Trends

కర్నూల్లో నిజమైన శ్రీమంతుడు

పది రూపాయిలకు పేచీ పడి ప్రాణాలు తీస్తున్న పాడు రోజులవి. ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని పిల్లలు.. భార్యను భర్త.. భర్తను భార్య.. అన్నను తమ్ముడు.. తమ్ముడ్ని అన్న.. ఇలా చెప్పుకుంటూ డబ్బుల కోసం జరుగుతున్న దారుణాలు అన్నిఇన్ని కావు. అలాంటిది.. అందుకు భిన్నంగా రూ.6 కోట్లు విలువ చేసే 12 ఎకరాల భూమిని పేదల కోసం దానం చేయటం మామూలు విషయం కాదు.

అలాంటి సినిమాటిక్ సీన్ తాజాగా కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఇంత చేశాడంటే.. కచ్ఛితంగా ఏదో రాజకీయ ఎజెండా ఉందని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరిగింది. కర్నూలు జిల్లాలోని తుగ్గలికి చెందిన రాష్ట్ర శాలివాహన సంఘం అధ్యక్షుడు నాగేంద్ర.. ఆయన సతీమణి వరలక్ష్మి దంపతులు పేదల సొంతింటి కలను తీర్చాలని భావించారు.

అందుకోసం తమ వంతుగా ఏమైనా చేద్దామనుకున్నారు.
ఇందులో భాగంగా 12 ఎకరాల భూమిని 670 మందికి ఇళ్ల స్థలాలుగా మార్చి పంపిణీ చేశారు. ఇందుకోసం తాజాగా ఒక కార్యక్రమాన్ని చేపట్టటంతో ఈ విశేషాన్ని చూసేందుకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. ఎలాంటి ఖర్చులు లేకుండా రిజిస్ట్రేషన్ చేయిస్తూ అందరి మనసుల్ని దోచుకున్నారు.

ఈ కార్యక్రమానికి వైసీపీ.. టీడీపీ.. బీజేపీ.. సీపీఐ.. ఎమ్మార్పీఎస్ తదితర పార్టీల నేతలంతా హాజరయ్యారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాల్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏమైనా.. కోట్లాది రూపాయిల విలువైన భూమిని పేదలకు సొంతింటి కోసం దానం చేయటం చూస్తే.. రీల్ లో చూసే దానికి మించిన రియల్ శ్రీమంతులు ఈ దంపతులు అని చెప్పక తప్పదు.

This post was last modified on January 6, 2022 7:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

2 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

2 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

3 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

3 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

4 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

4 hours ago