కరోనా దెబ్బకు అన్ని రంగాల్లాగే క్రీడా రంగమూ కుదేలైంది. ముఖ్యంగా ఉపఖండంలో అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్లో ఏ యాక్టివిటీ లేదు. లాక్ డౌన్ దెబ్బకు జనాలకు వినోదం లేదు. నిర్వాహకులకు ఆదాయం లేదు. ఇప్పటికే వేల కోట్ల నష్టం వాటిల్లింది. వేసవిలో క్రికెట్ ప్రియుల్ని వినోదంలో ముంచెత్తే ఐపీఎల్కు ఈసారి అవకాశమే లేకపోయింది. మళ్లీ ఎప్పుడు ఈ లీగ్ను నిర్వహిస్తారు.. అసలు ఈ ఏడాది ఐపీఎల్ ఉంటుందా లేదా అన్న సందిగ్ధత నెలకొంది.
ఐపీఎల్ను మించిన టోర్నీ అయిన టీ20 ప్రపంచకప్ ఈ ఏడాదే అక్టోబరు-నవంబరు నెలల మధ్య నిర్వహించాల్సి ఉండగా దాని మీదా నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇండియాలో జూన్ ఆరంభం నుంచి ప్రేక్షకుల్లేకుండా మ్యాచ్లు నిర్వహించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. అనేక పరిమితులు, ఆంక్షలు ఉంటాయి.. పైగా వర్షా కాలం మొదలువుతుంది కాబట్టి ఐపీఎల్ వచ్చే మూణ్నాలు నెలల్లో నిర్వహించే అవకాశం లేనట్లే.
ఐతే ఈ ఏడాది ప్రేక్షకుల్లేకుండా అయినా సరే.. ఐపీఎల్ను ఏదో ఒక సమయంలో నిర్వహించి ఎంతో కొంత ఆదాయం రాబట్టాలని బీసీసీఐ చూస్తోంది. దానికి అవకాశం కనిపిస్తున్నది అక్టోబరు, నవంబరు నెలల్లోనే. కానీ అప్పుడే టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. ఐతే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో లాక్ డౌన్ అమలవుతుండటం.. విదేశీ ప్రయాణాలపై ఆంక్షలుండటం.. టోర్నీ జరగాల్సిన ఆస్ట్రేలియా కూడా ఈ విషయంలో స్ట్రిక్టుగా ఉండటంతో షెడ్యూల్ ప్రకారం టోర్నీ జరగడం కష్టంగా ఉంది.
ఇక ఆటగాళ్లకు, చాలా బోర్డులకు కూడా ఐపీఎల్ పట్ల స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక ప్రపంచ క్రికెట్లో మోస్ట్ పవర్ ఫుల్ బాడీ అయిన బీసీసీఐ అక్టోబరు-నవంబరు మధ్య టీ20 ప్రపంచకప్ వద్దని ఐసీసీ మీద ఒత్తిడి తెచ్చి ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహించుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ భవితవ్యాన్ని తేల్చడానికి గురువారం ఐసీసీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఆ టోర్నీని వాయిదా వేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటే.. దాని స్థానంలో ఐపీఎల్ జరగబోతోందని ఫిక్సయినట్లే.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు.…
మార్క్ ఆంటోనీ, గత ఏడాది అజిత్ తో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహార తీరుపై ఇప్పటికే లెక్కలేనన్ని చర్చలు జరిగాయి. అటు సినిమాలు,…
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక సామెత. కొందరు మాత్రం రచ్చ గెలిచి, తర్వాత ఇంటికి వస్తుంటారు. శోభిత…
పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ని నిలబెట్టుకోవాలి.…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…