ఓవైపు లాక్ డౌన్ 5.0. మరోవైపు అన్ లాక్ 1.0ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల ఎనిమిది నుంచి దేవాలయాలు.. మసీదులు.. చర్చిలకు భక్తుల్ని అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇందులో భాగంగా పలు నిబంధనల్ని తాజాగా తీసుకొచ్చింది. ఏ మతానికి చెందిన వారైనా సరే.. వారి.. వారి ప్రార్థనాలయాలకు వెళ్లే వారు ఏమేం చేయాలి.. ఏమేం చేయకూడదన్న దానిపై ఒక స్పష్టత ఇచ్చింది.
ఈ నిబంధనల్ని చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. గుడి.. మసీదు.. చర్చి.. ఏదైనా కావొచ్చు. అక్కడికి వెళ్లామన్న ఫీలింగే తప్పించి.. అక్కడ దేన్ని తాకే వీల్లేదు. అంతేనా.. గుళ్లలో ఇచ్చే చటారు.. ఆక్షింతలు.. తీర్థం.. ప్రసాదం.. ఇలాంటివేమీ పంచకూడదు.
కొన్ని ప్రార్థనాలయాల్లో భక్తులమీద చల్లే పవిత్ర జలాల్ని చల్లకూడదు. ఇక.. దేన్ని తాక కూడదు. మూతికి మాస్కులు తప్పనిసరి. అన్నదానాలు.. ప్రత్యేకంగా జరిపే పూజలు.. క్రతువులు.. ఇలాంటివేమీ చేయకూడదు.
వయసుమళ్లిన వారు.. గర్భిణిులను అనుమతించరు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోపలకు అనుమతిస్తారు. సామూహిక గీతాలు.. భజనలు.. ప్రార్థనలకు అనుమతులు ఇవ్వరు. ప్రార్థనాలయాల్లో వెలుతురు.. స్వచ్ఛమైన గాలి వచ్చేలా వెంటిలేషన్ ఏర్పాటుతో పాటు..రికార్డింగ్ ద్వారానే భజనల్ని పెట్టాల్సి ఉంటుంది.
మొత్తంగా చూస్తే.. ప్రార్థనాలయాలకు వెళ్లి వచ్చామన్న ఫీలింగ్ తప్పించి.. మరింకేమీ ఉండవు. దీనికన్నా.. ఇంట్లోనే ఎవరి ప్రార్థనలు వారు చేసుకోవటానికి మించింది ఉండదేమో?
This post was last modified on June 5, 2020 2:10 pm
టాలీవుడ్లో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకులతో పాటు నాని, విజయ్…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…
ఏపీ సీఎం చంద్రబాబు గత 2024లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత..…
బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…
వైసీపీ నేతలకు మరో చిక్కు ఎదురు కానుందా? మరో కీలక పరిణామాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందా? అంటే.. ఔననే…