కరోనా దెబ్బకు అన్ని రంగాల్లాగే క్రీడా రంగమూ కుదేలైంది. ముఖ్యంగా ఉపఖండంలో అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్లో ఏ యాక్టివిటీ లేదు. లాక్ డౌన్ దెబ్బకు జనాలకు వినోదం లేదు. నిర్వాహకులకు ఆదాయం లేదు. ఇప్పటికే వేల కోట్ల నష్టం వాటిల్లింది. వేసవిలో క్రికెట్ ప్రియుల్ని వినోదంలో ముంచెత్తే ఐపీఎల్కు ఈసారి అవకాశమే లేకపోయింది. మళ్లీ ఎప్పుడు ఈ లీగ్ను నిర్వహిస్తారు.. అసలు ఈ ఏడాది ఐపీఎల్ ఉంటుందా లేదా అన్న సందిగ్ధత నెలకొంది.
ఐపీఎల్ను మించిన టోర్నీ అయిన టీ20 ప్రపంచకప్ ఈ ఏడాదే అక్టోబరు-నవంబరు నెలల మధ్య నిర్వహించాల్సి ఉండగా దాని మీదా నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇండియాలో జూన్ ఆరంభం నుంచి ప్రేక్షకుల్లేకుండా మ్యాచ్లు నిర్వహించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. అనేక పరిమితులు, ఆంక్షలు ఉంటాయి.. పైగా వర్షా కాలం మొదలువుతుంది కాబట్టి ఐపీఎల్ వచ్చే మూణ్నాలు నెలల్లో నిర్వహించే అవకాశం లేనట్లే.
ఐతే ఈ ఏడాది ప్రేక్షకుల్లేకుండా అయినా సరే.. ఐపీఎల్ను ఏదో ఒక సమయంలో నిర్వహించి ఎంతో కొంత ఆదాయం రాబట్టాలని బీసీసీఐ చూస్తోంది. దానికి అవకాశం కనిపిస్తున్నది అక్టోబరు, నవంబరు నెలల్లోనే. కానీ అప్పుడే టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. ఐతే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో లాక్ డౌన్ అమలవుతుండటం.. విదేశీ ప్రయాణాలపై ఆంక్షలుండటం.. టోర్నీ జరగాల్సిన ఆస్ట్రేలియా కూడా ఈ విషయంలో స్ట్రిక్టుగా ఉండటంతో షెడ్యూల్ ప్రకారం టోర్నీ జరగడం కష్టంగా ఉంది.
ఇక ఆటగాళ్లకు, చాలా బోర్డులకు కూడా ఐపీఎల్ పట్ల స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక ప్రపంచ క్రికెట్లో మోస్ట్ పవర్ ఫుల్ బాడీ అయిన బీసీసీఐ అక్టోబరు-నవంబరు మధ్య టీ20 ప్రపంచకప్ వద్దని ఐసీసీ మీద ఒత్తిడి తెచ్చి ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహించుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ భవితవ్యాన్ని తేల్చడానికి గురువారం ఐసీసీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఆ టోర్నీని వాయిదా వేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటే.. దాని స్థానంలో ఐపీఎల్ జరగబోతోందని ఫిక్సయినట్లే.
This post was last modified on May 27, 2020 7:56 pm
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…