Trends

గ్యాస్ సిలిండర్ ధర రూ. 2657..ఎక్కడో తెలుసా ?

నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకాయి. పేదలు, మధ్య తరగతి జనాలే కాదు ఎగువమధ్య తరగతి జనాలతో పాటు ధనవంతులు కూడా ఆచితూచి కొనాల్సిన పరిస్దితులు దాపురించాయి. ఎందుకంటే ఒక గ్యాస్ సిలిండర్ ధర రు. 2657, కిలో పంచదార ధర 800 రూపాయలు, లీటర్ పాల ధర రు. 1195. ఇంతేసి ధరలు ఎక్కడో అనుకుంటున్నారా ? మన పొరుగునే ఉన్న శ్రీలంకలోనే. దేశాధ్యక్షుడు రాజపక్సే తీసుకన్న ఆనాలోచిత నిర్ణయం కారణంగానే నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తులోకి ఎగబాకిపోయాయి.

నిత్యావసరాల ధరలు ఇంతగా పెరిగిపోవటానికి ప్రధాన కారణం ఏమిటంటే వస్తువల ధరలపై నియంత్రణను తీసేయటమే. అసలే ఆర్ధికసంక్షోభంతో నానా అవస్తలు పడుతున్న శ్రీలంకపై కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడింది. ఆహార, ఆర్ధిక సంక్షోభంపైన కరోనా విరుచుకుపడటంతో దేశంలోకి దిగుమతులన్నీ తగ్గిపోయాయి. ఎప్పుడైతే దిగుమతులు తగ్గిపోయాయో నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ఎప్పుడైతే శ్రీలంక నుంచి ఎగుమతులు ఆగిపోయాయో, పర్యాటక రంగం మందగించిదో వెంటనే విదేశీ మారక నిల్వలపై తీవ్ర ప్రభావం చూపింది. ఒకవైపు ఎగుమతులు ఆగిపోవటం మరోవైపు దిగుమతులు తగ్గిపోవటంతో బ్యాలెన్స్ తప్పిపోయింది. ఎప్పుడైతే దిగుమతులు కూడా తగ్గిపోయాయో దాని ప్రభావం ముందుగా దేశంలో ఉన్న నిత్యావసరాలపై పడింది. దాంతో నిత్యావసరాలకు ఎక్కడలేని డిమాండ్ పెరిగిపోయింది. నిత్యావసరాలకు డిమాండ్ పెరిగిపోవడంతో వ్యాపారస్తులు సరుకు మార్కెట్లోకి పంపకుండా బ్లాక్ చేసేశారు.

డిమాండ్ అవసరాల మేరకు సరుకులను మార్కెట్లోకి పంపకపోవడం తో ధరలు బాగా పెరిగిపోయాయి. ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ధరలపై నియంత్రణను విధించింది. ప్రభుత్వ ఉద్దేశ్యం ప్రకారం ధరలపై నియంత్రణ విధిస్తే ధరలు తగ్గాలి. కానీ వస్తువులు మార్కెట్లోకి రావటం మానేశాయి. అంటే మొత్తం సరుకును వ్యాపారస్తులు దాచిపెట్టేశారన్నమాట. ఫలితంగా ఆహార కొరత బాగా పెరిగిపోయింది. దీంతో జనాలు ఆహారానికి అల్లాడుతున్నారు. ఆకలి బాధల నుండి జనాలను కాపాడాలన్న ఉద్దేశ్యంతో నిత్యావసరాల పై నియంత్రణ ఎత్తేసింది.

ఎప్పుడైతే ప్రభుత్వం నియంత్రణ ఎత్తేసిందో ఒక్కసారిగా ధరలు పెరిగిపోయి ఆకాశాన్నంటాయి. ప్రభుత్వం ఏదో చేయబోతే ఇంకేదో అయినట్లు అర్ధమవుతోంది. మధ్య తరగతి జనాలు కూడా గోధుమపిండి, పంచధార, నూనెలను కొని వారాలు దాటిపోయాయట. కరోనా మహమ్మారి కారణంగా జనాల దగ్గర డబ్బులూ లేక, ఉన్నా కొనేందుకు నిత్యావసరాలు దొరక్క జనాలు అల్లాడిపోతున్నారు. మరి శ్రీలకంలో పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో చూడాల్సిందే.

This post was last modified on October 12, 2021 10:38 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ముద్రగడ వ్యాఖ్యలతో వైసీపీ మునుగుతుందా ?

పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…

2 hours ago

బన్నీ.. పవన్ కోసమేనా అలా?

మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…

3 hours ago

తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…

4 hours ago

తులం బంగారం రూ.2 లక్షలు!

సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…

4 hours ago

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…

5 hours ago

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

6 hours ago