Trends

ఉక్రెయిన్‌-ర‌ష్యాల మ‌ధ్య భీక‌ర పోరు త‌ధ్యం

ఇప్ప‌టికే ఐదు రోజులుగా యుద్ధంతో న‌లిగిపోతున్న ఉక్రెయిన్‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించ‌లేదు. ర‌ష్యా పోరుకు సై అంటూనే ఉంది. ఈ క్ర‌మంలో  తాజాగా బెలార‌స్ వేదిక‌గా ఇరు దేశాల దౌత్య అధికారుల మ‌ధ్య‌ జ‌రిగిన చ‌ర్చ‌లు విఫ‌ల‌మయ్యాయి. నాటో కూటమిలో చేర‌బోమ‌ని..త‌మ‌కు లిఖిత పూర్వ‌కంగా రాసి ఇవ్వాల‌ని.. ర‌ష్యా ఉక్రెయిన్‌ను ప‌ట్టుబ‌ట్టింది. దీనికి ఉక్రెయిన్ స‌సేమిరా అంది. ఇక‌, అదేస‌మ‌యంలో ర‌ష్యా.. త‌న ద‌ళాల‌ను వెన‌క్కి తీసుకుని, యుద్ధానికి స్వ‌స్తిప‌ల‌కాల‌ని.. ఉక్రెయిన్ ప‌ట్టుబ‌ట్టింది. దీనికి ర‌ష్యా విముఖ‌త వ్య‌క్తం చేసింది. దీంతో ఇరు దేశాల మ‌ధ్య చ‌ర్య‌లు బెడిసి కొట్టాయి. ప‌లితంగా యుద్ధం మ‌రింత తీవ్ర‌త‌రం కానుంద‌ని.. తెలుస్తోంది.

వాస్త‌వానికి.. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ఆగిపోయే దిశగా మొదటి అడుగు పడింద‌ని అంద‌రూ అనుకున్నారు.  బెలారస్‌ సరిహద్దుల్లోని ఉక్రెయిన్‌ భూభాగంలో ఇరుదేశాల ప్రతినిధులు చర్చలు జరపనున్నార‌ని తెలియ‌డంతో అంద‌రూ సంతోషం వ్య‌క్తం చేశారు. చర్చలకు ముందు రష్యా, ఉక్రెయిన్‌ తమ డిమాండ్లను స్పష్టం చేశాయి. తమ అభ్యంతరాల పరిష్కారంపై ఒప్పందం ఉండాలని రష్యా స్పష్టం చేసింది. దీంతో దాదాపు యుద్ధం తొలిగిపోయింద‌ని అంద‌రూ భావించారు.

ఉక్రెయిన్‌ కూడా రష్యా తక్షణమే ఆయుధాలను వదిలి కాల్పుల విరమణను అమలు చేయాలని తేల్చిచెప్పింది. ఈ చర్చల సందర్భంగా రెండు దేశాలు ఇవే అంశాలను ప్రస్తావించనున్నాయని అంద‌రూ ఊహించిందే జ‌రిగింది. అయిదు రోజులుగా ఉక్రెయిన్‌ బాంబులు, తుపాకుల మోతతో దద్ధరిల్లి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తాజా చర్చల పురోగతిపై యావత్‌ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసింది. మ‌రోవైపు యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఉక్రెయిన్ భాగస్వామ దేశాలకు విజ్ఞప్తి చేసింది.

యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దాడులు ఆపేసి వెనక్కి వెళ్లిపోయి.. ప్రాణాలు కాపాడుకోవాలి’ అని రష్యా సైనికులను హెచ్చరించారు. ఐరోపా సమాఖ్యలో తమకు వెంటనే సభ్యత్వం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌రిగిన చ‌ర్చ‌లు విఫ‌లం కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ర‌ష్యా త‌న చెప్పు చేత‌ల్లోనిబెలార‌స్‌ను రంగంలోకి దించేయ‌గా.. ఉక్రెయిన్‌కూ జ‌పాన్‌, పోలాండ్ వంటి నాటో దేశాలు మ‌ద్ద‌తుగా రంగంలోకి దిగుతున్నాయి. దీంతో యుద్ధం మ‌రింత తీవ్ర‌త‌రం అయ్యే ఛాన్స్ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

This post was last modified on March 1, 2022 9:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

2 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

3 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

4 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

4 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

6 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

7 hours ago