వినడానికి కాస్త విచిత్రంగానే ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు, విదేశాలకు మన దగ్గర నుంచి గంజాయి ఎగుమతి అవుతున్న విషయం తెలిసిందే. కానీ రివర్సులో విదేశాల నుంచి అందునా అమెరికా నుంచి గంజాయి దిగుమతి అవ్వటం మాత్రం ఇదే మొదటిసారి. దేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా హైదరాబాద్ కు గంజాయి దిగుమతయ్యింది. అమెరికా నుంచి దిగుమతి అయిన గంజాయి పరుపుల మధ్య వచ్చింది. లక్డీకాపూల్ లోని ఒక పరుపులు అమ్మే ఏజెన్సీకి గంజాయి చేరింది.
అమెరికా నుంచి కొందరు పరుపులు దిగుమతి చేసుకోవటం జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి పద్దతిలోనే ఆ ఏజెన్సీకి రెండు పరుపులు వచ్చాయి. పరుపులు చేరుకోగానే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు దాడి చేసి పరుపులను స్వాధీనం చేసుకున్నారు. ఒకటిగా ఉన్న రెండు పరుపులను విడదీస్తే మధ్యలో 1.42 కిలోల గంజాయి బయటపడింది. కొరియర్ కంపెనీలోని అడ్రస్ ప్రకారం పరుపులను అక్షయ్ జైన్, అమరేందర్ తెప్పించుకున్నారు.
ఏజెన్సీలోని ఇన్వాయిస్ ప్రకారం ఎన్సీబీ అధికారులు వెంటనే పై ఇద్దరినీ అరెస్టు చేశారు. వాళ్ళిద్దరు కూడా తామే అమెరికా నుండి గంజాయిని తెప్పించుకున్నట్లు అంగీకరించారు. అమెరికా నుండి రెగ్యులర్ గా నిషేధిత మత్తు పదార్ధాలను తెప్పించుకుంటున్నట్లు చెప్పారు. పరుపుల మధ్యలో గంజాయి హైదరాబాద్ కు రావటం బాగానే ఉంది. అయితే అసలు అమెరికాలో గంజాయిని పరుపుల మధ్య ఉంచి ఎలా ఎగుమతికి అనుమతించారన్నదే అర్ధం కావటం లేదు.
ఒక వస్తువును ఎగుమతి చేయాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా అమెరికాలో చాలా ఆంక్షలుంటాయి. అన్ని ఆంక్షలను దాటుకుని అమెరికా నుంచి గంజాయి హైదరాబాద్ కు చేరుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న గంజాయి చాలా హై క్వాలిటీదని అధికారులు చెప్పారు. మన దగ్గర దొరికే గంజాయికన్నా అమెరికా నుండి దిగుమతైన గంజాయి క్వాలిటిలో 10 రెట్లు ఎక్కువట. అలాగే మన దగ్గర పండే గంజాయి వాసన ఎక్కువగా ఉంటుందట. ఇపుడు దిగుమతైన గంజాయి వాసన పెద్దగా ఉండదని అధికారులు చెప్పారు.
This post was last modified on February 22, 2022 12:39 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ ఏ ముహూర్తాన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ తీయాలనుకున్నాడో కానీ.. అది ఆయనకు కెరీర్లో ఎన్నడూ…
సౌత్ సినిమాను దశాబ్దాలుగా తక్కువగా చూస్తుండేది బాలీవుడ్. అక్కడి నటులు, ఫిలిం మేకర్లు తమను తాము గొప్పగా ఫీలయ్యేవాళ్లన్నది స్పష్టం.…
హెడ్డింగ్ చదవగానే కొందరికి నవ్వు వచ్చి ఉండొచ్చు లేదా విచిత్రంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ మొత్తంలో ఈ రోజుల్లో…
కొత్త సినిమాలకే థియేటర్లలో జనం లేక ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్న టైమిది. అలాంటిది రీ రిలీజులకు జనాన్ని ఆశించడం కష్టమే. మొన్నటికి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు కావాలంటే తొంబై రోజుల ముందే అప్లై చేసుకోవాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిన్న…
కెరీర్లో చాలా ఏళ్లు పక్కింటి కుర్రాడి పాత్రలే చేస్తూ వచ్చాడు నేచురల్ స్టార్ నాని. కానీ ‘దసరా’ చిత్రంతో తన…