Trends

పౌరసత్వాన్ని వదులుకుంటున్న సంపన్నులు

దేశం నుండి విదేశాలకు వెళ్ళిపోతున్న సంపన్నుల సంఖ్య పెరిగిపోతోంది. సంపన్న కుటుంబాల్లో యజమానులు మాత్రమే విదేశాలకు వెళ్ళటంకాదు. తమ  కుటుంబాలతో సహా వలసలు వెళ్ళిపోతున్నారు. విదేశాలకు వలసలు వెళ్ళిపోతున్న సంపన్నులు ఆశ్చర్యంగా భారత పౌరసత్వాన్ని కూడా వదిలేసుకుంటున్నారు. ద్వంద్వ పౌరసత్వాలను అనుమతించని దేశాల్లో ఉంటున్న సంపన్నులు మన దేశ పౌరసత్వాన్ని సైతం వదులుకోవటానికి ఏ మాత్రం వెనకాడటం లేదు.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గడచిన ఐదేళ్ళల్లో 6 లక్షల మంది సంపన్నులు వలసలు వెళ్ళిపోయారు. ఇలా పౌరసత్వాలు వదులుకున్న వారిలో 40 శాతం మంది అమెరికాలో స్ధిరపడ్డారట. ఆ తర్వాత ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో పౌరసత్వం తీసుకున్నారు.  ఇలాంటి సంపన్నులంతా విదేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. పెట్టుబడులు పెట్టడం ద్వారా వీళ్ళల్లో చాలామంది పౌరసత్వాన్ని కొనేసుకుంటున్నారు.

కరేబియన్ దీవులు, బహామా ఐల్యాండ్స్, బ్రిటీష్ వర్జీనియా లాంటి అనేక దేశాలు పెట్టుబడుల కోసం ఇలాంటి సంపన్నులను ఆహ్వానిస్తున్నాయి. అనేకరకాలుగా వీళ్ళ పెట్టుబడులకు పన్నులు మినహాయింపులు ఇవ్వటం, హై ప్రొఫైల్ సిటిజన్స్ గా ట్రీట్ చేస్తున్న కారణంగా మనదేశంలోని సంపన్నులు పై దేశాలు అత్యంత విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. బ్యాంకుల నుండి అప్పుల రైపంలో వేలాది కోట్ల రూపాయాల ప్రజాధనాన్ని దోచేసుకుంటున్న కొందరు ఆర్ధిక నేరగాళ్ళు కూడా పైన చెప్పిన దేశాల్లో హ్యాపీగా స్ధిరపడిపోతున్నారు.

విదేశాల్లో స్ధిరపడిన మన సంపన్నులు మన పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. కాబట్టి మన పాస్ పోర్టు కూడా రద్దయిపోతుంది. 2017 నుండి ఇలాంటి వారి సంఖ్య పెరిగిపోతోంది. 2019లో అత్యధికంగా 1.5 లక్షల మంది తమకు భారత్ పౌరసత్వం వద్దని దరఖాస్తులు చేసుకున్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా 2020లో ఈ సంఖ్య 85 వేలకు తగ్గింది. అయితే ఈ సంవత్సరం మళ్ళీ ఈ సంఖ్య దాటిపోయింది. కారణాలు ఏవైనాకానీండి మనదేశంలో సంపన్నులు ఇక్కడ ఉండాలని మాత్రం అనుకోవటంలేదన్నది వాస్తవం. 

This post was last modified on December 31, 2021 10:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రౌడీ ఇన్‌స్పెక్టర్ స్థాయిలో రంజింపజేయాలి

బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్‌స్పెక్టర్. 1992లో…

60 minutes ago

సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజుల ఊపిరి

తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…

2 hours ago

వారణాసి ఇప్పుడెందుకు గుర్తుకు వస్తోంది

రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…

2 hours ago

శుభసూచకం… ప్రిమియర్లు ఫుల్

వేసవి సీజన్లో కొంచెం ముందుగానే రేసులోకి దిగింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. కానీ ఈ చిత్రం టాలీవుడ్‌కు శుభారంభాన్ని అందించలేకపోయింది.…

3 hours ago

జగన్ మావిగన్… ఇప్పుడు సినిమా అయిపోయింది

మావిగన్.. నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న పదం. ఇప్పటిదాకా ఎన్నడూ వినని ఈ పదం…

3 hours ago

తండ్రి బాటలోనే పేర్ని కిట్టు

అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…

4 hours ago