Trends

కరోనా వైరస్ కంటే వేగంగా పాకిన హిజాబ్ వివాదం

కర్నాటకలోని ఉడిపి ప్రభుత్వ కాలేజీలో మొదలైన హిజాబ్ వివాదం దేశమంతా పాకుతోంది. ప్రభుత్వ కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా కొందరు ముస్లిం విద్యార్ధినులు హిజాబ్ ధరించి కాలేజీకి రావటంతో యాజమాన్యం అభ్యంతరం చెప్పింది. హిజాబ్ లేకుండానే కాలేజీకి రావాలని స్పష్టంగా చెప్పింది. దీన్ని ఐదు మంది ముస్లిం విద్యార్ధినులు పట్టించుకోకపోవటంతో వివాదం మొదలైంది. వీళ్ళ చర్యను నిరసిస్తూ హిందు విద్యార్ధుల్లో కొందరు కాషాయం కండువాలను, తలపాగాలను ధరించి కాలేజీకి రావటం మొదలుపెట్టారు.

అలాగే హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్ధినులను టీజ్ చేయటం మొదలుపెట్టారు. దాంతో విద్యార్ధులు రెండు గ్రూపులుగా విడిపోవటంతో గొడవలు మొదలైపోయాయి. ఈ వివాదం కర్నాటకలోని ఎనిమిది జిల్లాలకు పాకింది. విజాబ్ వివాదం కరోనా వైరస్ కన్నా చాలా వేగంగా పాకటంతో వేరేదారి లేక ప్రభుత్వం విద్యాసంస్ధలకు సెలవులు కూడా ప్రకటించాల్సొచ్చింది. ఇదే వివాదం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, బీహార్, రాజస్ధాన్, ఢిల్లీ కి చాలా స్పీడుగా పాకిపోయింది.

ఒకవైపేమో హిజాబ్ వివాదాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మొదలు పెట్టవద్దు అని సుప్రీంకోర్టు నెత్తీ నోరు మొత్తుకుంటోంది. అయినా ఎవరు వినటం లేదు. విద్యార్ధుల్లో మొదలైన హిజాబ్ వివాదంలో  రాజకీయ నేతల జోక్యం చేసుకున్నారు. వీళ్ళ కారణంగా వివాదానికి రాజకీయ రంగు పులుముకుంది. చివరకు అది కాస్త హిందు-ముస్లిం వివాదంగా మారిపోయింది. ఈ వివాదంలోకి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎంటరవ్వగానే ముస్లింలు ఏకమైపోయారు. దాని కారణంగానే చాలా స్పీడుగా వివాదానికి రాజకీయ రంగులు పులుముకున్నాయి.

ఇదే విషయమై రాజస్ధాన్ లోని జైపూర్లో కూడా పెద్ద గొడవైంది. యూనీఫారమ్ కు బిన్నంగా కొందరు విద్యార్ధినులు బుర్కాను ధరించారని యాజమాన్యం వాళ్ళని కాలేజీలోకి అనుమతించలేదు. దాంతో విషయం తెలియగానే వాళ్ళ తల్లిదండ్రులు రంగంలోకి దిగేశారు. ఎప్పుడైతే వివాదం జరుగుతున్న విషయం తెలియగానే వెంటనే ముస్లింలకు మద్దతుగా రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో జైపూర్లో శుక్రవారమంతా పెద్ద గొడవలు జరిగాయి.  చివరకు ఈ హిజాబ్ వివాదం యావత్ దేశాన్ని కుదిపేసేట్లుంది చూస్తుంటే. 

This post was last modified on February 12, 2022 11:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

4 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

5 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

5 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

6 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

8 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

8 hours ago