ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఎంతో పేరుందన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా నరేంద్ర చౌదరి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఒక సీజన్ లో గంగా నదిలో స్నానం చేయడానికి ఎలా వెళ్తారో, అయ్యప్ప స్వాములు ఎలా గుర్తొస్తారో.. కార్తీక మాసం అనగానే కోటి దీపోత్సవం కూడా భక్తులకు అంతే గుర్తొస్తుంది.
కాంతి జ్ఞానానికి చిహ్నమనీ, అందుకే కోటి దీపాల కాంతులతో భగవంతుణ్ణి జ్యోతి రూపంలో ఆరాధిస్తే మనతో పాటు మన చుట్టు పక్కల వారికి కూడా ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో కోటి దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు నరేంద్ర చౌదరి.
గతేడాది కోవిడ్ కారణంతో ఎప్పుడూ జరిగే కోటి దీపోత్సవానికి బ్రేక్ పడింది. పరిస్థితులన్నీ చక్కబడ్డాయి కోటి దీపోత్సవానికి ఏమీ ఆటంకం కలగదులే అని భక్తులు అనుకునే టైమ్ కు మళ్లీ సెకండ్ వేవ్ రూపంలో కరోనా విజృంభించడం, కోటి దీపోత్సవం లేకుండానే కార్తీక మాసం అయిపోవడం అన్నీ జరిగాయి.
దీంతో ఈ ఏడాది ఎలా అయినా సరే కోటి దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా, సాక్షాత్తూ భగవంతుడే భువికి దిగివచ్చాడా అనే రీతిలో ఈ కార్యక్రమాన్ని జరపాలని నరేంద్ర చౌదరి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దానికి సంబంధించిన పనులను కూడా మొదలుపెట్టారని, నవంబర్ రెండవ వారంలో కోటి దీపోత్సవం మొదలుకానుందని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అంటే ఇంకో 20 రోజుల్లో కోటి దీపాల వెలుగులు, ఆ దీపాల కంటే ఎక్కువగా ప్రకాశించే ఆడపడుచుల కళ్లతో హైదరాబాద్ కళకళలాడనుంది.
This post was last modified on November 11, 2021 7:43 am
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…
ఇంగ్లండ్పై టీ20, వన్డే సిరీస్లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్…
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…
గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి.…