అత్యుత్తమ స్థానాలకు చేరుకోవటం ఎంత కష్టమో దాన్ని నిలుపుకోవటం అంతే కష్టం. ఎంతో శ్రమించి చేరుకున్న స్థానాన్ని చేజేతురాలా చెడగొట్టుకునే ఉదంతానికి నిదర్శనంగా నిలుస్తారు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న టిమ్ పైన్. ‘సెక్ట్సింగ్’ స్కాండల్ ఆరోపణలు అతడు తన కెప్టెన్సీని వదులుకున్నారు. సంచలన ఆరోపణలు వెలుగు చూసిన అనంతరం.. తానుకెప్టెన్ గా కొనసాగలేనని పేర్కొంటూ కీలక పదవిని వదిలేశారు.
2018లో ఆస్ట్రేలియా జట్టుకు టెస్టు కెప్టెన్ గా ఎంపికైన నాటి నుంచి ఇప్పటివరకు 46 టెస్టు మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరించారు. తన సహోద్యోగి అయిన ఒక మహిళకు అసభ్యకర మెసేజ్ లు పంపి.. అడ్డంగా బుక్ అయ్యారు. 36 ఏళ్ల వయసున్న టిమ్.. తాజాగా తాను తీసుకున్న నిర్ణయాన్ని విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ వెల్లడించారు.
చాలా కఠిన నిర్ణయమే అయినా.. తన కుటుంబానికి.. జట్టుకు మాత్రం సరైన నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు. ఆరోపణలపై తన భార్య.. కుటుంబ సభ్యులతో మాట్లాడానని.. వారి క్షమాపణ.. మద్దతుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జట్టు కెప్టెన్ గా బాధ్యతల నుంచి తప్పుకున్నా.. జట్టు సభ్యుడిగా మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించటం తనకు లక్ గా చెప్పుకున్న పైన్.. ఒక అమ్మాయి పంపిన బూతు మెసేజ్ ల కారణంగా కీలక పదవిని పోగొట్టుకున్నాడు.
ఇకపై తాను పూర్తిగా ఆట మీదనే ఫోకస్ చేస్తానని.. తాజా ఘటన తన ఆట ప్రతిష్టకు భంగం కలిగించినందుకు తనను క్షమించాలని కోరాడు. తాను కెప్టెన్ బాద్యత నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పాడుమ ఇంగ్లండ్ జట్టుతో కీలకమైన యాషెస్ సీరిస్ కు ముందు జట్టు కెప్టెన్ గా పైన్ వైదొలగటం ఇబ్బందికర పరిస్థితిగా చెబుతున్నారు.
This post was last modified on November 20, 2021 11:45 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…