నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకాయి. పేదలు, మధ్య తరగతి జనాలే కాదు ఎగువమధ్య తరగతి జనాలతో పాటు ధనవంతులు కూడా ఆచితూచి కొనాల్సిన పరిస్దితులు దాపురించాయి. ఎందుకంటే ఒక గ్యాస్ సిలిండర్ ధర రు. 2657, కిలో పంచదార ధర 800 రూపాయలు, లీటర్ పాల ధర రు. 1195. ఇంతేసి ధరలు ఎక్కడో అనుకుంటున్నారా ? మన పొరుగునే ఉన్న శ్రీలంకలోనే. దేశాధ్యక్షుడు రాజపక్సే తీసుకన్న ఆనాలోచిత నిర్ణయం కారణంగానే నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తులోకి ఎగబాకిపోయాయి.
నిత్యావసరాల ధరలు ఇంతగా పెరిగిపోవటానికి ప్రధాన కారణం ఏమిటంటే వస్తువల ధరలపై నియంత్రణను తీసేయటమే. అసలే ఆర్ధికసంక్షోభంతో నానా అవస్తలు పడుతున్న శ్రీలంకపై కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడింది. ఆహార, ఆర్ధిక సంక్షోభంపైన కరోనా విరుచుకుపడటంతో దేశంలోకి దిగుమతులన్నీ తగ్గిపోయాయి. ఎప్పుడైతే దిగుమతులు తగ్గిపోయాయో నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఎప్పుడైతే శ్రీలంక నుంచి ఎగుమతులు ఆగిపోయాయో, పర్యాటక రంగం మందగించిదో వెంటనే విదేశీ మారక నిల్వలపై తీవ్ర ప్రభావం చూపింది. ఒకవైపు ఎగుమతులు ఆగిపోవటం మరోవైపు దిగుమతులు తగ్గిపోవటంతో బ్యాలెన్స్ తప్పిపోయింది. ఎప్పుడైతే దిగుమతులు కూడా తగ్గిపోయాయో దాని ప్రభావం ముందుగా దేశంలో ఉన్న నిత్యావసరాలపై పడింది. దాంతో నిత్యావసరాలకు ఎక్కడలేని డిమాండ్ పెరిగిపోయింది. నిత్యావసరాలకు డిమాండ్ పెరిగిపోవడంతో వ్యాపారస్తులు సరుకు మార్కెట్లోకి పంపకుండా బ్లాక్ చేసేశారు.
డిమాండ్ అవసరాల మేరకు సరుకులను మార్కెట్లోకి పంపకపోవడం తో ధరలు బాగా పెరిగిపోయాయి. ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ధరలపై నియంత్రణను విధించింది. ప్రభుత్వ ఉద్దేశ్యం ప్రకారం ధరలపై నియంత్రణ విధిస్తే ధరలు తగ్గాలి. కానీ వస్తువులు మార్కెట్లోకి రావటం మానేశాయి. అంటే మొత్తం సరుకును వ్యాపారస్తులు దాచిపెట్టేశారన్నమాట. ఫలితంగా ఆహార కొరత బాగా పెరిగిపోయింది. దీంతో జనాలు ఆహారానికి అల్లాడుతున్నారు. ఆకలి బాధల నుండి జనాలను కాపాడాలన్న ఉద్దేశ్యంతో నిత్యావసరాల పై నియంత్రణ ఎత్తేసింది.
ఎప్పుడైతే ప్రభుత్వం నియంత్రణ ఎత్తేసిందో ఒక్కసారిగా ధరలు పెరిగిపోయి ఆకాశాన్నంటాయి. ప్రభుత్వం ఏదో చేయబోతే ఇంకేదో అయినట్లు అర్ధమవుతోంది. మధ్య తరగతి జనాలు కూడా గోధుమపిండి, పంచధార, నూనెలను కొని వారాలు దాటిపోయాయట. కరోనా మహమ్మారి కారణంగా జనాల దగ్గర డబ్బులూ లేక, ఉన్నా కొనేందుకు నిత్యావసరాలు దొరక్క జనాలు అల్లాడిపోతున్నారు. మరి శ్రీలకంలో పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో చూడాల్సిందే.
This post was last modified on October 12, 2021 10:38 am
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…