Trends

పౌరసత్వాన్ని వదులుకుంటున్న సంపన్నులు

దేశం నుండి విదేశాలకు వెళ్ళిపోతున్న సంపన్నుల సంఖ్య పెరిగిపోతోంది. సంపన్న కుటుంబాల్లో యజమానులు మాత్రమే విదేశాలకు వెళ్ళటంకాదు. తమ  కుటుంబాలతో సహా వలసలు వెళ్ళిపోతున్నారు. విదేశాలకు వలసలు వెళ్ళిపోతున్న సంపన్నులు ఆశ్చర్యంగా భారత పౌరసత్వాన్ని కూడా వదిలేసుకుంటున్నారు. ద్వంద్వ పౌరసత్వాలను అనుమతించని దేశాల్లో ఉంటున్న సంపన్నులు మన దేశ పౌరసత్వాన్ని సైతం వదులుకోవటానికి ఏ మాత్రం వెనకాడటం లేదు.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గడచిన ఐదేళ్ళల్లో 6 లక్షల మంది సంపన్నులు వలసలు వెళ్ళిపోయారు. ఇలా పౌరసత్వాలు వదులుకున్న వారిలో 40 శాతం మంది అమెరికాలో స్ధిరపడ్డారట. ఆ తర్వాత ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో పౌరసత్వం తీసుకున్నారు.  ఇలాంటి సంపన్నులంతా విదేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. పెట్టుబడులు పెట్టడం ద్వారా వీళ్ళల్లో చాలామంది పౌరసత్వాన్ని కొనేసుకుంటున్నారు.

కరేబియన్ దీవులు, బహామా ఐల్యాండ్స్, బ్రిటీష్ వర్జీనియా లాంటి అనేక దేశాలు పెట్టుబడుల కోసం ఇలాంటి సంపన్నులను ఆహ్వానిస్తున్నాయి. అనేకరకాలుగా వీళ్ళ పెట్టుబడులకు పన్నులు మినహాయింపులు ఇవ్వటం, హై ప్రొఫైల్ సిటిజన్స్ గా ట్రీట్ చేస్తున్న కారణంగా మనదేశంలోని సంపన్నులు పై దేశాలు అత్యంత విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. బ్యాంకుల నుండి అప్పుల రైపంలో వేలాది కోట్ల రూపాయాల ప్రజాధనాన్ని దోచేసుకుంటున్న కొందరు ఆర్ధిక నేరగాళ్ళు కూడా పైన చెప్పిన దేశాల్లో హ్యాపీగా స్ధిరపడిపోతున్నారు.

విదేశాల్లో స్ధిరపడిన మన సంపన్నులు మన పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. కాబట్టి మన పాస్ పోర్టు కూడా రద్దయిపోతుంది. 2017 నుండి ఇలాంటి వారి సంఖ్య పెరిగిపోతోంది. 2019లో అత్యధికంగా 1.5 లక్షల మంది తమకు భారత్ పౌరసత్వం వద్దని దరఖాస్తులు చేసుకున్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా 2020లో ఈ సంఖ్య 85 వేలకు తగ్గింది. అయితే ఈ సంవత్సరం మళ్ళీ ఈ సంఖ్య దాటిపోయింది. కారణాలు ఏవైనాకానీండి మనదేశంలో సంపన్నులు ఇక్కడ ఉండాలని మాత్రం అనుకోవటంలేదన్నది వాస్తవం. 

This post was last modified on December 31, 2021 10:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

4 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

6 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

13 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

14 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

14 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

16 hours ago