Movie News

పాలిటిక్స్ ను మించిన టాలీవుడ్‌..?

తెలుగు సినీ ప్ర‌పంచం.. టాలీవుడ్‌.. ఫ‌క్తు పాలిటిక్స్‌ను మించిపోయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మిన్ను విరిగి వెన్నుపై ప‌డుతున్నా.. అగ్ర హీరోల మ‌ధ్య ఐక్య‌త భూత‌ద్దం ప‌ట్టుకుని వెతికినా క‌నిపించ‌ని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఏపీ ప్ర‌భుత్వం సినిమా టికెట్ల విషయంలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై.. చిన్న‌స్థాయి హీరోలే క‌ల‌వ‌ర‌ప‌డుతుంటే.. అగ్ర‌హీరోలు మాత్రం దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో అస‌లు టాలీవుడ్‌కు ఏమైంద‌నే వాద‌న వినిపిస్తోంది. నాకెందుకొచ్చింద‌న్న‌ట్టుగా ఉంటూ.. గ‌తంలో ఎప్పుడూ.. టాలీవుడ్‌ను ప‌ట్టించుకోని వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు.. రామ్‌గోపాల్ వ‌ర్మ సైతం.. ఏపీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు.

సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను ఎలా త‌గ్గిస్తార‌ని.. ఆయ‌న ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న దూకుడుగానే వ్యాఖ్యలు సంధించారు. మంత్రి పేర్ని నాని వ‌ర్సెస్‌ రామ్‌గోపాల్ వర్మ మధ్య మాట‌ల తూటాలు పేలాయి. ఇక‌, చిన్న‌సినిమాల ద‌ర్శ‌కుడు ఆర్‌. నారాయ‌ణ మూర్తి కూడా జోక్యం చేసుకుని నేరుగా మంత్రి నాని ఇంటికి వెళ్లి బ్ర‌తిమాలినంత ప‌నిచేశారు. ఇక‌, హీరో నాని, సిద్ధార్థ‌లు చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపిన విష‌యం తెలిసిందే. మ‌రి ఇంత జ‌రుగుతున్నా.. టాలీవుడ్ పెద్ద‌లు ఎవ‌రూ నోరు మెద‌ప లేదు. మాట్లాడ‌తాం.. చ‌ర్చిస్తాం.. అంటూ.. కాలం గ‌డుపుతున్నార‌నే వాద‌న బలంగా వినిపిస్తోంది.

ఇంత‌లోనే సినిమా టిక్కెట్ల రేట్లపై నాగార్జున చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి.  టిక్కెట్ రేట్లు తగ్గించినా తన సినిమాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదంటూ నాగ్ చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీలోని కొందరు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. నాగార్జున వ్యాఖ్యలపై స్టార్ హీరోలు, పెద్ద నిర్మాతల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని స‌మాచారం. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వంపై పోరు చేస్తున్న వారు కూడా నాగార్జున వ్యాఖ్య‌ల‌తో డిఫెన్స్‌లో ప‌డిపోయారు.

నాగార్జున ఏకపక్షంగా మాట్లాడారని టాలీవుడ్‌లో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే కొన్నాళ్లుగా.. టాలీవుడ్-ఏపీ ప్రభుత్వానికి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. థియేటర్ యాజమాన్యా లు.. ప్రొడ్యూసర్లు, సినీ ప్రముఖులు ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆరోపణలు చేయగా.. పొలిటికల్ లీడర్స్ రివర్స్ కామెంట్స్ చేయడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ క్ర‌మంలో రామ్ గోపాల్ వ‌ర్మ జోక్యంతో ఎంతో కొంత ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌ని భావిస్తున్న స‌మ‌యంలో నాగ్ వ్యాఖ్య‌లతో ఇండ‌స్ట్రీ ఇర‌కాటంలో ప‌డిపోయింది. ఇదిలావుంటే, చిరంజీవి స‌హా జూనియ‌ర్ ఎన్టీఆర్, మ‌హేష్ బాబు, బ‌న్నీ వంటివారు కూడా ఈ విష‌యాన్ని వ‌దిలేయ‌డంతో టాలీవుడ్‌లో ఐక్య‌త లేద‌ని.. ఇక‌, ఏపీ ప్ర‌భుత్వం మ‌రింత రెచ్చిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

2 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

3 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

4 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

6 hours ago

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

12 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

13 hours ago