Trends

భక్తులకు వెళ్లేందుకు ఓకే.. ప్రార్థనాలయాల్లో ఇవేమీ ఉండవు

ఓవైపు లాక్ డౌన్ 5.0. మరోవైపు అన్ లాక్ 1.0ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల ఎనిమిది నుంచి దేవాలయాలు.. మసీదులు.. చర్చిలకు భక్తుల్ని అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇందులో భాగంగా పలు నిబంధనల్ని తాజాగా తీసుకొచ్చింది. ఏ మతానికి చెందిన వారైనా సరే.. వారి.. వారి ప్రార్థనాలయాలకు వెళ్లే వారు ఏమేం చేయాలి.. ఏమేం చేయకూడదన్న దానిపై ఒక స్పష్టత ఇచ్చింది.

ఈ నిబంధనల్ని చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. గుడి.. మసీదు.. చర్చి.. ఏదైనా కావొచ్చు. అక్కడికి వెళ్లామన్న ఫీలింగే తప్పించి.. అక్కడ దేన్ని తాకే వీల్లేదు. అంతేనా.. గుళ్లలో ఇచ్చే చటారు.. ఆక్షింతలు.. తీర్థం.. ప్రసాదం.. ఇలాంటివేమీ పంచకూడదు.

కొన్ని ప్రార్థనాలయాల్లో భక్తులమీద చల్లే పవిత్ర జలాల్ని చల్లకూడదు. ఇక.. దేన్ని తాక కూడదు. మూతికి మాస్కులు తప్పనిసరి. అన్నదానాలు.. ప్రత్యేకంగా జరిపే పూజలు.. క్రతువులు.. ఇలాంటివేమీ చేయకూడదు.

వయసుమళ్లిన వారు.. గర్భిణిులను అనుమతించరు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోపలకు అనుమతిస్తారు. సామూహిక గీతాలు.. భజనలు.. ప్రార్థనలకు అనుమతులు ఇవ్వరు. ప్రార్థనాలయాల్లో వెలుతురు.. స్వచ్ఛమైన గాలి వచ్చేలా వెంటిలేషన్ ఏర్పాటుతో పాటు..రికార్డింగ్ ద్వారానే భజనల్ని పెట్టాల్సి ఉంటుంది.

మొత్తంగా చూస్తే.. ప్రార్థనాలయాలకు వెళ్లి వచ్చామన్న ఫీలింగ్ తప్పించి.. మరింకేమీ ఉండవు. దీనికన్నా.. ఇంట్లోనే ఎవరి ప్రార్థనలు వారు చేసుకోవటానికి మించింది ఉండదేమో?

This post was last modified on June 5, 2020 2:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మారిపోయిన దేవర విలన్

బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…

39 minutes ago

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

2 hours ago

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది.…

2 hours ago

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

2 hours ago

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…

2 hours ago

‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…

3 hours ago