Trends

బ‌డ్జెట్ ఎఫెక్ట్‌: ధ‌ర‌లు త‌గ్గేవి.. పెరిగేవి.. ఇవే!

కేంద్రం బడ్జెట్-2022ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్. సాధారణంగా ఉపయోగించే కొన్ని వస్తువు లపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే కొన్నింటిపై దిగుమతి సుంకంలో కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొన్ని వస్తువులు చౌకగా రానుండగా, మరికొన్ని మాత్రం ప్రియం కానున్నాయి.

దీంతో మొబైల్ కెమెరా లెన్స్ ధరలు తగ్గనున్నాయి. అలాగే కస్టమ్స్ సుంకం పెంచడం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే హెడ్ఫోన్స్, ఇయర్ఫోన్స్, లౌడ్ స్పీకర్ల ధరలు భారీగా పెరగనున్నాయి. బడ్జెట్ తర్వాత ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువులు చౌకగా లభిస్తాయో ఓసారి చూద్దాం.

ధ‌ర‌లు పెరిగేవి..
గొడుగులు, అనుకరణ ఆభరణాలు, లౌడ్ స్పీకర్లు, హెడ్ఫోన్స్, ఇయర్ఫోన్స్, స్మార్ట్ మీటర్స్, సోలార్ సెల్స్, సోలార్ మాడ్యూల్స్క్స్, ఎక్స‌రే మెషీన్లు, ఎలక్ట్రిక్ బొమ్మల విడిభాగాలు. విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకునే వంట నూనెల‌, ఖ‌ర్జూరం, టూత్ బ్ర‌ష్‌లు, షేవింగ్ క్రీములు,  ఫ్యాష‌న్ షూలు, చెప్పులు. కార్ల విడిభాగాలు. టైర్లు, ట్యూబులు, ఆవాలు, జీల‌క‌ర్ర‌, మెంతులు, ధనియాలు, విదేశీ అర‌టిప‌ళ్లు.

ధ‌ర‌లు త‌గ్గేవి..
పాలిష్ చేసిన వజ్రాలు, మొబైల్ ఫోన్ల కెమెరా లెన్స్, ఇంగువ, కొకోవా బీన్స్, ఎసిటిక్ ఆమ్లాలు, మిథైల్ ఆల్కహాల్, ఫ్రోజెన్ మస్సెల్స్ఫ్రోజెన్ స్క్విడ్స్, ఒక ర‌క‌మైన చాక్‌లెట్లు, శీత‌ల పానీయాలు, జ్యూసులు, ప్రాసెస్‌డ్ ఫుడ్‌. రత్నాలు, వజ్రాలు, మొబైల్ ఫోన్లు. మొబైల్ ఫోన్ ఛార్జర్లు, పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన రసాయనాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు, మిథనాల్‌తో సహా కొన్ని రసాయనాలు,  స్మార్ట్‌వాచ్‌, వినికిడి పరికరాలు. వ్యవసాయ ఉపకరణాలు.

This post was last modified on February 1, 2022 6:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

19 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago