Trends

మాస్కుల నుంచి విముక్తి ఎప్పుడో చెప్పిన కృష్ణ ఎల్లా

కరోనాకు ముందు.. తర్వాత అన్నట్లుగా.. ఈ మాయదారి మహమ్మారికి ముందు భారత్ బయోటెక్ అన్న మాట చెబితే.. అదేం కంపెనీ అనే పరిస్థితి. ఇప్పుడు అదే భారత్ బయోటెక్ భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితమైన కంపెనీగా నిలిచింది. కరోనాకు టీకాను కనిపెట్టే విషయంలో తోపుల్లాంటి కంపెనీలు రంగంలోకి దిగితే.. దానిపై విజయం సాధించేలా వ్యాక్సిన్ ను సిద్ధం చేసిన అతి కొద్ది కంపెనీల్లో భారత్ బయోటెక్ ఒకటి.

ఈ సంస్థ తాజాగా సరికొత్త ప్రయోగం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ సూది మందు రూపంలో ఉంటుందన్నది తెలిసిందే. అందుకు భిన్నంగా దీన్ని చుక్కల మందు రూపంలో తయారు చేసే ప్రయోగం దాదాపుగా తుదిదశకు వచ్చేసినట్లే. ఈ చుక్కల మందు అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో చాలానే మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. అంతేకాదు.. ముక్కులో వేసుకునే ఈ చుక్కల మందు తర్వాత ముఖానికి మాస్కు పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. దాని నుంచి విముక్తి పొందొచ్చన్న కీలకమైన వ్యాఖ్య భారత్
బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా నోటి నుంచి వచ్చింది.
అదెలా అన్నది ఆయన మాటల్లోనే వింటే బాగుంటుంది.ఆయనేమన్నారంటే.. ‘నోసల్ వ్యాక్సిన్ ఇస్తే వైరస్ వ్యాప్తిని నిరోధించే వీలుంది. అప్పుడు మాస్కులు వాడాల్సిన అవసరం ఉండదు. సూది మందు రూపంలో టీకా ఇస్తే.. అది ఊపిరితిత్తుల పైభాగానికి రక్షణ ఇవ్వదు కనుక మాస్క్ ధరించాలి. కానీ.. నోసల్ వ్యాక్సిన్ ఆ భాగానికి రక్షణ కల్పిస్తుంది’’ అంటూ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

అదే సమయంలో.. కరోనా సోకని వారు ఇప్పటివరకు ఆనందపడుతూ ఉండొచ్చు. కానీ.. తాజాగా కృష్ణ ఎల్లా మాటల్ని విన్నప్పుడు మాత్రం షాక్ తగలటం ఖాయం. ఎందుకంటే.. కొవాగ్జిన్ నోసల్ డ్రాప్స్.. కరోనాసోకని వారికి పెద్దగా పని చేయదని చెబుతున్నారు. తాము చేసిన పరిశోధనలో ఈ విషయాన్నిగుర్తించినట్లు చెప్పారు. ‘‘నోసల్ వ్యాక్సిన్ ను కరోనా సోకని వ్యక్తికి ఇస్తే అది సరిగా పని చేయదు. కానీ.. ఇన్ ఫెక్షన్ కు గురైన వ్యక్తి కానీ.. తొలి డోసు తీసుకున్న వ్యక్తికి కానీ దీన్ని ఇస్తే మాత్రం బాగా పని చేస్తున్నట్లు గుర్తించాం. ఈ ఇమ్యునాలజీని ప్రపంచంలో తొలిసారి కనుగొన్న సంస్థ మాదే’’ అని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారు.. సోకనివారు..మొదటి డోసు కింద కొవాగ్జిన్ సూది మందును.. రెండో డోసు కింద నోసల్ వ్యాక్సిన్ ను వేసుకుంటే సరిపోతుందన్న ఆలోచనలో తాము ఉన్నట్లు చెప్పారు. రెండో డోసు కింద నోసల్ వ్యాక్సిన్ ఇస్తే వైరస్ వ్యాప్తిని నిరోధించే వీలుందన్న మాట ఆయన నోటి నుంచి రావటం గమనార్హం.

ఇదిలా ఉంటే నోసల్ వ్యాక్సిన్ అందుబాటులోకివచ్చిన తర్వాత కరోనాకు గురైన వారు రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకోవాల్సిన అవసరం లేదని..ఒక్క నోసల్ వ్యాక్సిన్ డోసు తీసుకుంటే సరిపోతుందన్న వాదనను వినిపించటం గమనార్హం. కరోనాను నిరోధించాలంటేూ నాసికా టీకా తప్ప మరో మార్గం లేదని.. దీని రెండో దశ పరీక్షల్ని పూర్తి చేశామని.. ఫలితాల విశ్లేషణ జరుగుతోందని.. మూడు నెలల్లో ఆ వ్యాక్సిన్ వచ్చే వీలుందన్న మాటను కృష్ణ ఎల్లా చెప్పారు. అంటే.. వచ్చే ఫిబ్రవరి.. మార్చి నాటికి అందుబాటులోకి వచ్చే వీలుందన్న మాట. మరేం జరుగుతుందో చూడాలి.

This post was last modified on November 11, 2021 11:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్టార్లు లేని లోటు… సత్య తీరుస్తాడా?

ఒకప్పుడు వేసవి సీజన్ అంటే పెద్ద హీరోల సినిమాలతో కళకళలాడిపోయేది. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. ముందు పెద్ద…

1 hour ago

హిట్టిస్తే గుడి కట్టేస్తారు

బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది సల్మాన్ ఖానే. ఆయన నిఖార్సయిన బ్లాక్‌బస్టర్ కొట్టి దశాబ్దం…

2 hours ago

వెంకటేష్ బాకీ తమన్ తీర్చాల్సిందే

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…

4 hours ago

ప్రభాస్ వల్ల థియేటర్లకు కళొచ్చింది

మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…

7 hours ago

“తెలంగాణ వద్దురా… ఉమ్మడి ఆంధ్ర ముద్దురా”

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…

7 hours ago

80% రాజ‌కీయ నేత‌లు సెక్స్ వీడియోలు చూస్తారా?,

``రాజ‌కీయ నేత‌లు.. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసేది త‌క్కువ‌.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ‌. కావాలంటే.. నా ఫోన్ స‌హా.. రాష్ట్రంలోని…

7 hours ago