Trends

చైనాలో పెరుగుతున్న ఆహార కొరత !

డ్రాగన్ దేశంలో ఆహార కొరత పెరిగిపోతోంది. ఆర్థిక శక్తిలో అగ్రరాజ్యం అమెరికాను సవాలు చేస్తున్న చైనాలో ఆహార సంక్షోభం పెరిగిపోవటం ఆందోళనకు గురిచేస్తోంది. ‘సరుకులు కొనుగోలు చేసి నిల్వ చేసుకోండి, పొట్టుతీయని ధాన్యాలు తినండి, పండ్లు, కూరగాయలను ఆరబెట్టి నిల్వ చేసుకోండి..ఆహారాన్ని వృధా చేయకండి’ అంటు చైనా పాలకులు ప్రజలకు పదే పదే జనాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రపంచంలో ఆహారకొరత ఉందంటేనే చైనాలో పాలకులు జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది చైనా ప్రజలకే పాలకులు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారంటే అర్ధమేంటి ?

అర్ధం ఏమిటంటే ఆల్ రెడీ చైనాలో ఆహారకొరత మొదలైపోయినట్లుగా అర్ధం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మామూలుగా దేశంలో ఏదైనా సమస్య ఉన్నా ఉందని పాలకులు ఒప్పుకోరన్న విషయం యావత్ ప్రపంచానికి బాగా తెలుసు. అలాంటిది ఇపుడు ఆహార సమస్య రాబోతోందని చైనా పాలకులే బహిరంగంగా ప్రకటనలు, హెచ్చరికలు జారీ చేస్తున్నారంటేనే సమస్య ఎంత స్ధాయిలో అర్ధమైపోతోంది.

అయితే రాబోయే శీతాకాలంలో ఆహార కొరత వచ్చే అవకాశం ఉందన్న కారణంగానే తాము ముందుజాగ్రత్తలు చెబుతున్నట్లు పాలకులు సమర్ధించుకుంటున్నారు. చైనాలో ఆహార కొరతకు కారణాలు ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడటం, చైనాలో శీతాకాలం ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం అని పాలకులు సమర్ధించుకుంటున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే డ్రాగన్ దేశంలోని పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఎందుకంటే దేశంలోని డ్యాముల్లో నీటిని పంటల అవసరాలకు తగ్గట్లుగా పాలకులు విడుదల చేయలేదు. దీని ఫలితంగా ఏమైందంటే అకస్మాత్తుగా భారీ వర్షాలు కురవటంతో డ్యాములన్నీ ఒక్కసారిగా ఓవర్ ఫ్లో అయిపోయాయి. డ్యాములు దెబ్బతినకుండా ఉండేందుకు పాలకులు నీటినంతా ఒక్కసారిగా వదిలేశారు. దాంతో వర్షాలకు తోడు డ్యాముల్లోని నీరంతా కిందిప్రాంతాలకు వదిలేయటంతో ఊర్లలోకి, పంటల్లోకి వచ్చేశాయి. దాంతో కోట్లాది ఎకరాల్లోని పంటలన్నీ దెబ్బతినేశాయి. దీంతో దేశంలో ఆహార కొరత వచ్చేసింది.

ఈ విషయాన్ని కప్పిపుచ్చుకుంటున్న పాలకులు ప్రపంచంలో ఆహార కొరత వస్తోందని నమ్మబలుకుతున్నారు. వాస్తవానికి చైనాలో 23,841 డ్యాములున్నాయి. ప్రపంచంలోని డ్యాముల్లో చైనాలోనే 41 శాతమున్నాయి. అంటే నీటి యాజమాన్యంలో చైనా పాలకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈసారి ఏమైందో తెలీదు కానీ నీటి యాజమాన్య పద్దతులు దెబ్బతినేశాయి. అంతకుముందే కరోనా వైరస్ తీవ్రత, భారీ వర్షాల కారణంగా మొత్తం వ్యవస్ధంతా అస్తవ్యస్ధమైపోయింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న పద్దతిలో ఇపుడు కఠినంగా పొదుపు చర్యలు మొదలుపెట్టింది.

This post was last modified on November 8, 2021 10:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు భారం.. కారణమిదే..

హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు ఒక ప్రధాన జీవనాడి లాంటిది. రోజూ వేలాది మంది ప్రజలు ఈ రైల్‌ను వినియోగించుకుంటూ,…

3 minutes ago

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసు: 793 కోట్ల ఆస్తులు అటాచ్

వైసీపీ అధినేత జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో అత్యంత కీల‌క‌మైన ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మ‌నీ లాండ‌రింగ్ ఆరోప‌ణ‌లు…

3 hours ago

డ్రీమ్ ప్రాజెక్టుపై దర్శకుడి క్లారిటీ

‘గ్రహణం’ లాంటి అవార్డ్ విన్నింగ్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన ఇంద్రగంటి మోహనకృష్ణ.. తనకంటూ ఒక అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు.…

3 hours ago

అధికారులు కొడ‌తార‌ని భ‌య‌మా ఎంపీ?

"మీ విచార‌ణ‌ను వీడియోలు.. ఆడియోలు తీయాల‌ని కోరుతున్నారు. అంటే.. అధికారులు మిమ్మ‌ల్ని (పిటిష‌నర్‌) కొడ‌తార‌ని భ‌య‌ప‌డుతున్నారా?" అని వైసీపీ ఎంపీ..…

3 hours ago

జ‌గ‌న్‌కు సౌండ్ లేకుండా చేసిన చంద్ర‌బాబు!

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌కు సీఎం చంద్ర‌బాబు సౌండ్ లేకుండా చేశారు. గుడ్ ఫ్రైడేను పుర‌స్క రించుకుని క్రిస్టియ‌న్లు…

5 hours ago

సీక్వెల్ తీసేంత హిట్టయ్యిందా జాట్ ?

ఇటీవలే విడుదలైన జాట్ సినిమాకు ఇవాళ అధికారికంగా సీక్వెల్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే గదర్ 2 రేంజ్ లో…

6 hours ago