దేశంలో ప్రజలు వినియోగించే ఫోన్లు, ఇంటర్నెట్పై కేంద్ర ప్రభుత్వం తన పెత్తనాన్ని మరింత పెంచింది. కాల్ రికార్డింగ్స్, మేసేజ్లకు సంబంధించి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ కాల్స్, శాటిలైట్ ఫోన్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్, సాధారణ నెట్వర్క్లతో పాటు ఇంటర్నెట్లో పంపిన మెసేజ్ల వివరాలను కనీసం రెండేళ్లపాటు భద్రపరచడాన్ని తప్పనిసరి చేసింది. టెలికాం ఆపరేటర్లకు టెలికాం శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఏడాది పాటే కాల్ రికార్డింగ్ డేటాను భద్రపరచగా.. ఆ వ్యవధిని రెండేళ్లకు పెంచుతూ టెలికాం శాఖ(డాట్) ఏకీకృత లైసెన్స్లో సవరణ చేసింది.
నెట్వర్క్ నుంచి జరిగిన సంభాషణలకు సంబంధించి కమర్షియల్ రికార్డ్స్, కాల్ వివరాల రికార్డ్, ఎక్స్ఛేంజ్ వివరాల రికార్డ్, ఐపీ వివరాల రికార్డులను ప్రభుత్వ పరిశీలన కోసం రెండేళ్ల పాటు తప్పనిసరిగా భద్రపరచాలి. లైసెన్సర్ నుంచి ఎలాంటి దిశానిర్దేశాలు అందకపోతే ఆ డేటాను తర్వాత డిలీట్ చేయవచ్చు. వాయిస్ మెయిల్స్, ఆడియో టెక్స్, యూనిఫైడ్ మెసేజింగ్ సేవలకు ఈ నిబంధన వర్తిస్తుంది అని తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది.
ఈ లైసెన్సులు పొందిన టాటా కమ్యూనికేషన్స్, సిస్కోస్ వెబెక్స్, ఏటీ అండ్ టీ గ్లోబల్ నెట్వర్క్ తదితర కంపెనీలకు కూడా ఈ సవరణ వర్తిస్తుంది. డేట్ ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్(ఐఎల్డీ) లైసెన్స్లో సవరణలు చేసింది. దీని ద్వారా కాల్ వివరాల రికార్డులను భద్రపరచడాన్ని ఒక ఏడాది పొడిగించడం సహా ఇంటర్నెట్ ప్రోటోకాల్ను ఉపయోగించి చేసిన అంతర్జాతీయ కమ్యూనికేషన్ల వివరాలను భద్రపరిచాల్సి ఉంటుంది.
శాటిలైట్ ఫోన్ కాల్స్, డేటా సేవలను అందించడానికి బీఎస్ఎన్ఎల్కు జారీ చేసిన లైసెన్స్లోనూ కేంద్రం ఇదే విధమైన సవరణ చేసింది. ఉపగ్రహ ఆధారిత సేవలను అందించే వీశాట్ లైసెన్స్ కలిగిన ఆపరేటర్లకు కూడా కనీసం రెండేళ్లపాటు కాల్ డేటా, ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ రికార్డులను నిల్వ చేయడాన్ని తప్పనిసరి చేసింది. అయితే.. ఇది చౌర్యానికి దారి తీస్తుందని.. ప్రజల, వ్యక్తుల గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుందని.. ప్రతిపక్షాలు అంటున్నాయి. అంతేకాదు.. కేవలం బీజేపీ నేతలు తమకు సహకరించని స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు.. కార్పొరేట్ సంస్థలకు చెక్ పెట్టేందుకు, వేధించేందుకే దీనిని తీసుకువచ్చారని అంటున్నారు. మున్ముందు ఈ నిర్ణయం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on January 31, 2022 10:44 am
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…