కరోనా దెబ్బకు అన్ని రంగాల్లాగే క్రీడా రంగమూ కుదేలైంది. ముఖ్యంగా ఉపఖండంలో అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్లో ఏ యాక్టివిటీ లేదు. లాక్ డౌన్ దెబ్బకు జనాలకు వినోదం లేదు. నిర్వాహకులకు ఆదాయం లేదు. ఇప్పటికే వేల కోట్ల నష్టం వాటిల్లింది. వేసవిలో క్రికెట్ ప్రియుల్ని వినోదంలో ముంచెత్తే ఐపీఎల్కు ఈసారి అవకాశమే లేకపోయింది. మళ్లీ ఎప్పుడు ఈ లీగ్ను నిర్వహిస్తారు.. అసలు ఈ ఏడాది ఐపీఎల్ ఉంటుందా లేదా అన్న సందిగ్ధత నెలకొంది.
ఐపీఎల్ను మించిన టోర్నీ అయిన టీ20 ప్రపంచకప్ ఈ ఏడాదే అక్టోబరు-నవంబరు నెలల మధ్య నిర్వహించాల్సి ఉండగా దాని మీదా నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇండియాలో జూన్ ఆరంభం నుంచి ప్రేక్షకుల్లేకుండా మ్యాచ్లు నిర్వహించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. అనేక పరిమితులు, ఆంక్షలు ఉంటాయి.. పైగా వర్షా కాలం మొదలువుతుంది కాబట్టి ఐపీఎల్ వచ్చే మూణ్నాలు నెలల్లో నిర్వహించే అవకాశం లేనట్లే.
ఐతే ఈ ఏడాది ప్రేక్షకుల్లేకుండా అయినా సరే.. ఐపీఎల్ను ఏదో ఒక సమయంలో నిర్వహించి ఎంతో కొంత ఆదాయం రాబట్టాలని బీసీసీఐ చూస్తోంది. దానికి అవకాశం కనిపిస్తున్నది అక్టోబరు, నవంబరు నెలల్లోనే. కానీ అప్పుడే టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. ఐతే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో లాక్ డౌన్ అమలవుతుండటం.. విదేశీ ప్రయాణాలపై ఆంక్షలుండటం.. టోర్నీ జరగాల్సిన ఆస్ట్రేలియా కూడా ఈ విషయంలో స్ట్రిక్టుగా ఉండటంతో షెడ్యూల్ ప్రకారం టోర్నీ జరగడం కష్టంగా ఉంది.
ఇక ఆటగాళ్లకు, చాలా బోర్డులకు కూడా ఐపీఎల్ పట్ల స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక ప్రపంచ క్రికెట్లో మోస్ట్ పవర్ ఫుల్ బాడీ అయిన బీసీసీఐ అక్టోబరు-నవంబరు మధ్య టీ20 ప్రపంచకప్ వద్దని ఐసీసీ మీద ఒత్తిడి తెచ్చి ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహించుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ భవితవ్యాన్ని తేల్చడానికి గురువారం ఐసీసీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఆ టోర్నీని వాయిదా వేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటే.. దాని స్థానంలో ఐపీఎల్ జరగబోతోందని ఫిక్సయినట్లే.
This post was last modified on May 27, 2020 7:56 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…