ప్రపంచానికి వణుకు పుట్టించిన కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ తయారీకి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయటం.. ఎట్టకేలకు కొన్ని కంపెనీలు టీకాలు తయారు చేసి.. వ్యాక్సినేషన్ షురూ చేయటం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా.. భారత్ లో మాత్రం మూడు వ్యాక్సిన్లు (కొవాగ్జిన్.. కొవిషీల్డ్.. స్పుత్నిక్) అందుబాటులో ఉన్నాయి. పెద్దలకు మాత్రమే సిద్ధం చేసిన వ్యాక్సిన్ తో పాటు.. పిల్లలకు సరిపడేలా టీకాల తయారీ మీద పలు కంపెనీలు ఫోకస్ చేశాయి.
తాజాగా హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ పిల్లలకు సరిపోయేలా కొవాగ్జిన్ ను సిద్ధం చేసింది దీన్ని అత్యవసర అనుమతులు జారీ చేయాలని నిపుణుల కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది.
ఈ వ్యాక్సిన్ ను 2-18 ఏళ్ల వారికి ఇచ్చేలా సి్ధం చేశారు. ఇప్పటికే ఈ టీకాకు సంబంధించిన క్లినికల్ ప్రయోగాలు పూర్తి అయ్యాయి. దీనికి సంబంధించిన నివేదికను భారత ఔషధ నియంత్రణ సంస్థకు భారత్ బయోటెక్ అందజేసింది. ఈ నివేదికను నిశితంగా పరిశీలించిన నిపుణుల కమిటీ ఓకే చేసింది. దీంతో.. కేంద్రం ఆమోదముద్ర వేయటమే మిగిలి ఉంది.
కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చినంతనే.. దేశీయంగా పిల్లలకు అందుబాటులోకి వచ్చే తొలి కరోనా వ్యాక్సిన్ ఇదే అవుతుంది. కొవాగ్జిన్ జూనియర్ గా పిలిచే ఈ టీకాను కూడా రెండు డోసుల్లో వేయనున్నారు. మొదటి టీకా వేసిన 20 రోజులకు రెండో టీకా ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి గుజరాత్ కు చెందిన జైడస్ క్యాడిలా జైకోవ్ -డి టీకాను తయారు చేసింది. ఈ టీకాను 12 ఏళ్లకు పైబడిన వారికి ఇచ్చేందుకు వీలుగా సిద్ధం చేశారు. అయితే.. ఈ సంస్థ తన టీకాను బయటకు తీసుకురాలేదు. ఇంతలోనే భారత్ బయోటెక్ కేంద్రం అనుమతుల వరకు వచ్చేసింది. ఒకవేళ.. సర్కారు ఓకే చెబితే.. పిల్లల కొవాగ్జిన్ వచ్చేయటం ఖాయం. మరి.. కేంద్రంత తన ఆమోద ముద్ర కోసం ఎంత సమయం తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on October 12, 2021 5:51 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…