ఇప్పటికే ఐదు రోజులుగా యుద్ధంతో నలిగిపోతున్న ఉక్రెయిన్కు ఉపశమనం లభించలేదు. రష్యా పోరుకు సై అంటూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా బెలారస్ వేదికగా ఇరు దేశాల దౌత్య అధికారుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. నాటో కూటమిలో చేరబోమని..తమకు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని.. రష్యా ఉక్రెయిన్ను పట్టుబట్టింది. దీనికి ఉక్రెయిన్ ససేమిరా అంది. ఇక, అదేసమయంలో రష్యా.. తన దళాలను వెనక్కి తీసుకుని, యుద్ధానికి స్వస్తిపలకాలని.. ఉక్రెయిన్ పట్టుబట్టింది. దీనికి రష్యా విముఖత వ్యక్తం చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య చర్యలు బెడిసి కొట్టాయి. పలితంగా యుద్ధం మరింత తీవ్రతరం కానుందని.. తెలుస్తోంది.
వాస్తవానికి.. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోయే దిశగా మొదటి అడుగు పడిందని అందరూ అనుకున్నారు. బెలారస్ సరిహద్దుల్లోని ఉక్రెయిన్ భూభాగంలో ఇరుదేశాల ప్రతినిధులు చర్చలు జరపనున్నారని తెలియడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. చర్చలకు ముందు రష్యా, ఉక్రెయిన్ తమ డిమాండ్లను స్పష్టం చేశాయి. తమ అభ్యంతరాల పరిష్కారంపై ఒప్పందం ఉండాలని రష్యా స్పష్టం చేసింది. దీంతో దాదాపు యుద్ధం తొలిగిపోయిందని అందరూ భావించారు.
ఉక్రెయిన్ కూడా రష్యా తక్షణమే ఆయుధాలను వదిలి కాల్పుల విరమణను అమలు చేయాలని తేల్చిచెప్పింది. ఈ చర్చల సందర్భంగా రెండు దేశాలు ఇవే అంశాలను ప్రస్తావించనున్నాయని అందరూ ఊహించిందే జరిగింది. అయిదు రోజులుగా ఉక్రెయిన్ బాంబులు, తుపాకుల మోతతో దద్ధరిల్లి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తాజా చర్చల పురోగతిపై యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసింది. మరోవైపు యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై ఒత్తిడి తీసుకురావాలని ఉక్రెయిన్ భాగస్వామ దేశాలకు విజ్ఞప్తి చేసింది.
యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దాడులు ఆపేసి వెనక్కి వెళ్లిపోయి.. ప్రాణాలు కాపాడుకోవాలి’ అని రష్యా సైనికులను హెచ్చరించారు. ఐరోపా సమాఖ్యలో తమకు వెంటనే సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన చర్చలు విఫలం కావడం గమనార్హం. దీంతో రష్యా తన చెప్పు చేతల్లోనిబెలారస్ను రంగంలోకి దించేయగా.. ఉక్రెయిన్కూ జపాన్, పోలాండ్ వంటి నాటో దేశాలు మద్దతుగా రంగంలోకి దిగుతున్నాయి. దీంతో యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే ఛాన్స్ కనిపిస్తోందని అంటున్నారు.
This post was last modified on March 1, 2022 9:05 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…