాఖలైన పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు…విద్యాసంస్థల యూనిఫాం ప్రోటోకాల్ ను విద్యార్థులంతా అనుసరించాల్సిదేనని తేల్చి చెప్పింది. హిజాబ్‌ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదని పేర్కొంది. హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇవాళ కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేస్తుండగా…వివాదానికి కేంద్రబిందువైన ఉడిపి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కర్ణాటకలో మొదలైన హిజాబ్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడానికి వీల్లేదంటూ ఉడిపిలోని ఓ కాలేజ్ యాజమాన్యం అభ్యంతరం తెలిపింది.

దీంతో, హిజాబ్‌కు వ్యతిరేకంగా, అనుకూలంగా ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలోనే పలువురు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. హిజాబ్‌ వస్త్రధారణకు అనుమతివ్వాలంటూ ఉడుపి, కుందాపురలకు చెందిన విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సంప్రదాయ వస్త్రధారణను నిషేధిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్‌లో పెట్టి..ఈ రోజు తుది తీర్పునిచ్చింది.

హైకోర్ట్‌ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై అన్నారు. ప్రతి ఒక్కరూ హైకోర్ట్‌ ఆదేశాలు పాటించాలని, శాంతిని కాపాడాలని పిలుపునిచ్చారు. విద్యార్థులందరూ చదువుపై దృష్టి పెట్టాలని కోరారు. మరోవైపు, హిజాబ్‌ పై కర్నాటక హైకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్దమని మజ్లిస్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ముస్లిం బాలికలు హిజాబ్‌ ధరిస్తే ఎవరికి ఇబ్బంది కలుగుతుందో అర్ధం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మతవిశ్వాసాలను కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పారు. హిజాబ్‌ బ్యాన్‌పై అప్పీల్‌కు సుప్రీం కోర్టుకు వెళ్లాలని పిటిషనర్లకు పిలుపునిచ్చారు.

This post was last modified on March 16, 2022 12:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

యార్ల‌గ‌డ్డ స‌త్తా చాటుకున్నారే

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు.. స‌త్తా చాటుకున్నారు. సాధార‌ణ అభివృద్ధి ప‌నుల‌తో పాటు.. ఎవ‌రూ ఊహించ‌ని…

1 hour ago

శర్వానంద్ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించారా

నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…

2 hours ago

ఓపెనింగ్ టాక్…. డామినేషన్ ఎవరిది?

నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…

2 hours ago

మహిళా కమిషన్ నుండి ఎమ్మెల్యే టికెట్ వైపు?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ ప‌ర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…

4 hours ago

సునీల్ వ‌ర్సెస్ RRR.. మ‌రింత ముదిరిందిగా!

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న్‌లో ఉన్న సునీల్‌కు రఘురామకు…

7 hours ago

`న‌వ` నాయ‌కులు… టీడీపీకి ప్ల‌స్సా-మైన‌స్సా.. !

టీడీపీలో నాయ‌కులు.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారా?  ఆయ‌న చెప్పిన‌ట్టే చేస్తున్నారా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…

10 hours ago