గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 2008లో జరిగిన పేలుళ్ల కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు సంచలన
తీర్పు వెలువరించింది. మొత్తం 77 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిని విచారించిన కోర్టు… 49 మందిని దోషులుగా తేల్చింది. వీరందరికీ ఈ కేసులో ప్రత్యేక్ష ప్రమేయం ఉందని కోర్టు నిర్దారించింది. వీరిలో 38 మంది దోషులకు మరణశిక్ష విధించింది. మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 11 వందల మంది సాక్ష్యులను కోర్టు విచారించింది.
2008వ సంవత్సరం జూలై 26న అహ్మదాబాద్ నగరంలోని 21 ప్రాంతాల్లో వరుస బాంబుపేలుళ్లు చోటు చేసుకున్నాయి. కేవలం 70 నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ పేలుళ్లు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపాయి. ఈ ఘటనలో 56 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా… 200 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ పేలుళ్లకు తామే కారణమంటూ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహీద్దీన్ ప్రకటించుకుంది. దీని వెనుక పలు మిలిటెంట్ గ్రూపులు కూడా ఉన్నాయని విచారణలో తేలింది. కాగా… బెంగళూరులో బాంబు దాడి జరిగిన మరుసటి రోజే అహ్మదాబాద్ లో బాంబుపేలుళ్లు జరగడం అప్పట్లో దేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
దాదాపు 13 సంవత్సరాల విచారణ అనంతరం ఈరోజు ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించడం గమనార్హం. అప్పట్లో ఈ కేసుపై అనేక రాజకీయ వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో రాజకీయ వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా బీజేపీపై విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు ప్రత్యక కోర్టు తీర్పు వెలువరించడం గమనార్హం.
This post was last modified on February 18, 2022 1:26 pm
రాజకీయాలు మారాయి. ఒకప్పుడు భర్తలు ఎన్నికల రంగంలో ఉంటే.. భార్యలు ఉడతా భక్తిగా ప్రచార కార్యక్రమాలు చూసుకునే వారు. అది…
ఎదురుచూసేకొద్దీ బాక్సాఫీస్ కు జోష్ ఇచ్చే సినిమాలు రావడం అంతకంతా ఆలస్యమవుతూనే ఉంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. తెగుతున్న సింగల్ డిజిట్…
రాజకీయంగా చైతన్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ. అటు క్రికెట్ అయినా.. ఇటు రాజకీయాలైనా.. తెలంగాణ లో హాట్ టాపిక్కే. ఇక్కడ…
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసిన రెండు సినిమాలతోనే చాలా ప్రామిసింగ్గా అనిపించిన వారసుల్లో ధ్రువ్ విక్రమ్ ఒకడు. అర్జున్…
సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో నటించినపుడు చిన్న సన్నివేశమైనా సరే సుక్కునే తీయాల్సి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…