Trends

చైనాలో పెరుగుతున్న ఆహార కొరత !

డ్రాగన్ దేశంలో ఆహార కొరత పెరిగిపోతోంది. ఆర్థిక శక్తిలో అగ్రరాజ్యం అమెరికాను సవాలు చేస్తున్న చైనాలో ఆహార సంక్షోభం పెరిగిపోవటం ఆందోళనకు గురిచేస్తోంది. ‘సరుకులు కొనుగోలు చేసి నిల్వ చేసుకోండి, పొట్టుతీయని ధాన్యాలు తినండి, పండ్లు, కూరగాయలను ఆరబెట్టి నిల్వ చేసుకోండి..ఆహారాన్ని వృధా చేయకండి’ అంటు చైనా పాలకులు ప్రజలకు పదే పదే జనాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రపంచంలో ఆహారకొరత ఉందంటేనే చైనాలో పాలకులు జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది చైనా ప్రజలకే పాలకులు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారంటే అర్ధమేంటి ?

అర్ధం ఏమిటంటే ఆల్ రెడీ చైనాలో ఆహారకొరత మొదలైపోయినట్లుగా అర్ధం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మామూలుగా దేశంలో ఏదైనా సమస్య ఉన్నా ఉందని పాలకులు ఒప్పుకోరన్న విషయం యావత్ ప్రపంచానికి బాగా తెలుసు. అలాంటిది ఇపుడు ఆహార సమస్య రాబోతోందని చైనా పాలకులే బహిరంగంగా ప్రకటనలు, హెచ్చరికలు జారీ చేస్తున్నారంటేనే సమస్య ఎంత స్ధాయిలో అర్ధమైపోతోంది.

అయితే రాబోయే శీతాకాలంలో ఆహార కొరత వచ్చే అవకాశం ఉందన్న కారణంగానే తాము ముందుజాగ్రత్తలు చెబుతున్నట్లు పాలకులు సమర్ధించుకుంటున్నారు. చైనాలో ఆహార కొరతకు కారణాలు ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడటం, చైనాలో శీతాకాలం ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం అని పాలకులు సమర్ధించుకుంటున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే డ్రాగన్ దేశంలోని పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఎందుకంటే దేశంలోని డ్యాముల్లో నీటిని పంటల అవసరాలకు తగ్గట్లుగా పాలకులు విడుదల చేయలేదు. దీని ఫలితంగా ఏమైందంటే అకస్మాత్తుగా భారీ వర్షాలు కురవటంతో డ్యాములన్నీ ఒక్కసారిగా ఓవర్ ఫ్లో అయిపోయాయి. డ్యాములు దెబ్బతినకుండా ఉండేందుకు పాలకులు నీటినంతా ఒక్కసారిగా వదిలేశారు. దాంతో వర్షాలకు తోడు డ్యాముల్లోని నీరంతా కిందిప్రాంతాలకు వదిలేయటంతో ఊర్లలోకి, పంటల్లోకి వచ్చేశాయి. దాంతో కోట్లాది ఎకరాల్లోని పంటలన్నీ దెబ్బతినేశాయి. దీంతో దేశంలో ఆహార కొరత వచ్చేసింది.

ఈ విషయాన్ని కప్పిపుచ్చుకుంటున్న పాలకులు ప్రపంచంలో ఆహార కొరత వస్తోందని నమ్మబలుకుతున్నారు. వాస్తవానికి చైనాలో 23,841 డ్యాములున్నాయి. ప్రపంచంలోని డ్యాముల్లో చైనాలోనే 41 శాతమున్నాయి. అంటే నీటి యాజమాన్యంలో చైనా పాలకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈసారి ఏమైందో తెలీదు కానీ నీటి యాజమాన్య పద్దతులు దెబ్బతినేశాయి. అంతకుముందే కరోనా వైరస్ తీవ్రత, భారీ వర్షాల కారణంగా మొత్తం వ్యవస్ధంతా అస్తవ్యస్ధమైపోయింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న పద్దతిలో ఇపుడు కఠినంగా పొదుపు చర్యలు మొదలుపెట్టింది.

This post was last modified on November 8, 2021 10:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మృణాల్ పాటించాల్సిన సలహానే ఇది

సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…

1 hour ago

స్టాండ‌ప్ క‌మెడియన్ సారీ… అంద‌రికీ ఓ పాఠం

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి వెళ్లిపోతే ప‌రిణామాలు ఎలా ఉంటాయో మ‌రోసారి రుజువైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్…

3 hours ago

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

4 hours ago

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

5 hours ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

6 hours ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

7 hours ago