Trends

నా భర్తను ఆఫీసుకు రమ్మని చెప్పండి.. భార్య లేఖ వైరల్


కరోనా మహమ్మారి కారణంగా పని విధానం మొత్తం మారిపోయింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇంటి నుంచి పని చేస్తానని కోరితే.. ఓకే చెప్పేది ఐటీ కంపెనీల్లో మాత్రమే. అది కూడా కొన్ని కంపెనీలకే ఈ సదుపాయం ఉండేది. అలాంటిది కరోనా దెబ్బకు.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అందరికి వర్కు ఫ్రం హోం సదుపాయాన్నిచ్చారు. గతంలో ఎప్పుడూ లేనిది.. కలలో కూడా సాధ్యం కాదనుకున్న మీడియాలోనూ ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని కల్పించారు. మీడియాలోనే అలాంటి అవకాశం ఇచ్చినప్పుడు ఐటీ ఉద్యోగుల సంగతేమిటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు.


ఇప్పటికే కొన్ని కంపెనీలు ఇంటి నుంచి పని చేసే విధానానికి చెల్లుచీటి ఇవ్వగా.. ఎక్కువ కంపెనీలు మాత్రం తమ ఉద్యోగుల్ని ఇంటి నుంచే పని చేసే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నరకు పైనే వర్క్‌ ఫ్రం హోం సాగుతోంది. ఇలాంటివేళ.. ఇంట్లో ఉన్న మహిళల మీద పని భారం తీవ్రంగా పెరిగిపోయింది. అంతేకాదు.. ఇంట్లో ఉండి పని చేసే భర్తకు సేవలు చేయటం తలకు మించిన భారంగా తయారైంది. ఇదెంత ఎక్కువన్న విషయాన్ని తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఒక ట్వీట్ చేశారు.


ఉద్యోగి సతీమణి రాసిన లేఖకు ఎలా స్పందించాలో అర్థం కాలేదంటూ ట్వీట్ చేసిన ఆయన.. ఉద్యోగి భార్య పంపిన మొయిల్ స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు. అందులో.. వర్కు ఫ్రం హోం ఇదే తీరులో మరికొంతకాలం కొనసాగితే.. తన వైవాహిక బంధం ముగియటం ఖాయమని తేల్చేయటం గమనార్హం. ఇంతకూ ఆయనకు అందిన లేఖలో ఉద్యోగి సతీమణి ఏమని చెప్పారంటే..
‘‘సార్.. మీ సంస్థలో పని చేసే మనోజ్ అనే ఉద్యోగి వైఫ్ ను. మీకు సవినయంగా విన్నవించుకునేదేమంటే.. నా భర్తను ఆఫీసుకు వచ్చి పని చేసేలా అవకాశం ఇవ్వండి. అతను ఇప్పటికే వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నాడు. అన్ని కొవిడ్ ప్రోటోకాల్స్ ను పాటిస్తున్నాడు. మీరు ఇలానే మరికొంత కాలం నా భర్తకు వర్క్‌ ఫ్రం హోం ఇస్తే.. మా వైవాహిక జీవితం ముగిసిపోతుంది. ఎందుకంటే.. ఇంటి నుంచి పని చేసే విధానం మొదలైన తర్వాత నుంచి నాకు పని భారంగా విపరీతంగా పెరిగిపోయింది’’ అని వాపోయింది.


వర్క్‌ ఫ్రం హోంతో తానెన్ని కష్టాలు పడుతుందన్న విషయాన్ని సదరు లేఖలో పేర్కొన్నారు. ‘‘నా భర్త రోజుకు పది సార్లు కాఫీ తాగుతాడు. ఒకే గదిలో కూర్చొని పని చేయడు. వేర్వేరు గదుల్లో కూర్చొని పని చేస్తాడు. పైగా అక్కడంతా చెత్త చెత్త చేస్తాడు. రోజుకు ఎన్నిసార్లు తింటాడో లెక్క లేదు. వర్క్ కాల్స్ సమయంలోనూ కూనిక పాట్లు పడుతుంటాడు’ అంటూ ఇంటి నుంచి పని చేసే విధానంలోని లోపాన్ని ఆమె ఎత్తి చూపారు.


అంతేకాదు.. తనకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని.. వారి బాగోగులు చూడటానికి తనకు సమయం సరిపోవటం లేదన్నారు. వారికి తోడు అదనంగా తన భర్త వచ్చి చేరాడని.. అతడికి మరికొంతకాలం ఇదే రీతిలో సేవ చేయటం తన వల్ల కాదని.. తనకు దయచేసి విశ్రాంతి ఇవ్వాలని.. తన భర్తను ఆఫీసుకు తప్పనిసరిగా రావాలంటూ ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ లేఖకు ఎలా స్పందించాలో తనకు అర్థం కావట్లేదని హర్షా గోయెంకా పేర్కొన్నారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ కు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది.

Satya

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

6 minutes ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

49 minutes ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

8 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

8 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

8 hours ago