Trends

అహ్మ‌దాబాద్ పేలుళ్ల కేసులో సంచ‌ల‌న తీర్పు.. 38 మందికి మ‌ర‌ణ శిక్ష‌

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 2008లో జరిగిన పేలుళ్ల కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు సంచలన
తీర్పు వెలువరించింది. మొత్తం 77 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిని విచారించిన కోర్టు… 49 మందిని దోషులుగా తేల్చింది. వీరందరికీ ఈ కేసులో ప్రత్యేక్ష ప్రమేయం ఉందని కోర్టు నిర్దారించింది. వీరిలో 38 మంది దోషులకు మరణశిక్ష విధించింది. మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 11 వందల మంది సాక్ష్యులను కోర్టు విచారించింది.

2008వ సంవత్సరం జూలై 26న అహ్మదాబాద్ నగరంలోని 21 ప్రాంతాల్లో   వరుస బాంబుపేలుళ్లు చోటు చేసుకున్నాయి. కేవలం 70 నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ పేలుళ్లు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపాయి.  ఈ ఘటనలో 56 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా… 200 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ పేలుళ్లకు తామే కారణమంటూ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహీద్దీన్ ప్రకటించుకుంది. దీని వెనుక పలు మిలిటెంట్ గ్రూపులు కూడా ఉన్నాయని విచారణలో తేలింది. కాగా… బెంగళూరులో బాంబు దాడి జరిగిన మరుసటి రోజే అహ్మదాబాద్ లో బాంబుపేలుళ్లు జరగడం అప్పట్లో దేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

దాదాపు 13 సంవత్సరాల విచారణ అనంతరం ఈరోజు ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించడం గమనార్హం. అప్ప‌ట్లో ఈ కేసుపై అనేక రాజ‌కీయ వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ స‌మ‌యంలో ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. దీంతో రాజ‌కీయ వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా బీజేపీపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఎట్ట‌కేల‌కు ప్ర‌త్య‌క కోర్టు తీర్పు వెలువ‌రించ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on February 18, 2022 1:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అన్ని శాఖలు రేవంత్ తీసుకుంటే ఎలా?’

చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…

4 minutes ago

ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదుగా బాబూ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. పెట్టుబడుల‌కు ఎక్క‌డ అవ‌కాశం ఉంటే..…

4 hours ago

ట్రంప్‌కు భారీ షాక్‌.. తెంప‌రిత‌నం త‌గ్గేనా?!

తెంప‌రి త‌నానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్య‌క్షుడు ట్రంపేన‌న్న కామెంట్లు త‌ర‌చుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యంతో…

5 hours ago

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

9 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

12 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

12 hours ago