Trends

కర్నూల్లో నిజమైన శ్రీమంతుడు

పది రూపాయిలకు పేచీ పడి ప్రాణాలు తీస్తున్న పాడు రోజులవి. ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని పిల్లలు.. భార్యను భర్త.. భర్తను భార్య.. అన్నను తమ్ముడు.. తమ్ముడ్ని అన్న.. ఇలా చెప్పుకుంటూ డబ్బుల కోసం జరుగుతున్న దారుణాలు అన్నిఇన్ని కావు. అలాంటిది.. అందుకు భిన్నంగా రూ.6 కోట్లు విలువ చేసే 12 ఎకరాల భూమిని పేదల కోసం దానం చేయటం మామూలు విషయం కాదు.

అలాంటి సినిమాటిక్ సీన్ తాజాగా కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఇంత చేశాడంటే.. కచ్ఛితంగా ఏదో రాజకీయ ఎజెండా ఉందని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరిగింది. కర్నూలు జిల్లాలోని తుగ్గలికి చెందిన రాష్ట్ర శాలివాహన సంఘం అధ్యక్షుడు నాగేంద్ర.. ఆయన సతీమణి వరలక్ష్మి దంపతులు పేదల సొంతింటి కలను తీర్చాలని భావించారు.

అందుకోసం తమ వంతుగా ఏమైనా చేద్దామనుకున్నారు.
ఇందులో భాగంగా 12 ఎకరాల భూమిని 670 మందికి ఇళ్ల స్థలాలుగా మార్చి పంపిణీ చేశారు. ఇందుకోసం తాజాగా ఒక కార్యక్రమాన్ని చేపట్టటంతో ఈ విశేషాన్ని చూసేందుకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. ఎలాంటి ఖర్చులు లేకుండా రిజిస్ట్రేషన్ చేయిస్తూ అందరి మనసుల్ని దోచుకున్నారు.

ఈ కార్యక్రమానికి వైసీపీ.. టీడీపీ.. బీజేపీ.. సీపీఐ.. ఎమ్మార్పీఎస్ తదితర పార్టీల నేతలంతా హాజరయ్యారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాల్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏమైనా.. కోట్లాది రూపాయిల విలువైన భూమిని పేదలకు సొంతింటి కోసం దానం చేయటం చూస్తే.. రీల్ లో చూసే దానికి మించిన రియల్ శ్రీమంతులు ఈ దంపతులు అని చెప్పక తప్పదు.

This post was last modified on January 6, 2022 7:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ సంస్థకు చుక్కలు చూపిస్తున్న 2026

కేవీఎన్ ప్రొడక్షన్స్.. కర్ణాటకకు చెందిన నిర్మాణ సంస్థ. దీని అధినేత పేరు నారాయణ. ఐదేళ్ల ముందు ‘సాకత్’ అనే మిడ్…

3 minutes ago

ప్రొడ్యూసర్ల కోసం పవన్ త్యాగం

రెమ్యునేషన్లు పూర్తిగా చేతికి అందకుంటే డబ్బింగ్ చెప్పకుండా ఇబ్బంది పెట్టే స్టార్ హీరోలు ఇండస్ట్రీలో లేకపోలేదు. అందుకే బిజినెస్ జరిగినా…

21 minutes ago

క్షమాపణలు చెప్పిన నాయుడు గారి అబ్బాయి

తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్‌కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…

3 hours ago

తెలుగు అభిమానులకు దురంధర్ స్ట్రోక్

భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…

4 hours ago

ట్రెండింగ్ మొదలుపెట్టిన భగత్ సింగ్

ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…

6 hours ago

దురంధర్ 2 ప్రీమియర్లు…..వాటి మీదే అందరి కళ్ళు

మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…

7 hours ago