Trends

రోజులో అన్ని కేసులా?

మూడు.. నాలుగు రోజులు క్రితం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టక్ గా వ్యవహరిస్తున్న గడల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణలో మూడో వేవ్ మొదలైందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అయినప్పటికీ.. ఎవరికి వారు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరిస్తున్న వైఖరి.. ఇప్పుడు షాకిచ్చే పరిస్థితిని తీసుకొచ్చింది. గడిచిన కొంతకాలంగా హైదరాబాద్ లో నమోదవుతున్న కరోనా కేసులు అంతకంతకూ తగ్గిపోవటం తెలిసిందే. అందుకు భిన్నంగా కొత్త సంవత్సరంలో కేసుల నమోదు అంతకంతకూ ఎక్కువ అవుతూ ఉంది.

తాజాగా రికార్డు స్థాయిలో కేసుల సంఖ్య పెరిగాయి. గత ఏడాది జూన్ తర్వాత తెలంగాణలో మొదటిసారి కొవిడ్ కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటేసింది. కేవలం రోజు వ్యవధిలో తెలంగాణ వ్యాప్తంగా 42,991 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిచంగా.. 1052 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసుల్లో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దగ్గర దగ్గర 600 ప్లస్ కేసుల వరకు నమోదైనట్లు పేర్కొన్నారు. సోమవారం నమోదైన కేసులు 294గా ఉంటే.. రోజు గడిచిన తర్వాత దగ్గర దగ్గర 250శాతం పెరుగుదలతో కేసులు నమోదు కావటం ఆందోళనకు గురి చేస్తోంది.

ఇదే రీతిలో కేసుల పెరుగుదల ఉంటే.. రానున్న రోజుల్లో పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయన్న మాట వినిపిస్తోంది. డిచిన 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 4858 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా తెలంగాణలో పెరుగుతోంది.

గత 24 గంటలవ్యవధిలో 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 144కు చేరుకున్నాయి. అంతేకాదు ఎట్ రిస్క్.. నాన్ రిస్క్ దేశాల నుంచి 127 మంది శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారని. వారందరికి కొవిడ్ టెస్టులు చేస్తే 8 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో.. వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. కొవిడ్ పెరుగుదల రేటు భారీగా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బీకేర్ ఫుల్.

This post was last modified on January 5, 2022 9:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago