Trends

ఫోన్లు, ఇంట‌ర్నెట్‌పై కేంద్రం మ‌రింత పెత్త‌నం

దేశంలో ప్ర‌జ‌లు వినియోగించే ఫోన్లు, ఇంట‌ర్నెట్‌పై కేంద్ర ప్ర‌భుత్వం త‌న పెత్త‌నాన్ని మ‌రింత పెంచింది. కాల్ రికార్డింగ్స్, మేసేజ్‌ల‌కు సంబంధించి కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ కాల్స్, శాటిలైట్ ఫోన్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్, సాధారణ నెట్‌వర్క్‌లతో పాటు ఇంటర్నెట్‌లో పంపిన మెసేజ్ల వివరాలను కనీసం రెండేళ్లపాటు భద్రపరచడాన్ని తప్పనిసరి చేసింది. టెలికాం ఆపరేటర్లకు టెలికాం శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఏడాది పాటే కాల్ రికార్డింగ్ డేటాను భద్రపరచగా.. ఆ వ్యవధిని రెండేళ్లకు పెంచుతూ టెలికాం శాఖ(డాట్)  ఏకీకృత లైసెన్స్లో సవరణ చేసింది.

నెట్వర్క్ నుంచి జరిగిన సంభాషణలకు సంబంధించి కమర్షియల్ రికార్డ్స్, కాల్ వివరాల రికార్డ్, ఎక్స్ఛేంజ్ వివరాల రికార్డ్, ఐపీ వివరాల రికార్డులను ప్రభుత్వ పరిశీలన కోసం రెండేళ్ల పాటు తప్పనిసరిగా భద్రపరచాలి. లైసెన్సర్ నుంచి ఎలాంటి దిశానిర్దేశాలు అందకపోతే ఆ డేటాను తర్వాత డిలీట్ చేయవచ్చు. వాయిస్ మెయిల్స్, ఆడియో టెక్స్, యూనిఫైడ్ మెసేజింగ్ సేవలకు ఈ నిబంధన వర్తిస్తుంది అని తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది.

ఈ లైసెన్సులు పొందిన టాటా కమ్యూనికేషన్స్, సిస్కోస్ వెబెక్స్, ఏటీ అండ్ టీ గ్లోబల్ నెట్‌వర్క్ తదితర కంపెనీలకు కూడా ఈ సవరణ వర్తిస్తుంది. డేట్ ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్(ఐఎల్డీ) లైసెన్స్‌లో సవరణలు చేసింది. దీని ద్వారా కాల్ వివరాల రికార్డులను భద్రపరచడాన్ని ఒక ఏడాది పొడిగించడం సహా ఇంటర్నెట్ ప్రోటోకాల్‌ను ఉపయోగించి చేసిన అంతర్జాతీయ కమ్యూనికేషన్ల వివరాలను భద్రపరిచాల్సి ఉంటుంది.

శాటిలైట్ ఫోన్ కాల్స్, డేటా సేవలను అందించడానికి బీఎస్ఎన్ఎల్కు జారీ చేసిన లైసెన్స్‌లోనూ కేంద్రం ఇదే విధమైన సవరణ చేసింది. ఉపగ్రహ ఆధారిత సేవలను అందించే వీశాట్ లైసెన్స్ కలిగిన ఆపరేటర్లకు కూడా కనీసం రెండేళ్లపాటు కాల్ డేటా, ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ రికార్డులను నిల్వ చేయడాన్ని తప్పనిసరి చేసింది. అయితే.. ఇది చౌర్యానికి దారి తీస్తుంద‌ని.. ప్ర‌జ‌ల‌, వ్య‌క్తుల గోప్యత హ‌క్కుకు భంగం క‌లిగిస్తుంద‌ని.. ప్ర‌తిప‌క్షాలు అంటున్నాయి. అంతేకాదు.. కేవ‌లం బీజేపీ నేత‌లు త‌మ‌కు స‌హ‌క‌రించ‌ని స్వ‌చ్ఛంద సంస్థ‌లు, రాజ‌కీయ పార్టీలు.. కార్పొరేట్ సంస్థ‌ల‌కు  చెక్ పెట్టేందుకు, వేధించేందుకే దీనిని తీసుకువ‌చ్చార‌ని అంటున్నారు. మున్ముందు ఈ నిర్ణ‌యం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.

This post was last modified on January 31, 2022 10:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

1 hour ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

4 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

4 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

5 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

7 hours ago