ప్రతిభ ఉండాలే కానీ అలాంటి వారికి హద్దులు.. సరిహద్దులే ఉండవని చెబుతారు. అందుకు తగ్గట్లే.. దేశం కాని దేశంలో తన టాలెంట్ తో అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్న తెలుగు అమ్మాయి కథ ఇది. ఇంతా చేస్తే ఆమె వయసు కేవలం పదిహేడేళ్లే. అయితే.. తన పద్నాలుగేళ్ల వయసులోనే సాధించాలన్న కసితో అమెరికా మహిళా క్రికెట్ జట్టు (అండర్ 19 జట్టు)లో చోటు సాధించింది. దగ్గర దగ్గర ఎనిమిదో తరగతి చదివే వయసులో సాధించాలనే కసితో అమెరికా మహిళా క్రికెట్ జట్టుతో చోటు సాధించిన గీతిక కొడాలి వైనం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.
చిరు ప్రాయంలో జట్టులో చేరుకున్న ఆమెకు ప్రస్తుతం పదిహేడేళ్లు. అభినందించాల్సిన విషయం ఏమంటే ఇప్పుడు గీతికకు పదిహేడేళ్లు. ప్రస్తుతం అండర్ 19 జట్టుకు సారథ్యం వహించటం మరో విజయంగా చెప్పాలి. ఇంతకూ ఆమెకు ఈ అవకాశం ఎలా దక్కింది? ఆమె సాధించిన విజయాలేమిటి? అన్న విషయంలోకి వెళితే.. చిన్నతనం నుంచి ఆటలంటే ఇష్టం ఉన్న గీతికకు.. బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు కోచ్ రఘను కలిసిందీ అమ్మాయి.
ట్రైనింగ్ తీసుకుంటే క్రికెట్ లో రాణిస్తావని అతడు చెప్పటంతో రెండేళ్ల శిక్షణ తర్వాత తన పద్నాలుగేళ్ల వయసులో అమెరికన్ మహిళా క్రికెట్ జట్టులోకి వెళ్లే అవకాశాన్ని సొంతం చేసుకుంది. జాతీయ క్రికెట్ లీగ్ కు ఆడిన ఆమె.. సీనియర్ల నుంచి నేర్చుకున్న మెలుకువ తో పాటు తనకు అవసరమైన ఫిట్ నెస్.. బౌలింగ్ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకుంది.
కెనడా.. మెక్సికో..జింబాబ్బే తదితర దేశాల్లో మొత్తం 20 మ్యాచులు ఆడిన ఆమె మూలాల్ని తీసుకుంటే.. తల్లిదండ్రుడు ఏపీకి చెందిన వారు. తల్లి మాధవి.. తండ్రి ప్రశాంత్ ల ప్రోత్సాహం తోడు కావటంతో ఆమెకు ఇబ్బంది లేకుండా పోయింది. అమెరికాలో తొలిసారి గత ఏడాది అండర్ 19 జట్టును ఏర్పాటు చేశారు. జట్టుకు కెప్టెన్ గా నాయకత్వం వహించే అవకాశం ఆమెకు దక్కింది. మొత్తం 15 మందితో కూడిన జట్టు తమ తొలి పర్యటనలో భాగంగా కరేబియన్ ఐలాండ్స్ లో సెయింట్ విన్సెంట్ లో ఆడింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆ జట్టులో అత్యధికులు భారతీయ సంతతికి చెందిన వారే. ఆ సిరీస్ లో మొత్తం నాలుగు మ్యాచులు ఆడి మూడింట్లో గెలిచారు. ఇండియా ఉమెన్స్ ఐపీఎల్ లో పాల్గొనాలని.. అందులో ఆడాలన్నది తన కలగా చెబుతున్నారు. ఆమె ఆ అవకాశాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుందాం.
This post was last modified on March 7, 2022 12:25 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…