ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఎంతో పేరుందన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా నరేంద్ర చౌదరి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఒక సీజన్ లో గంగా నదిలో స్నానం చేయడానికి ఎలా వెళ్తారో, అయ్యప్ప స్వాములు ఎలా గుర్తొస్తారో.. కార్తీక మాసం అనగానే కోటి దీపోత్సవం కూడా భక్తులకు అంతే గుర్తొస్తుంది.
కాంతి జ్ఞానానికి చిహ్నమనీ, అందుకే కోటి దీపాల కాంతులతో భగవంతుణ్ణి జ్యోతి రూపంలో ఆరాధిస్తే మనతో పాటు మన చుట్టు పక్కల వారికి కూడా ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో కోటి దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు నరేంద్ర చౌదరి.
గతేడాది కోవిడ్ కారణంతో ఎప్పుడూ జరిగే కోటి దీపోత్సవానికి బ్రేక్ పడింది. పరిస్థితులన్నీ చక్కబడ్డాయి కోటి దీపోత్సవానికి ఏమీ ఆటంకం కలగదులే అని భక్తులు అనుకునే టైమ్ కు మళ్లీ సెకండ్ వేవ్ రూపంలో కరోనా విజృంభించడం, కోటి దీపోత్సవం లేకుండానే కార్తీక మాసం అయిపోవడం అన్నీ జరిగాయి.
దీంతో ఈ ఏడాది ఎలా అయినా సరే కోటి దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా, సాక్షాత్తూ భగవంతుడే భువికి దిగివచ్చాడా అనే రీతిలో ఈ కార్యక్రమాన్ని జరపాలని నరేంద్ర చౌదరి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దానికి సంబంధించిన పనులను కూడా మొదలుపెట్టారని, నవంబర్ రెండవ వారంలో కోటి దీపోత్సవం మొదలుకానుందని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అంటే ఇంకో 20 రోజుల్లో కోటి దీపాల వెలుగులు, ఆ దీపాల కంటే ఎక్కువగా ప్రకాశించే ఆడపడుచుల కళ్లతో హైదరాబాద్ కళకళలాడనుంది.
This post was last modified on November 11, 2021 7:43 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…