ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఎంతో పేరుందన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా నరేంద్ర చౌదరి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఒక సీజన్ లో గంగా నదిలో స్నానం చేయడానికి ఎలా వెళ్తారో, అయ్యప్ప స్వాములు ఎలా గుర్తొస్తారో.. కార్తీక మాసం అనగానే కోటి దీపోత్సవం కూడా భక్తులకు అంతే గుర్తొస్తుంది.
కాంతి జ్ఞానానికి చిహ్నమనీ, అందుకే కోటి దీపాల కాంతులతో భగవంతుణ్ణి జ్యోతి రూపంలో ఆరాధిస్తే మనతో పాటు మన చుట్టు పక్కల వారికి కూడా ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో కోటి దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు నరేంద్ర చౌదరి.
గతేడాది కోవిడ్ కారణంతో ఎప్పుడూ జరిగే కోటి దీపోత్సవానికి బ్రేక్ పడింది. పరిస్థితులన్నీ చక్కబడ్డాయి కోటి దీపోత్సవానికి ఏమీ ఆటంకం కలగదులే అని భక్తులు అనుకునే టైమ్ కు మళ్లీ సెకండ్ వేవ్ రూపంలో కరోనా విజృంభించడం, కోటి దీపోత్సవం లేకుండానే కార్తీక మాసం అయిపోవడం అన్నీ జరిగాయి.
దీంతో ఈ ఏడాది ఎలా అయినా సరే కోటి దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా, సాక్షాత్తూ భగవంతుడే భువికి దిగివచ్చాడా అనే రీతిలో ఈ కార్యక్రమాన్ని జరపాలని నరేంద్ర చౌదరి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దానికి సంబంధించిన పనులను కూడా మొదలుపెట్టారని, నవంబర్ రెండవ వారంలో కోటి దీపోత్సవం మొదలుకానుందని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అంటే ఇంకో 20 రోజుల్లో కోటి దీపాల వెలుగులు, ఆ దీపాల కంటే ఎక్కువగా ప్రకాశించే ఆడపడుచుల కళ్లతో హైదరాబాద్ కళకళలాడనుంది.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…