ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఎంతో పేరుందన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా నరేంద్ర చౌదరి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఒక సీజన్ లో గంగా నదిలో స్నానం చేయడానికి ఎలా వెళ్తారో, అయ్యప్ప స్వాములు ఎలా గుర్తొస్తారో.. కార్తీక మాసం అనగానే కోటి దీపోత్సవం కూడా భక్తులకు అంతే గుర్తొస్తుంది.
కాంతి జ్ఞానానికి చిహ్నమనీ, అందుకే కోటి దీపాల కాంతులతో భగవంతుణ్ణి జ్యోతి రూపంలో ఆరాధిస్తే మనతో పాటు మన చుట్టు పక్కల వారికి కూడా ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో కోటి దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు నరేంద్ర చౌదరి.
గతేడాది కోవిడ్ కారణంతో ఎప్పుడూ జరిగే కోటి దీపోత్సవానికి బ్రేక్ పడింది. పరిస్థితులన్నీ చక్కబడ్డాయి కోటి దీపోత్సవానికి ఏమీ ఆటంకం కలగదులే అని భక్తులు అనుకునే టైమ్ కు మళ్లీ సెకండ్ వేవ్ రూపంలో కరోనా విజృంభించడం, కోటి దీపోత్సవం లేకుండానే కార్తీక మాసం అయిపోవడం అన్నీ జరిగాయి.
దీంతో ఈ ఏడాది ఎలా అయినా సరే కోటి దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా, సాక్షాత్తూ భగవంతుడే భువికి దిగివచ్చాడా అనే రీతిలో ఈ కార్యక్రమాన్ని జరపాలని నరేంద్ర చౌదరి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దానికి సంబంధించిన పనులను కూడా మొదలుపెట్టారని, నవంబర్ రెండవ వారంలో కోటి దీపోత్సవం మొదలుకానుందని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అంటే ఇంకో 20 రోజుల్లో కోటి దీపాల వెలుగులు, ఆ దీపాల కంటే ఎక్కువగా ప్రకాశించే ఆడపడుచుల కళ్లతో హైదరాబాద్ కళకళలాడనుంది.
This post was last modified on November 11, 2021 7:43 am
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…