Trends

బిపిన్ రావత్ మరణానికి కారణమిదే!

ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఆ మాటకు వస్తే.. ఆయన అసమాన్యమైన త్రి దళాలకు అధిపతి. అలాంటి ప్రముఖుడు ప్రయాణించే హెలికాఫ్టర్.. ఆయన జర్నీ సమయంలో వాతావరణం ఎలా ఉందన్న విషయాన్ని ఎంత పక్కాగా తనిఖీ చేయాలి. ప్రమాదానికి ఏ చిన్న అవకాశం ఉన్నప్పటికీ ఆయన్ను ప్రయాణానికి అనుమతించకూడదు. కానీ..ఆయన ప్రయాణిస్తున్న సైనిక హెలికాఫ్టర్ ప్రమాదానికి చోటు చేసుకోవటం.. ఆయనతో సహా 13 ముంది దుర్మరణం పాలైన ఉదంతం భారీ షాకిచ్చింది.

ఇంతకీ.. ఈ భారీ ప్రమాదానికి కారణం ఏమిటి? సాంకేతిక కారణమా? ప్రతికూల వాతావరణమా? మరింకేదైనా కారణం ఉందా? అన్న అంశంపై ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఆధ్వర్యంలో ‘కోర్టు ఆఫ్ ఎంక్వయిరీ’ని నిర్వహించారు. దీనికి సంబంధించిన నివేదిక తాజాగా సిద్ధమైంది. దీన్ని త్వరలోనే ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరికి సమర్పించనున్నారు.
ప్రస్తుతం సిద్ధం చేసిన నివేదికను వైమానిక దళానికి చెందిన న్యాయవిభాగం పరిశీలిస్తోంది.

అయితే.. ఈ నివేదికలోని అంశాలపై అటు ప్రభుత్వం కానీ ఇటు వైమానిక దళం కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.కాకుంటే..ఈ నివేదికలోని అంశాలు బయటకు వచ్చాయి. ఈ ఘోర ప్రమాదానికి కారణం.. సాంకేతిక అంశం కానీ మెషనరీ పొరపాట్లు కావని.. కేవలం ప్రతికూల వాతావరణం మాత్రమేనని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.

డిసెంబరు 8న తమిళనాడులోని కూనూర్ కు సమీపంలో రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ17వీ5 హెలికాఫ్టర్ అనుకోని రీతిలో ప్రతికూల వాతావరణంలోకి వెళ్లి చిక్కుకుపోవటం.. బిపిన్ రావత్ తో సహా మొత్తం 13 మంది బలి కావటం తెలిసిందే. మరి.. అంత పెద్దాయన ప్రయాణించే వేళ.. ప్రతికూల వాతావరణాన్ని ఎందుకు సరిగా అంచనా వేయలేదు? దానికి బాధ్యత వహించేవారెవరు. అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరి.. ఈ అంశాలపై నివేదికలోఏం పేర్కొన్నారో బయటకు రావాల్సి ఉంది.

This post was last modified on January 3, 2022 2:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

18 minutes ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

1 hour ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

1 hour ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

2 hours ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

2 hours ago

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

5 hours ago