Trends

కర్నూల్లో నిజమైన శ్రీమంతుడు

పది రూపాయిలకు పేచీ పడి ప్రాణాలు తీస్తున్న పాడు రోజులవి. ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని పిల్లలు.. భార్యను భర్త.. భర్తను భార్య.. అన్నను తమ్ముడు.. తమ్ముడ్ని అన్న.. ఇలా చెప్పుకుంటూ డబ్బుల కోసం జరుగుతున్న దారుణాలు అన్నిఇన్ని కావు. అలాంటిది.. అందుకు భిన్నంగా రూ.6 కోట్లు విలువ చేసే 12 ఎకరాల భూమిని పేదల కోసం దానం చేయటం మామూలు విషయం కాదు.

అలాంటి సినిమాటిక్ సీన్ తాజాగా కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఇంత చేశాడంటే.. కచ్ఛితంగా ఏదో రాజకీయ ఎజెండా ఉందని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరిగింది. కర్నూలు జిల్లాలోని తుగ్గలికి చెందిన రాష్ట్ర శాలివాహన సంఘం అధ్యక్షుడు నాగేంద్ర.. ఆయన సతీమణి వరలక్ష్మి దంపతులు పేదల సొంతింటి కలను తీర్చాలని భావించారు.

అందుకోసం తమ వంతుగా ఏమైనా చేద్దామనుకున్నారు.
ఇందులో భాగంగా 12 ఎకరాల భూమిని 670 మందికి ఇళ్ల స్థలాలుగా మార్చి పంపిణీ చేశారు. ఇందుకోసం తాజాగా ఒక కార్యక్రమాన్ని చేపట్టటంతో ఈ విశేషాన్ని చూసేందుకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. ఎలాంటి ఖర్చులు లేకుండా రిజిస్ట్రేషన్ చేయిస్తూ అందరి మనసుల్ని దోచుకున్నారు.

ఈ కార్యక్రమానికి వైసీపీ.. టీడీపీ.. బీజేపీ.. సీపీఐ.. ఎమ్మార్పీఎస్ తదితర పార్టీల నేతలంతా హాజరయ్యారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాల్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏమైనా.. కోట్లాది రూపాయిల విలువైన భూమిని పేదలకు సొంతింటి కోసం దానం చేయటం చూస్తే.. రీల్ లో చూసే దానికి మించిన రియల్ శ్రీమంతులు ఈ దంపతులు అని చెప్పక తప్పదు.

This post was last modified on January 6, 2022 7:18 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ !

లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…

6 mins ago

ముద్రగ‌డ ఫ్యామిలీలో క‌ల్లోలం.. ప‌వ‌న్‌కు జైకొట్టిన కుమార్తె

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఊహించ‌డం క‌ష్టం. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్తితే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న…

44 mins ago

అందమైన దెయ్యాలను పట్టించుకోవడం లేదే

ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…

2 hours ago

`పెద్దిరెడ్డి` నియోజ‌క‌వ‌ర్గం ఇంత డేంజ‌రా?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు అంటే..అసెంబ్లీ+పార్ల‌మెంటు ఎన్నిక‌లు ఈ నెల 13న జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన్ని…

2 hours ago

హీరామండి రిపోర్ట్ ఏంటి

మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…

4 hours ago

జ్యోతికృష్ణ గెలవాల్సిన సవాల్ పెద్దదే

ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…

4 hours ago