Trends

కొవిడ్ టీకా తయారీ యోధులకు ‘పద్మ’ పురస్కారం

యావత్ ప్రపంచాన్ని మహమ్మారి పట్టేసిన వేళలో.. భవిష్యత్తు ఏమిటన్నది ఒక పట్టాన అర్థం కాని సందర్భంలో.. తెలియని దారిలో మిణుకు మిణుకుమనే ఆశల లాంతరును పట్టుకొని వెతుక్కుంటూ వెళ్లిన వ్యాక్సిన్ తయారీ యోధులకు తాజా పద్మ పురస్కారాల్లో చోటు లభించింది. తాజాగా ప్రకటించిన పద్మ పురస్కారాల్లో కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ అధినేతలు కృష్ణ ఎల్లా.. సుచిత్ర ఎల్లాలకు కేంద్రం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.

ఈ శాస్త్రవేత్తల జంటతో పాటు.. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను తయారీలో కీలక భూమిక పోషించి.. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున టీకాల్ని అందజేయటంలో ప్రధాన పాత్ర పోషించిన సీరం ఇనిస్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలాకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు.దేశ ప్రజలకు వారు అందించిన సేవలకు ఈ పురస్కారం దక్కడం సముచిత గౌరవం. ఈ రోజున దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంత భారీగా.. ఇంత వేగంగా సాగిందంటే దానికి కారణం.. ఈ ముగ్గురి ప్రయత్నాలేనని చెప్పక తప్పదు. 

ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా ప్రయోగాలు సాగిన వేళలో.. సక్సెస్ అయిన ప్రయోగాలు చాలా తక్కువ. అందునా.. దేశీయంగా టీకాను డెవలప్  చేయడానికి  మించిన  సవాలు  మరొకటి ఉండదు. అలాంటి సవాల్ ను స్వీకరించి.. ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ.. పంటి బిగువన ఒత్తిడి మోస్తూ.. ప్రజల ఆశలకు.. ఆకాంక్షలకు ఏ మాత్రం తేడా రానివ్వకుండా.. ప్రపంచంలో అత్యుత్తమ వ్యాక్సిన్లలో ఒకటిగా చెప్పే అతి కొద్ది టీకాల్లో ఒకటిగా పేరును సొంతం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు.

కోవిడ్ లాంటి కఠిన పరీక్షను ఎదుర్కొంటూ.. ఎలాంటి లోపాలకు చోటివ్వకుండా వ్యాక్సిన్ రూపొందించటం అంత సామాన్యమైన విషయం కాదు. ఏ చిన్న తేడా వచ్చినా జరిగే నష్టం అపారంగా ఉంటుంది. అందుకే.. ఎంతో శ్రద్ధతో పరిశోధన చేయాల్సి ఉంటుంది. రిస్కు పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది.. ఆ సవాళ్లను ఎదుర్కొని.. లోప రహిత టీకాన్ని రూపొందించటం అంత తేలికైన విషయం కాదు.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. భారత్ బయోటెక్.. సీరం సంస్థల మధ్య వ్యాపార పోటీ మామూలుగా ఉండదు. వ్యాక్సిన్ వచ్చిన మొదట్లో జరిగిన ప్రచారం తెలిసిందే.చాలా త్వరగా సదరు వివాదం ఒక కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. ఏమైనా.. వ్యాపార పరంగా భిన్న ధ్రువాలుగా ఉండే ఇద్దరికి.. పద్మ పురస్కారం లభించటం.. అది కూడా ఒకే ఏడాదిలో కావడం ఒక విశేషం.

This post was last modified on January 26, 2022 11:33 am

Share

Recent Posts

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

2 minutes ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

47 minutes ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

2 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

2 hours ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

3 hours ago

కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్నీ… వదలమంటున్న బొద్దింకలు

ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…

3 hours ago