Trends

కర్నూల్లో నిజమైన శ్రీమంతుడు

పది రూపాయిలకు పేచీ పడి ప్రాణాలు తీస్తున్న పాడు రోజులవి. ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని పిల్లలు.. భార్యను భర్త.. భర్తను భార్య.. అన్నను తమ్ముడు.. తమ్ముడ్ని అన్న.. ఇలా చెప్పుకుంటూ డబ్బుల కోసం జరుగుతున్న దారుణాలు అన్నిఇన్ని కావు. అలాంటిది.. అందుకు భిన్నంగా రూ.6 కోట్లు విలువ చేసే 12 ఎకరాల భూమిని పేదల కోసం దానం చేయటం మామూలు విషయం కాదు.

అలాంటి సినిమాటిక్ సీన్ తాజాగా కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఇంత చేశాడంటే.. కచ్ఛితంగా ఏదో రాజకీయ ఎజెండా ఉందని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరిగింది. కర్నూలు జిల్లాలోని తుగ్గలికి చెందిన రాష్ట్ర శాలివాహన సంఘం అధ్యక్షుడు నాగేంద్ర.. ఆయన సతీమణి వరలక్ష్మి దంపతులు పేదల సొంతింటి కలను తీర్చాలని భావించారు.

అందుకోసం తమ వంతుగా ఏమైనా చేద్దామనుకున్నారు.
ఇందులో భాగంగా 12 ఎకరాల భూమిని 670 మందికి ఇళ్ల స్థలాలుగా మార్చి పంపిణీ చేశారు. ఇందుకోసం తాజాగా ఒక కార్యక్రమాన్ని చేపట్టటంతో ఈ విశేషాన్ని చూసేందుకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. ఎలాంటి ఖర్చులు లేకుండా రిజిస్ట్రేషన్ చేయిస్తూ అందరి మనసుల్ని దోచుకున్నారు.

ఈ కార్యక్రమానికి వైసీపీ.. టీడీపీ.. బీజేపీ.. సీపీఐ.. ఎమ్మార్పీఎస్ తదితర పార్టీల నేతలంతా హాజరయ్యారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాల్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏమైనా.. కోట్లాది రూపాయిల విలువైన భూమిని పేదలకు సొంతింటి కోసం దానం చేయటం చూస్తే.. రీల్ లో చూసే దానికి మించిన రియల్ శ్రీమంతులు ఈ దంపతులు అని చెప్పక తప్పదు.

Satya

Recent Posts

వైసీపీ ఫేస్‌బుక్ బ్లాక్‌… స‌ర్కారుపై జ‌గ‌న్ ఫైర్

ఏపీ ప్ర‌తిప‌క్షం(ప్ర‌ధాన కాదు) వైసీపీ సోష‌ల్ మీడియాలో దూకుడుగా ఉంటున్న విష‌యం తెలిసిందే. యూట్యూబ్‌, ఇన్‌స్టా, వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఎక్స్‌..…

2 hours ago

డ్యూడ్-2… అవసరమా?

గత ఏడాది తమిళ, తెలుగు భాషల్లో పెద్ద హిట్ అయిన సినిమాల్లో ‘డ్యూడ్’ ఒకటి. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో…

3 hours ago

అబ్సెషన్ మూవీకి నీలాంబరి కనెక్షన్

బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్న హాలీవుడ్ మూవీ అబ్సెషన్ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. రెండు గంటల లోపే నిడివితో థ్రిల్లర్…

5 hours ago

ఢిల్లీలో జనసేన కీలక భేటీ

ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేన.. దేశ రాజధాని ఢిల్లీలో రేపు ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది.…

6 hours ago

పెద్దిలో మిస్స‌యిన లాజిక్‌కు బుచ్చిబాబు జ‌వాబు

ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వ‌చ్చిన బిగ్గెస్ట్ మూవీ పెద్ది. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుద‌లైన ఈ…

6 hours ago

ఓదెల ‘మెగా’ ప్రాజెక్టు… స్ట్రాటజీ మార్చాల్సిందే

భోళా శంకర్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ ని మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ దాదాపుగా పూడ్చేసింది. అయితే ఒకప్పటిలా…

7 hours ago