డ్రాగన్ దేశంలో ఆహార కొరత పెరిగిపోతోంది. ఆర్థిక శక్తిలో అగ్రరాజ్యం అమెరికాను సవాలు చేస్తున్న చైనాలో ఆహార సంక్షోభం పెరిగిపోవటం ఆందోళనకు గురిచేస్తోంది. ‘సరుకులు కొనుగోలు చేసి నిల్వ చేసుకోండి, పొట్టుతీయని ధాన్యాలు తినండి, పండ్లు, కూరగాయలను ఆరబెట్టి నిల్వ చేసుకోండి..ఆహారాన్ని వృధా చేయకండి’ అంటు చైనా పాలకులు ప్రజలకు పదే పదే జనాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రపంచంలో ఆహారకొరత ఉందంటేనే చైనాలో పాలకులు జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది చైనా ప్రజలకే పాలకులు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారంటే అర్ధమేంటి ?
అర్ధం ఏమిటంటే ఆల్ రెడీ చైనాలో ఆహారకొరత మొదలైపోయినట్లుగా అర్ధం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మామూలుగా దేశంలో ఏదైనా సమస్య ఉన్నా ఉందని పాలకులు ఒప్పుకోరన్న విషయం యావత్ ప్రపంచానికి బాగా తెలుసు. అలాంటిది ఇపుడు ఆహార సమస్య రాబోతోందని చైనా పాలకులే బహిరంగంగా ప్రకటనలు, హెచ్చరికలు జారీ చేస్తున్నారంటేనే సమస్య ఎంత స్ధాయిలో అర్ధమైపోతోంది.
అయితే రాబోయే శీతాకాలంలో ఆహార కొరత వచ్చే అవకాశం ఉందన్న కారణంగానే తాము ముందుజాగ్రత్తలు చెబుతున్నట్లు పాలకులు సమర్ధించుకుంటున్నారు. చైనాలో ఆహార కొరతకు కారణాలు ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడటం, చైనాలో శీతాకాలం ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం అని పాలకులు సమర్ధించుకుంటున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే డ్రాగన్ దేశంలోని పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఎందుకంటే దేశంలోని డ్యాముల్లో నీటిని పంటల అవసరాలకు తగ్గట్లుగా పాలకులు విడుదల చేయలేదు. దీని ఫలితంగా ఏమైందంటే అకస్మాత్తుగా భారీ వర్షాలు కురవటంతో డ్యాములన్నీ ఒక్కసారిగా ఓవర్ ఫ్లో అయిపోయాయి. డ్యాములు దెబ్బతినకుండా ఉండేందుకు పాలకులు నీటినంతా ఒక్కసారిగా వదిలేశారు. దాంతో వర్షాలకు తోడు డ్యాముల్లోని నీరంతా కిందిప్రాంతాలకు వదిలేయటంతో ఊర్లలోకి, పంటల్లోకి వచ్చేశాయి. దాంతో కోట్లాది ఎకరాల్లోని పంటలన్నీ దెబ్బతినేశాయి. దీంతో దేశంలో ఆహార కొరత వచ్చేసింది.
ఈ విషయాన్ని కప్పిపుచ్చుకుంటున్న పాలకులు ప్రపంచంలో ఆహార కొరత వస్తోందని నమ్మబలుకుతున్నారు. వాస్తవానికి చైనాలో 23,841 డ్యాములున్నాయి. ప్రపంచంలోని డ్యాముల్లో చైనాలోనే 41 శాతమున్నాయి. అంటే నీటి యాజమాన్యంలో చైనా పాలకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈసారి ఏమైందో తెలీదు కానీ నీటి యాజమాన్య పద్దతులు దెబ్బతినేశాయి. అంతకుముందే కరోనా వైరస్ తీవ్రత, భారీ వర్షాల కారణంగా మొత్తం వ్యవస్ధంతా అస్తవ్యస్ధమైపోయింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న పద్దతిలో ఇపుడు కఠినంగా పొదుపు చర్యలు మొదలుపెట్టింది.
This post was last modified on November 8, 2021 10:59 am
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…