గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 2008లో జరిగిన పేలుళ్ల కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు సంచలన
తీర్పు వెలువరించింది. మొత్తం 77 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిని విచారించిన కోర్టు… 49 మందిని దోషులుగా తేల్చింది. వీరందరికీ ఈ కేసులో ప్రత్యేక్ష ప్రమేయం ఉందని కోర్టు నిర్దారించింది. వీరిలో 38 మంది దోషులకు మరణశిక్ష విధించింది. మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 11 వందల మంది సాక్ష్యులను కోర్టు విచారించింది.
2008వ సంవత్సరం జూలై 26న అహ్మదాబాద్ నగరంలోని 21 ప్రాంతాల్లో వరుస బాంబుపేలుళ్లు చోటు చేసుకున్నాయి. కేవలం 70 నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ పేలుళ్లు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపాయి. ఈ ఘటనలో 56 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా… 200 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ పేలుళ్లకు తామే కారణమంటూ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహీద్దీన్ ప్రకటించుకుంది. దీని వెనుక పలు మిలిటెంట్ గ్రూపులు కూడా ఉన్నాయని విచారణలో తేలింది. కాగా… బెంగళూరులో బాంబు దాడి జరిగిన మరుసటి రోజే అహ్మదాబాద్ లో బాంబుపేలుళ్లు జరగడం అప్పట్లో దేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
దాదాపు 13 సంవత్సరాల విచారణ అనంతరం ఈరోజు ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించడం గమనార్హం. అప్పట్లో ఈ కేసుపై అనేక రాజకీయ వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో రాజకీయ వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా బీజేపీపై విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు ప్రత్యక కోర్టు తీర్పు వెలువరించడం గమనార్హం.
This post was last modified on February 18, 2022 1:26 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…